The Young Gen is watching!!
Hear out to the honest response of my son #Siraj about #GameChanger ❤️
The impact of @AlwaysRamCharan Anna's performance & @shankarshanmugh's awakening vision will stay with us💥
Go watch it with your family in theaters today 🤩 @SVC_official
నిన్న గేమ్ ఛేంజర్ మూవీ చూసాను
చాలా బాగుంది
ఒక కలెక్టర్ చెయ్యాల్సిన విధి విధానాలు పొలిటికల్ సిస్టం లో జరుగుతున్న అవినీతి చాలా క్లియర్ గా చూపించారు
ప్రజలు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలను పొందుపరిచా��ు
అప్పన్న పాత్రలో @AlwaysRamCharan జీవించేశారు
ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా
*గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి శుభాకాంక్షలు…
*మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పేరిట రికార్డు రావడం చాలా ఆనందం కలిగించింది
*మోస్ట్ ప్రొలిఫిక్ డాన్సర్ గా శ్రీ చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రదానం చేయడం అభినందనీయం
*537 పాటలు, 24 వేల డ్యాన్స్ మూమెంట్లకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రావడం, నటుడిగా, కళాకారుడిగా తెలుగు సినిమా రంగా���ికి చేసిన సేవలు చిరస్మరణీయం ..💐💐 @KChiruTweets @PawanKalyan @JanaSenaParty @mnadendla
ఏడుకొండలవాడా..! క్షమించు
•11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ���దిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం.
లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్ర���యశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను.
22 సెప్టెం��ర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటాను.
భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది.
వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది.
ధర్మో రక్షతి రక్షితః