Along with District Additional Collector (Local Bodies) K. Srinivas, and reviewed the implementation of leprosy control measures in the district, as well as the protection of human rights of people affected by the disease
On Wednesday, 18-02-2026, NHRC Leprosy Special Monitor Dr. Pradeepta Kumar Nayak participated in a district-level review meeting under the auspices of the Medical and Health Department at the Mini Conference Hall in the IDOC building, RangaReddy District, Telangana State.
24.10.2024 గురువారం
జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు కలెక్టరేట్ సమావేశ హాలులో ఎస్ బి ఎమ్, వనమహోత్సవం, జలశక్తి అభియాన్ తదితర అంశాలపై MPDOలు తీసుకోవాల్సిన తగిన కార్యాచరణ గురించి ఆదేశాలు జారీచేశారు. @TelanganaCMO@TelanganaCS
22-10-2024 మంగళవారం రంగారెడ్డి జిల్లా, TGPSC గ్రూప్-I మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్న ఇబ్రహీంపట్నంలోని CVR Engg కళాశాలలో పరీక్ష సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు. @TelanganaCMO@TelanganaCS
21-10-2024 సోమవారం రంగారెడ్డి జిల్లా, గ్రూప్-I మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్న గండిపేట (MGIT) మరియు మొయినాబాద్ (VJIT & JBIT) మండలంలోని పరీక్ష సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు. @TelanganaCMO@TelanganaCS
18.10.2024 శుక్రవారం
జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు జిల్లా కలెక్టరేట్ సమావేశ హాలు నుంచి VC ద్వారా LRS దరఖాస్తులు, HMDA చెరువుల ఫైనల్ నోటిఫికేషన్ మరియు ధరణి దరఖాస్తుల సత్వర పరిశీలన కోసం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. @TelanganaCMO@TelanganaCS
14.10.2024 సోమవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమవేశ మందిరం లోని ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. @TelanganaCMO@TelanganaCS
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయ దశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని..
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని...
చేపట్టిన ప్రతీకార్యం సఫలీకృతం కావాలని మనసారాకోరుకుంటూ,
మీకు మీ కుటుంబసభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు!
LIVE : Hon’ble Chief Minister Sri.A.Revanth Reddy participates in Laying Foundation Stone for Young India Integrated Residential School Complex at Kondurg Village, RR Dist https://t.co/QXghYekZ7P
తండాలు, మారుమూల పల్లెలు, బస్తీల్లో నివసించే నిరుపేదలకు మంచి వైద్యం, నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి @revanth_anumula గారు పునరుద్ఘాటించారు. నిరుపేదలను విద్యకు దూరం చేయకూడదన్న ఆలోచనతో చాలా మంది మేధావులు, సామాజిక తత్వవేత్తలతో చర్చించిన మీదట యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.
➡️దసరా పండుగ శుభ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గ్లో ఇంటిగ్రేటెడెట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదిక నుంచి మాట్లాడుతూ ఆ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు.
➡️ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వేర్వేరు చోట్ల విద్యా బోధన వల్ల ఈ వ్యవస్థ మమ్మల్ని దూరం పెడుతుందన్న భావన విద్యార్థుల్లో కలిగే ప్రమాదం ఉంది. అలాంటి భావన సమాజానికి, దేశానికి మంచిది కాదు. అందుకే పాతిక ఎకరాల్లో ఒకే క్యాంపస్లో అందరూ కలిసిమెలిసి ఒక సోదర భావంతో చదువుకుని రాణించాలన్న సంకల్పంతో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం.
➡️నిరుపేదలకు అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఒక్కోచోట 120 నుంచి 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ క్యాంపస్లకు శంకుస్థాపన చేస్తున్నాం.
➡️ఒక్కో రెసిడెన్షియల్ స్కూల్లో దాదాపు 2500 మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుకుని, భవిష్యత్తులో వారంతా ఉన్నతస్థాయికి ఎదగాలని, తద్వారా వారు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.
➡️నిరుపేదలను విద్యకు దూరం చేస్తే ఈ దేశ సంపదకే తీవ్ర నష్టం చేసిన వారమవుతాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో దాదాపు 5 వేల పాఠశాలలు మూసివేయబడ్డాయి. తద్వారా ముఖ్యంగా దళితులు, గిరిజనులు విద్యకు దూరమయ్యే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
➡️పేదల కోసం పనిచేసే అధికారులను తప్పనిసరిగా ప్రభుత్వం, ప్రజలు ఎప్పుడూ అభినందిస్తారు. విద్యా ప్రమాణాలను పెంచాలన్న లక్ష్యంతోనే సుదీర్ఘ కాలంగా ప్రమోషన్లు లేక ఆందోళనకు గురవుతున్న సందర్భంలో రాష్ట్రంలో 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించడమే కాకుండా ఎక్కడా వివాదాలకు తావులేకుండా 34 వేల మంది టీచర్లను బదిలీలు చేశాం.
➡️ఈ శంకుస్థాపన కార్యక్రమలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
➡️"భగవంతుడు ప్రజలకు సుఖశాంతులు కలిగించాలి. పాడిపంటలు ఇవ్వాలని, పిల్లలకు మంచి చదువులు, ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.
#YoungIndiaIntegratedResidentialSchools #Telangana #TelanganaRising
11-10-2024 శుక్రవారం
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల పనులకు శంకుస్థాపన చేశారు. @TelanganaCMO@TelanganaCS
09.10.2024 బుధవారం
జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలను (మహేశ్వరం) తనిఖీ చేసి, అక్కడ మౌలిక సదుపాయాలు త్వరితగతిన కల్పించాలని సంబంధిత కళాశాల యాజమాన్యానికి సూచించారు. @TelanganaCMO@TelanganaCS
08.10.2024 మంగళవారం రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు. @TelanganaCMO@TelanganaCS
07.10.2024 సోమవారం గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారితో కలిసి కడ్తాల్ మండల నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు పాల్గొన్నారు
@TelanganaCMO@TelanganaCS
07.10.2024 సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డివిజన్ లోని అత్తాపూర్ నందు "FDC" పైలట్ సర్వేను తనిఖీచేసిన శ్రీ అజిత్ రెడ్డి గారు, ప్రత్యేక కార్యదర్శి, CMO Office.@TelanganaCMO@TelanganaCS
07.10.2024 సోమవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమవేశ హాలు నుంచి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. @TelanganaCMO@TelanganaCS
05.10.2024 శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నూతన పురపాలక కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మరియు రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు. @TelanganaCMO@TelanganaCS
04.10.2024 శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజన్ మరియు మండలంలోని దేవరాంపల్లి గ్రామము నందు "FDC" పైలట్ సర్వేను పర్యవేక్షించిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారి శ్రీమతి డి.దివ్య, IAS, CEO, SERP గారు. @TelanganaCMO@TelanganaCS
03.10.2024 గురువారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు కలెక్టరేట్ VC ద్వారా Rdos, తహసీల్దార్లు మరియు మున్సిపల్ కమీషనర్లను మరియు ఇరిగేషన్ అధికారులను HMDA చెరువుల ఫైనల్ నోటిఫికేషన్, ధరణి దరఖాస్తులు, LRS దరఖాస్తులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. @TelanganaCMO@TelanganaCS
03.10.2024 గురువారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సన్న వరి ధాన్యనికి రు.500 అదనపు బోనస్ ఇస్తూ, వరి సేకరణ పకడ్బందీగా జరిగేలా చూడాలని VC ద్వారా జిల్లా కలెక్టర్ల కు ఆదేశాలు జారీచేశారు. @TelanganaCMO@TelanganaCS