తమిళనాడులో విక్రమార్కుడు గుండు సీన్ రిపీట్
గుండు చేయించుకుంటే రూ.15 వేలు ఇస్తామని ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి, నమ్మి గుండు చేయించుకున్న మహిళలు
ఆకతాయిల పని అని తెలిసి వాపోయిన బాధితులు
తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ ప్రాంతంలో కరోనా లాంటి కొత్త రకం వ్యాధి సోకుతుందని భయపెట్టిన దుండగుడు
విదేశాల్లో ఈ వ్యాధి సోకిన వారంతా గుండు గీయించుకున్నారని, తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుందని తెలిపిన సదరు వ్యక్తి
గుండు గీయించుకున్న మహిళలకు రూ.15 వేలు, కాలేజ్ విద్యార్థినులకు అయితే రూ.45,000, ఉచిత ల్యాప్టాప్, పురుషులకు అయితే రూ.6,000 ఇస్తామని, లిస్టులో మీ పేరు ఉందని మీకు ఫోన్ చేస్తున్నామని ఓ మహిళను నమ్మించిన దుండగుడు
ఆ మహిళ ఈ విషయాన్ని స్థానిక మహిళలందరికీ చెప్పడంతో, గుండు గీయించుకున్న ముగ్గురు మహిళలు
అనంతరం దుండగుడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించి ఆవేదన వ్యక్తం చేసిన బాధిత మహిళలు