అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2.
అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి... 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్న�� పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2.
కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసింది.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ..
ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదాం..
విద్రోహ శక్తుల నుండి
మన ��ెలంగాణను కాపాడుకుందాం.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు 💐
జై కేసీఆర్ ✊
జై తెలంగాణ ✊
The Aura 🔥
Telangana’s largest Govt hospital - the 2400 bedded MGM super speciality hospital at Warangal
A testament to what can be built when we put people first
#JaiKCR#JaiTelangana
This is KCR’s vision turning into reality!
BRS government prioritized healthcare and started the construction of three prestigious Telangana Institute of Medical Sciences (TIMS) hospitals in Hyderabad to meet the needs of the city’s growing population.
Glad to visit the Sanathnagar TIMS Hospital today, where world-class medical services for poor and middle-class families have finally begun despite delays caused by the Congress government’s negligence.
ఎద్దేడ్చిన ఎవుసం... రైతేడ్చిన రాజ్యం బాగుపడవు!
జనగామ నియోజకవర్గంలోని యశ్వంతాపూర్ గ్రామంలో 15 రోజులుగా పంట కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులను ఈ రోజు కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నాను.
పంట కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని రైతులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాళ్లు కూడా ���్పందించకపోవడం శోచనీయం.
అక్కడి నుండే మార్క్ఫెడ్ ఎండీతో మాట్లాడి వెంటనే పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేసాను.
ధాన్యం, శనగలు, మొక్కజొన్నలు, ఇతర అన్ని పంటలను వెంటనే కొనుగోలు చేయకుంటే, ఎక్కడికక్కడ రోడ్లెక్కి రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాం.
ధాన్యం దళారులపాలు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది.
పంటల కొనుగోలులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను తెలుసుకునేందుకు.. నిన్న సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించాను.
కేసీఆర్ ప్రభ��త్వం ఉన్నప్పుడు ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతీ గింజను ప్రభుత్వమే కొంటుండె.. ఇప్పుడు పంటలు కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ తప్పించుకుంటుంది.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పిట్టల్లా రాలుతున్నా.. ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదు.
రైతులు పండించిన ప్రతీ గింజను ఎటువంటి ఆంక్షలు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస���తున్నాను.
Glad to interact with the energetic team of @StreetCause, a student-led NGO shaping socially responsible young leaders across colleges.
Their journey of impacting 1.3M+ lives over 17 years reflects the true power of youth-driven change.
Proud to support their mission and launch 'https://t.co/7USRLI5BEt’ to strengthen their initiatives further.
My best wishes to 'Street Cause' for continued success and greater impact ahead.
నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా…
పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం!
స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ ..
సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశం!
25 వసంతాల మైలురాయిని అధిగమించిన
మహోజ్వల లాంగ్ మార్చ్!
బీఆర్ఎ��్ రాజకీయ పార్టీ కాదు …ఒక విప్లవం!
పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు, నాయకులకు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ✊
జై తెలంగాణ ✊
#KCR #Telangana
సత్యమేవ జయతే ✊
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు.
పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా ట్రాష్.. చెత్త బుట్టలో వేయా��్సిందే!
కమిషన్ పేరుత�� కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బతీయాలనే రేవంత్ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టిన హైకోర్టు.
జై తెలంగాణ ✊
#KaleshwaramProject
అంబేద్కర్ కీర్తి అజరామరం.. అంబేద్కర్ స్ఫూర్తి చిరస్మరణీయం!
అణగారినవర్గాల అభ్యున్నతికి అహర్నిశ��ు శ్రమించిన మహనీయులు అంబేద్కర్.
పీడిత ప్రజల పక్షాన పోరాడిన విశ్వమానవుడు అంబేద్కర్.
సబ్బండ వర్గాల ప్రజలకు హక్కులు పంచిన సమ సమాజ స్వాప్నికుడు అంబేద్కర్.
భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన మహా మేధావి అంబేద్కర్.
ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేరేలా చేసిన దార్శనికుడు అంబేద్కర్.
బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన సాగింది.. భవిష్యత్తులోనూ కొనసాగుతుంది.
అంబేద్కర్ గారి బోధనలను, ఆశయాలను, విలువలను భావితరాలకు అందించేలా.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ గారి పేరుపెట్టి వారికి సమున్నత గౌరవాన్ని కల్పించ���ంది.
భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహోన్నతుడికి ఘన నివాళులు 💐
జోహార్ అంబేద్కర్! జై భీమ్!
Deeply saddened by the passing of the legendary Asha Bhosle Ji. An unparalleled voice that touched billions of hearts across the globe
From the soulful "Abhi Na Jao Chhod Kar" to her countless hits, her versatility and soul will remain immortal through her melodies
My heartfelt condolences to her family and admirers. 🙏
#AshaBhosle
Spoke at the 21st India Business Conference at @Columbia_Biz, NYC. Shared my experiences about the remarkable growth story of Telangana.
Telangana was born out of struggle and sacrifice. And under the able leadership of our leader KCR garu, became a trendsetter state for the rest of the nation within a decade.
The depth of dialogue around business, innovation, and policy future at the Columbia India Business Conference 2026 was truly inspiring. Grateful to the organizers and every attendee who made it a remarkable forum.
#TelanganaDecade
ఇది ప్రజాస్వామ్య జయకేతనం..!!
అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను BRS కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయం
మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు
ఇంద���కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, తమ్ముడు @balkasumantrs గారికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు @ManchireddyBRS గారికి, తమ్ముడు @BuntyBRS గారికి, పార్టీ నాయకులు, శ్రేణులకు పేరుపేరునా అభినందనలు
అడ్డదారుల్లో వీటిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, రకరకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా వేటికి లొంగకుండా మొక్కవోని దీక్షతో ఒక్క తాటిపై నిలిచిన కౌన్స��లర్లకు ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నా
క���యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు మిత్రపక్షమైన సిపిఐ కామ్రేడ్లు అడుగడుగునా కనబరిచిన పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకం
అణచివేతకు, బెదిరింపులకు, అవినీతి అక్రమాలకు, అప్రజాస్వామిక చర్యలకు తెలంగాణలో తావులేదని ఈ తీర్పు తేల్చిచెప్పింది.
రెండున్నరేళ్లలోనే పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైందని ఈ ఫలితాలు నలుదిశలా ��ాటి చెప్పాయి
అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టించిన గులాబీ జెండా సైనికులను పార్టీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.
ఈ విజయాలు అందించిన స్ఫూర్తిని కొనసాగిద్దాం.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అడుగడుగున విధ్వంసం చేస్తున్న రేవంత్ సర్కారుకు బుద్ధి చెబుదాం
జై తెలంగాణ
జై కేసీఆర్
జై బీఆర్ఎస్
తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్��ి - తొలి అమరుడు దొడ్డి కొమరయ్య.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం పోరాడి అమరత్వం పొందిన వీరుడు దొడ్డి కొమరయ్య.
వారి పోరాట చరిత్రను భావితరాలకు చాటిచెప్పేలా... దొడ్డి కొమరయ్య జయంతి, వర్థంతులను అధికారికంగా నిర్వహించి కేసీఆర్ గారి ప్రభుత్వం వారిని గౌరవించుకుంది.
దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు ✊
రైతుబంధు పాలన పోయి
రాబందుల పాలన వచ్చె!
పండించిన పంటను కాంగ్రెస్ సర్కారు కొనకపోవడంతో నానాకష్టాలు పడుతున్న రైతన్నల గోడు ��ెలుసుకునేందుకు గత నవంబర్ 18 నాడు నేను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్కు వెళ్లాను.
అంతకు ముందురోజే మీడియాతో తన కష్టాలు చెప్పుకుంటూ కళ్లనీళ్ల పర్యంతం అయ్యాడు ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ(బీ)కి గ్రామానికి చెందిన తుడుం గణపతి. నాలుగు రోజులుగా మార్కెట్ యార్డులో ఉంటున్నా తన సోయాబీన్ పంటను కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాంగ్రెస్ సర్కారు ఇట్లాగే పంటను క��నకుండా వేధిస్తే, తనకు మరణం తప్ప మరోమార్గం లేదని రోదించాడు.
రుణమాఫీ కాక, రైతుభరోసా రాక, అప్పుల బాధ తీవ్రమై మూడు రోజుల క్రితం గణపతి ఆత్మహత్య చేసుకున్నాడు
ఇది ఆత్మహత్య కాదు.
ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యనే!
Horrific and haunting Images of a funeral site of 165 young girls killed in Israeli/US bombing that hit a school in Iran
No matter what the stated purpose is, this is a man made tragedy which leaves nothing behind but suffering and misery for ages to come
#StopTheWar
Such callousness with human lives !! Even basic precautions such as a harness and helmet are missing and not even to mention what could happen if the girders slip and fall
The Engineering team of GHMC should be taken to task and the agency should be black listed for endangering safety of workers and commuters
కాంగ్రెస్ కబంద హస్��ాల్లో చిక్కుకుని రెండేళ్లుగా విలవిలలాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు.. చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదు.
ప్రతి పల్లెలో పచ్చదనం ఉండాలనే మహోన్నత లక్ష్యంతో కేసీఆర్ గారు నిర్మించిన పల్లె ప్రకృతి వనాలపై కూడా పగబట్టడం దుర్మార్గమైన చర్య.
మహబూబ్ నగర్ లోన��� దేవరకద్ర మండలం జీనుగురాలలో పల్లె ప్రకృతి వనంలోని 200 చెట్లను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే నిర్దాక్షిణ్యంగా నరికివేయడం దారుణం.
పదేళ్లపాటు ఆహ్లాద వాతావరణంలో కళకళలాడిన పల్లెలను అన్నిరకాలుగా ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నిజస్వరూపం రోజుకో రూపంలో బయటపడుతోంది.
ఇప్పటికే చెక్ డ్యామ్ లను పేల్చివేస్తున్నారు. చెరువులను చెరబట్టారు. వ్యవసాయాన్ని కుప్పకూల్చారు. కులవృత్తులను కాలరాశారు. ఇప్పుడు నీడనిచ్చే చెట్లను కూడా అడ్డంగా నరికేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఈ దుశ్చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలి.
“పల్లె కన్నీరు పెడుతుందో” అని మరోసారి పాడుకునే దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ పార్టీపై తెలంగాణలోని ప్రతి గ్రామం తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది.
జై తెలంగాణ