నేతన్నల కోసం.ప్రధాని మోదీ మరో వీడియో!*
ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవ సందర్బంగా 1905 స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో నేతన్నల కష్టాన్ని గౌరవించాలని, కనీసం ఒక్క చేనేత ఉత్పత్తినైనా కొనుగోలు చేసి వారి కుటుంబాలకు మద్దతుగా నిలవాలని ప్రధాని మోదీ గారు పిలుపునిచ్చారు..
@PMOIndia@iamabhaypatil
చైనా కవ్వింపులకు భయపడే కాలం పోయింది.
నేటి భారత్ ఏ దేశాన్నీ కవ్వించదు, కానీ తన జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టదు.
అత్యాధునిక సైనిక శక్తితో సమాధానం చెప్పేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.
మన జాతీయ అధ్యక్షుల చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా 9 బిజెపి జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం జరగడం అత్యంత సంతోషకరం. రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైన ఈ ప్రధాన కార్యాలయంతో పాటు, రాష్ట్రంలోని మరో 8 కార్యాలయాలను వర్చువల్ విధానంలో ఒకేసారి ప్రారంభించుకున్నాం.
ఈ శుభ సందర్భంలో రంగారెడ్డి జిల్లా రూరల్ కార్యకర్తలకు, నాయకులకు మరియు రాష్ట్రవ్యాప్త party శ్రేణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనకు పార్టీ కార్యాలయం అనేది కేవలం ఒక కట్టడం కాదు, అదొక పవిత్రమైన దేవాలయం లాంటిది. ఈ దేవాలయం నుంచే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. తెలంగాణలో బిజెపి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడమే లక్ష్యంగా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేసేలా ఈ కార్యాలయాల నుంచే వ్యూహాలు రచిస్తూ ముందుకు కదులుదాం.
- శ్రీ @N_RamchanderRao గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
#NitinNabinInTelangana #NextTelangana
కరీంనగర్ మండలంలోని బావుపేట వద్ద రోడ్డుపై నీళ్లు నిలవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతున్న విషయాన్ని గమనించి, వెంటనే జిల్లా కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించడం జరిగింది.
వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో ఈ సమస్య తలెత్తడం, త్వరలోనే పాఠశాలలు కూడా పునఃప్రారంభం కానుండటంతో విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, ప్రస్తుతానికి నీరు నిలవకుండా యుద్ధప్రాతిపదికన తాత్కాలిక చర్యలు చేపట్టాలని కోరాను.
నా విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన కలెక్టర్ గారు.. అధికారులను పంపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గౌరవ కలెక్టర్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు, రోడ్డుపై నిలిచిన నీటిని మళ్లించే పనులను ప్రారంభించారు.
సమస్యపై త్వరితగతిన స్పందించిన కలెక్టర్ గారికి, అధికారులకు అభినందనలు.
వృద్ధ దంపతుల్లో భర్త చనిపోతే భార్యకు ట్రాన్స్ఫర్ కావాల్సిన పెన్షన్ విషయంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను సవరిస్తే అర్హులైన వారికి లబ్దిజరుగుతుంది
దయచేసి వెంటనే సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడమైనది..
@TelanganaCMO@revanth_anumula@BJP4Telangana