గిరిజనుల ఆరాధ్య దైవం అయిన సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలకు కోటి రూపాయలు మంజూరు చేసిన పెద్దలు పూజ్యులు దైవసమానులు ముఖ్యమంత్రి #కేసీఆర్ గారికి
గిరిజన జాతి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
మీ
బాణోత్ శంకర్ నాయక్
మహాబూబాబాద్ శాసనసభ్యులు
వన దేవతలు...కోరిన కోరికలు తీర్చే కల్పవల్లులు మేడారం సమ్మక్క సారక్క తల్లులను నేడు దర్శించుకోవడం జరిగింది
ఆ తల్లుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాను
నేడు మహబూబాబాద్ నియోజకవర్గంలోని నెల్లికుదురు మండలం వావిలాల గ్రామం పర్యటించి పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం 3,63000 రూ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది
"గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం"
నేడు మహబూబాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాలు పర్యటించి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు తగు సూచనలు చేయడమే కాకుండా రోడ్డు నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేయడం జరిగింది
రెండో విడత "పల్లె ప్రగతి" కార్యక్రమంలో భాగంగా నేడు మహబూబాబాద్ మండలంలోని అమనగల్ గ్రామం పర్యటించి గ్రామ సభలో పాల్గొని పల్లె ప్రగతి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై చర్చించడం జరిగింది
★గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి #కేసీఆర్ గారి లక్ష్యం
మనసున్న మారాజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ ముఖ్యమంత్రి #కేసీఆర్ గారు మరియు ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనే సదుద్దేశంతో ప్రతి ఏటా అయ్యప్ప మహా పడి పూజ నిర్వహిస్తూ వస్తున్నాను
నిన్న నా ఆహ్వానానికి మన్నించి పడి పూజకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు
నేడు నియోజకవర్గంలోని కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామం పర్యటించి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి..ఆ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన నర్సరీని ప్రారంభించడం జరిగింది
గ్రామ ప్రజలు వీలైనన్ని మొక్కులు నాటి హరిత తెలంగాణకు సహకరించాలని కోరడం జరిగింది
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 ను నర్సింగ్ ఇయర్ గా ప్రకటించడం నర్సింగ్ వృత్తికి దక్కిన గౌరవంగా భావిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్యంలో నిత్యం సేవలు అందిస్తున్న ప్రతి నర్సుకు నా శుభాకాంక్షలు
నేడు మహబూబాబాద్ పరిధిలోని 36 వార్డుల తెరాస అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించి..వారికి దిశా నిర్ధేశం చేయడం జరిగింది
ప్రతి ఒక్కరూ పూర్తి సమన్వయంతో పనిచేసి మహబూబాబాద్లోని 36కు36 వార్డులలో టీఆర్ఎస్ జెండా ఎగరేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాలని కోరడం జరిగింది
క్రైస్తవ సోదరసోదరీమణులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.
సాటి మనుషుల పట్ల ప్రేమను, శాంతియుత సహజీవనం, సహనం, శత్రువుల పట్ల క్షమాగుణం.. ఇవన్నీ మానవాళికి క్రీస్తు తన జీవితం ద్వారా ఇచ్చిన మహోన్నత సందేశం
ఆయన బోధించిన ప్రేమ, ధర్మం, దయ, కరుణలు అందరికీ మార్గదర్శకం
అన్నం పెట్టే రైతన్నల గోసను అర్థం చేసుకున్న ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి #కేసీఆర్ గారు
రైతన్నలు కలకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లాలి
రైతులందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు