రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, తిరుపతి (దామినేడు) లో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం బహిరంగ సభలో కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారితో కలిసి పాల్గొన్నాను.
ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా కలవడం సంతోషంగా ఉంది. మన నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు కీలక సమస్యలను, తక్షణమే పరిష్కరించాల్సిన ప్రజా అవసరాలను వారి దృష్టికి తీసుకెళ్లాను. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు.
#2YrsOfTrustDevelopmentWelfare #VemireddyPrabhakarReddy
Warm birthday greetings to Shri @CMRamesh_MP Garu, Hon’ble Member of Parliament from Anakapalle.
Wishing you a year filled with good health, happiness, and greater accomplishments in public service. May you continue to serve the people with dedication, vision, and unwavering commitment, contributing to the progress and prosperity of our nation.
#2YrsOfTrustDevelopmentWelfare
రెండేళ్ల కూటమి పాలన..
సంక్షేమంలో నమ్మకం..
అభివృద్ధిలో నూతన శకం..
సూపర్ సిక్స్ నుంచి సూపర్ గ్రోత్ వరకు..
అన్న క్యాంటీన్ నుంచి అమరావతి వరకు..
సుపరిపాలన నుంచి పోలవరం వరకు..
రైతుకు అండగా... మహిళకు రక్షణగా.. యువతకు తోడుగా..
#IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
బడీ పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. బాలల అందమైన బాల్యాన్ని బడిలోనే గడపనిద్దాం. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా.. బాలల హక్కులకు బాసటగా నిలుద్దాం..
#WorldDayAgainstChildLabour
#2YrsOfTrustDevelopmentWelfare
ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయింది. గత పాలన చూసిన ప్రజలు, రాష్ట్రాన్ని బాగు పరిచే బాధ్యత మనకు అప్పగించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం–అభివృద్ధి–సుపరిపాలన అందిస్తోంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత లోకేష్ గారు భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం. అధికారాన్ని బాధ్యతగా, పాలకులు అంటే సేవకులుగా భావిస్తూ పనిచేస్తున్నాం. రాష్ట్రాభివృద్దికి పూర్తిగా సహకరిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు.
@narendramodi@ncbn@PawanKalyan@naralokesh
అమరావతి కేంద్రంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మల్టీస్టోరేజ్ నివాసాలు, సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం 22.53 ఎకరాల భూమిని సీఆర్డీఏ కేటాయించింది. 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్ , 17 ఎకరాల్లో నివాస సముదాయం General Pool Residential Accommodation (GPRA) నిర్మించనున్నారు. రూ.2,534 కోట్ల ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
#VemireddyPrabhakarReddy #ChandrababuNaidu #Amaravati #AndhraPradesh
ఢిల్లీలో సీఎం గారికి సాదర స్వాగతం పలికిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
ఢిల్లీ విమానాశ్రయంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలికారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డిఏ ముఖ్యమంత్రుల సమావేశం జరుగుంది.. ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరుకావడానికి సిఎం చంద్రబాబు నాయుడు గారు బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు...
AdminPost
#ChandraBabuNaidu #VemireddyPrabhakarReddy #NelloreMP
తెలుగు సినీ కళామాతల్లి ముద్దుబిడ్డ, ఆదర్శ ప్రజాప్రతినిధి నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
నటుడిగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో వెండితెర దైవంగా నిలిచి, ప్రజాసేవలో హిందూపూర్ శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న లీడర్ ఆయన. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆయన సేవా నిరతి అనన్యసామాన్యం.
బాలకృష్ణ గారు భవిష్యత్తులో మరిన్ని ఘన విజయాలు సాధిస్తూ, భగవంతుని కృపతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను.
#HappyBirthdayNBK
#LongestServingElectedPMModi
"సబ్కా సాథ్... సబ్కా వికాస్... సబ్కా విశ్వాస్" అనే స్ఫూర్తిదాయక నినాదాన్ని సాకారం చేస్తూ దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నాయకుడు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు.
స్వతంత్ర భారత చరిత్రలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై, అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానమంత్రిగా సేవలందించిన నాయకుడిగా చారిత్రాత్మక మైలురాయిని అధిరోహించిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు.
ఈ ఘనత కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు... దేశ అభివృద్ధి, సుపరిపాలన, సంక్షేమం, ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన దూరదృష్టి నాయకత్వానికి ప్రజలు అందించిన గౌరవం.
"వికసిత్ భారత్ – 2047" లక్ష్య సాధనలో మీ నాయకత్వంలో భారతదేశం మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
#NarendraModi #ViksitBharat @PMOIndia@narendramodi
జూన్ 5న 'గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026' అంతర్జాతీయ అవార్డుల వేడుకల్లో ప్రతిష్ఠాత్మక 'బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్' అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్ కు పర్యాటకంలో మరో అవార్డు దక్కింది. ‘ఇండియా టుడే’ నేషనల్ సర్వేలో ‘ఇండియన్ రూట్స్-ఎడిటర్స్ ఛాయిస్’ విభాగంలో విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణానికి మొదటి స్థానం దక్కింది.
#AndhraPradesh #APTourism #andhrapradeshtourism
మంగళవారం వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సెలర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు. ఆయనకు పుష్ఫగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికాం. అలానే శ్రీ వేంకటేశ్వర స్వామి జ్ఞాపిక అందజేసి సత్కరించాం. గౌరవ డాక్టరేట్లు అందుకున్న డాక్టర్ కె.వి. వరప్రసాద్ రెడ్డి (పద్మభూషణ్ అవార్డు గ్రహీత, శాంతా బయోటెక్నిక్స్ చైర్మన్), శ్రీ గోబర్ధన్ దాస్ (నీతి ఆయోగ్ సభ్యులు), శ్రీ బీదా మస్తాన్ రావు (రాజ్యసభ సభ్యులు) గారిని శాలువా కప్పి సత్కరించి, పుష్ఫగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశాం.
@governorap
#VemireddyPrabhakarReddy #ApGovernor #AbdulNazeer #Nellore
విక్రమ సింహపురి యూనివర్సిటీ 10, 11, 12వ స్నాతకోత్సవానికి నెల్లూరుకి విచ్చేసిన గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ గారికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికాను.
@governorap#ApGovernor#AbdulNazeer#VemireddyPrabhakarReddy #Nellore
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన విషాదకర ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు ఘన నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
గాయపడిన వారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నాను. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం అభినందనీయం.
ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
బీహార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన మరొకరు మృతి చెందడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే నా కార్యాలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నెల్లూరు, ఢిల్లీ కార్యాలయాల ప్రతినిధులు బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. గాయపడిన 15 మందికి మెరుగైన వైద్య సేవలు అందేలా, అవసరమైన సహాయక చర్యలు వేగంగా జరిగేలా పర్యవేక్షిస్తున్నాను.
బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాను.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి దర్శించుకున్నాను.
స్వామివారి దివ్య ఆశీస్సులు, కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై నిత్యం నిండుగా కురవాలని, అందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరిసంపదలు ప్రసాదించాలని ప్రార్థించాను.
#Tirumala #Tirupati #LordVenkateswara #TTD
#SriVenkateswaraSwamy
కూటమి (NDA) తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన చింతకాయల విజయ్ గారు (తెలుగుదేశం), సానా సతీష్ గారు (తెలుగుదేశం), భాష్యం రామకృష్ణ గారు (తెలుగుదేశం), లింగమనేని రమేష్ గారు (జనసేన) కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు.
మన గౌరవ ముఖ్యమంత్రి @ncbn గారు, గౌరవ ఉపముఖ్యమంత్రి @PawanKalyan గారు, యువనేత @naralokesh గారి నాయకత్వంలో, పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరంతా సమర్థవంతంగా గళం విప్పుతారని ఆశిస్తున్నాను. మీ పార్లమెంటరీ ప్రస్థానం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#RajyaSabha #ChandraBabuNaidu #PawanKalyan #NaraLokesh #TeluguDesamParty
#JanaSena #AndhraPradesh
కందుకూరు నియోజకవర్గం, ఉలవపాడు మండలం, చాకిచెర్ల పరిధిలోని పెద్దపట్టపుపాళెం గ్రామానికి చెందిన మత్స్యకార సంఘ నూతన పెద్దలు కాపులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
జీవనోపాధి కోసం ప్రతిరోజూ సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జి దుస్థితిని వారు నా దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను అర్థం చేసుకుని, నా సొంత నిధులతో ఆ బ్రిడ్జికి అవసరమైన మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాను.
అదేవిధంగా, గ్రామ ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా ప్రధాన వీధిలో సీసీ రోడ్డు నిర్మాణానికి కూడా నా వంతు సహకారం అందిస్తాను.
#VemireddyPrabhakarReddy #NelloreMP #Nellore #IdhiManchiPrabhutvam