ఈరోజు సాయంత్రం మెగా పవర్ స్టార్ శ్రీ @AlwaysRamCharan గారు, మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సాయంత్రం అమరావతిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి హాజరుకావడానికి మంగళగిరి విచ్చేసిన, రామ్ చరణ్ తేజ్ గారు జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. 1/2
Mega Power Star @AlwaysRamCharan met Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan garu at the Janasena Party Central Office in Mangalagiri.
Sri Ram Charan visited the Janasena Party office this evening for a courtesy meeting with Sri Pawan Kalyan garu before proceeding to attend the Andhra Premier League at the ACA International Cricket Stadium, Amaravati.
ఎప్పటిలాగే దీక్ష చేపట్టిన శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. ఏటా జ్యేష్ఠ మాసంలో ప్రారంభించి, కార్తీక మాసంలో దీక్ష విరమిస్తారు.
గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం తప్పకుండా ప్రతి ఏటా చేస్తున్నారు. నియమితమైన జీవనంతోపాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలు ధరిస్తారు. ఎక్కువగా చందన వర్ణ వస్త్రధారణను అవలంబిస్తుంటారు. నిత్యం అనుష్ఠానం, దేవతారాధనగావిస్తారు. సమయానుకూలంగా ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు.
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల నియామకం
• జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో నా స్వీయ పర్యవేక్షణలో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను" నియమిస్తున్నాము.
• ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సీనియర్ పరిశీలకులు
• పార్టీ పట్ల నిబద్ధత, స్థానిక అంశాలపై అవగాహన కలిగిన ముగ్గురు సీనియర్ నాయకులు
• నిలకడగా ప్రతి సంవత్సరం సభ్యత్వ నమోదులో పాల్గొన్న ముగ్గురు సాధక్స్
• ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కనీసం ముగ్గురు సాధక్స్
• మొత్తం 28 మంది నాయకులు, సాధక్స్ తో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ఏర్పాటు
• వీరికి సహకారం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరపున ఐదుగురు సహాయక సిబ్బంది
• ఈ కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కోసం అంకితభావంతో కష్టపడిన నాయకులు, సాధక్స్, జనసైనికుల సమాచారం సేకరణ.
• 2014 నుండి జనసేన జెండాను మోస్తున్న జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దేలా పార్టీ నిర్మాణం
• పార్లమెంట్ నుండి గ్రామ స్థాయి వరకు, అలాగే వివిధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారికి, వారి ఆసక్తికి తగిన విధంగా బాధ్యతలు
• సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం నా ఆధ్వర్యంలో తీసుకోబడుతుంది.
• జనసైనికులలోని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం, అంకితభావాన్ని గుర్తించి వారికి నాయకత్వ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
#JSPMembershipToLeadership
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న శ్రీ @PawanKalyan గారు
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండ ఎగువన కొలువైన శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. పానకాల స్వామి వారికి పట్టువస్త్రాలతోపాటు పానకం నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అంతకు ముందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మంగళవాద్యాలతో స్వాగతం పలికారు. రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారు తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు.