పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, కార్యదర్శులు రాహుల్ బొజ్జా (విపత్తుల నిర్వహణ), రిజ్వి (వైద్య ఆరోగ్యం) సందీప్ కుమార్ సుల్తానియా (పంచాయతీరాజ్), జిల్లా కలెక్టర్ అనుదీప్, సంచాలకులు హనుమంత రావు (పంచాయితీ రాజ్), శ్రీనివాస్(ప్రజా ఆరోగ్యం) సమీక్షలో పాల్గొన్నారు.
ప్రతీ గ్రామానికి ముగ్గురు నుండి నలుగురు పంచాయితీ కార్యదర్శులను నియమించాము. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కలెక్టర్లతోపాటు పంచాయతీ రాజ్ శాఖ, ఆరోగ్య శాఖ డైరెక్టర్లు, ప్రత్యేకాధికారి రజత్ కుమార్ సైనీలు ఈ సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు: సీఎస్
సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్, ఇతర సీనియర్ అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. #TelanganaFloods
ఏటూరునాగారంలో ఈ మధ్యాహ్నం మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం శ్రీ కేసీఆర్ పరిశీలించారు. వరద ప్రవాహం తగ్గాలని గోదావరికి తల్లికి ముఖ్యమంత్రి సారె సమర్పించి, శాంతి పూజలు నిర్వహించారు. #GodavariFloods
భద్రాచలం నుండి ఏటూరు నాగారం దిశగా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ హెలీకాప్టర్లో వరద ప్రభావిత ప్రాంతాల ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రకృతి విపత్తుతో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని, నదికి ఇరువైపులా జలమయమై, నీటిలో చిక్కుకున్న గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించారు. #TelanganaFloods
భద్రాచలం ప్రాంతంలో వరద బాధితులకు శాశ్వత నివాస కాలనీల నిర్మాణం, భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం చుట్టూ కరకట్ట అభివృద్ధి, బూర్గంపాడు వైపు ఉన్న కరకట్ట మరమ్మతులతో కలిపి అన్నిరకాల పనులకు రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం శ్రీ కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రకటించారు.
CM Sri KCR addressed the media after visiting the flood-affected areas of #Bhadrachalam and interacting with people sheltered at the rehabilitation centre.
CM Sri KCR interacted with people affected by #Godavarifloods at the Zilla Parishad High School set up as the rehabilitation centre. Enquired about their wellbeing and health, the essential commodities, medical and other services they are receiving.