సార్ మీ ఒడిస్సీ పుస్తకం చదివినప్పుడు కొన్ని సన్నివేశాలు నేను విజువల్ చేసుకున్న దానికి మూవీ లో ఆ సన్నివేశాల విజువల్స్ కు కొద్దిగా డిస్పోయింట్ అయ్యాను. దాని మీద మీరు చెప్పిన అనాలసిస్ చాలా బాగుంది సార్.
But I must say, the visuals in your book were absolutely outstanding sir 🙌🙌
ఒడిస్సీ మనకు చెప్పేది ఒక్కటే! మనిషి ఎంత దూరం వెళ్లినా, ఎన్ని సముద్రాలు దాటినా, అతని లోపల ఎప్పుడూ ఒక ఇల్లు మిగిలే ఉంటుంది. ఆ ఇంటికే అతని ప్రయాణం. ఆ ప్రయాణమే అతని జీవితం.
***
మన ఊరి చివర చెరువు గట్టు మీద కూర్చుని అలల వైపు చూస్తుంటే ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది కదా? కానీ అదే సముద్రం ముందు నిలబడితే, ఆ అనంతమైన నీటి హోరులో ఒక రకమైన భయం, ఆశ్చర్యం, ఏదో తెలియని వేదన వినిపిస్తాయి. వేల ఏళ్ల క్రితం, గ్రీసు దేశపు సముద్ర తీరాల్లో కూడా సరిగ్గా ఇలాంటి వేదనే వినిపించేది. ఆ వేదనను అక్షరబద్ధం చేసిన అమరకవి హోమర్.
హోమర్ గురించి ఇప్పటికీ బోలెడు చర్చలు ఉన్నాయి. కొందరేమో ఆయన ఒక్కడే ఇవన్నీ రాశాడంటారు, మరికొందరేమో అసలు హోమర్ అనే మనిషే లేడు, అప్పట్లో ఊరూరా తిరుగుతూ వీణ మీటుతూ కథలు చెప్పే గాయకులందరినీ కలిపి 'హోమర్' అన్నారని వాదిస్తారు. హోమర్ గురించి మనకు తెలిసింది తక్కువ, తెలియాల్సింది చాలా ఉంది. ఆయనకు కళ్లు కనిపించవు అంటారు. ఆయన నిజంగా అంధుడా కాదా అన్నది చరిత్రకు స్పష్టంగా తెలియదు; కానీ సంప్రదాయం మాత్రం ఆయనను అంధ కవిగానే ఊహించింది. హోమర్ వర్ణనల్లో దృశ్యం కంటే భావం ఎక్కువగా ఉంటుంది. సముద్రపు అలల గర్జనను, రాత్రి పూట నక్షత్రాల నిశ్శబ్దాన్ని ఆయన అక్షరబద్ధం చేసిన తీరు చూస్తుంటే, లోపలి చూపుతో చూసినవాడికే ఈ ప్రపంచం ఇంత స్పష్టంగా కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఆయన రాసిన “ఇలియడ్,” “ఒడిస్సీ” అనే రెండు కావ్యాలు పాశ్చాత్య ప్రపంచ సాహిత్యానికి పునాదులు. ఇవి కేవలం గ్రీకులకు సంబంధించినవి కావు, భూమ్మీద పుట్టిన ప్రతి మనిషి లోపల ఉండే నిరంతర సంఘర్షణకు ఇవి ప్రతిబింబాలు.
‘ఒడిస్సీ’ చదివేముందు ‘ఇలియడ్’ గురించి మనం కొంతైనా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఒడిస్సీ అనే సుదీర్ఘ ప్రయాణం వెనుక ఒక భయంకరమైన యుద్ధం ఉంది. అదే ట్రోజన్ యుద్ధం. అది మనుషులు కావాలని చేసుకున్న యుద్ధం కాదు, దేవతల పంతాల మధ్య మనుషులు నలిగిపోయిన యుద్ధం. స్పార్టా రాణి హెలెన్ను ట్రాయ్ యువరాజైన పారిస్ తనతోతీసుకెళ్లడం ఆ యుద్ధానికి కారణమైంది. అది పది ఏళ్ల రక్తపాతం. అఖిలెస్, హెక్టర్ వంటి గొప్ప వీరులు మట్టిలో కలిసిపోయిన కాలం అది. పదేళ్లు గడిచినా ఆ కోట గోడలు బద్ధలు కావడం లేదు. అప్పుడే ఒడిస్సస్ రంగంలోకి దిగాడు. ఆయన బలం కత్తిలో కంటే బుద్ధిలో ఎక్కువ. ఆయన ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించాడు. గ్రీకులందరూ ఓడిపోయి వెనక్కి వెళ్లిపోతున్నట్టు నటించి, శత్రువులకు కానుకగా ఒక భారీ చెక్క గుర్రాన్ని కోట ముందు వదిలేసి వెళ్లారు. ట్రాయ్ సైనికులు ఆ గుర్రాన్ని విజయానికి సంకేతంగా భావించి సంబరాలతో కోట లోపలికి తీసుకెళ్లారు. కానీ ఆ గుర్రం కడుపులో ఒడిస్సస్ తన సైనికులతో దాక్కుని ఉన్నాడని వాళ్లకు తెలియదు. అర్థరాత్రి అందరూ నిద్రపోతున్న వేళ, ఆ గుర్రం కడుపులో నుంచి సైనికులు బయటకు వచ్చి, కోట తలుపులు తీసి, ట్రాయ్ నగరాన్ని సర్వనాశనం చేశారు. అది ఒడిస్సస్ సాధించిన తిరుగులేని విజయం.
కానీ ఆ విజయాన్ని వెంటాడుతూ ఒక ఘోరం కూడా జరిగింది. యుద్ధం గెలిచామన్న మదంతో కొందరు గ్రీకు వీరులు దేవాలయాల పవిత్రతను కూడా అవమానించారని గాథలు చెబుతాయి. మనుషుల గెలుపుకు గర్వం తోడైతే దేవతలు ఊరుకోరు కదా! ఆ యుద్ధం తర్వాత గ్రీకుల గర్వం, వారి అపచారాలు దేవతల్లో కోపాన్ని రేపాయి. ఆ కోపపు మేఘాల మధ్యే ఒడిస్సస్ ఇంటి ప్రయాణం మొదలైంది. తరువాత, సముద్రపు దేవుడు పోసిడాన్ కుమారుడైన పోలిఫీమస్ను ఒడిస్సస్ గుడ్డివాడిని చేయడంతో, పోసిడాన్ ఆగ్రహం అతని మీద మరింత భీకరంగా పడింది. అక్కడి నుంచి ఒడిస్సస్కు ప్రతి అల ఒక శాపంలా, ప్రతి దీవి ఒక పరీక్షలా మారింది. తన రాజ్యమైన ఇథాకాకు, తన భార్య పెనెలోపి దగ్గరికి వెళ్లాలని ఒడిస్సస్ బయలుదేరాడు. కానీ ఆ ప్రయాణం పదేళ్ల పాటు మృత్యువుతో చేసిన యుద్ధంగా మారింది. పది ఏళ్ల ట్రాయ్యుద్ధం ఒకెత్తయితే, ఆ తర్వాత పది ఏళ్ల తిరుగు ప్రయాణం ఇంకో ఎత్తు. ఒడిస్సస్ చేసిన ఈ పదేళ్ల ప్రయాణమే ఒడిస్సీలోని మూల కథ.
ఈ ఒడిస్సీ మూల కథను గమనిస్తే, అది ఒక మనిషి మనుగడ కోసం చేసే నిరంతర పోరాటంలా కనిపిస్తుంది. ఒడిస్సస్ తన ఓడతో సముద్రం మీద బయలుదేరినప్పుడు, అతనికి ఎదురైన ప్రతి సంఘటన ఒక పాఠం. ఒకచోట ఒంటికన్ను రాక్షసుడు సైక్లోప్స్ తన మనుషులను తింటుంటే, అతడిని ఎలా గుడ్డివాడిని చేసి తప్పించుకోవాలి? ఇంకోచోట సిర్సీ అనే మంత్రగత్తె తన మనుషులను పందులుగా మారిస్తే, ఆమెను ఎలా వశం చేసుకోవాలి? సైరన్ల మధుర గానం విని నావికులు మైమరచి మరణం వైపు దూసుకెళ్తుంటే, తన మనుషుల చెవుల్లో మైనం పెట్టించి, తాను మాత్రం ఆ గానం వినాలనే ప్రమాదకరమైన కోరికతో ఓడ స్తంభానికి కట్టించుకుని ఆ మాయను ఎలా దాటాలి? ఇలాంటి ఎన్నో ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు ఇందులో ఉన్నాయి.
కానీ ఇవన్నీ కేవలం ఫాంటసీ కథలు కావు. మన జీవితంలో వచ్చే అడ్డంకులకు ఇవి సంకేతాలు. ఒడిస్సస్ తన గమ్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఒక తపన ఉంటుంది.
మరోవైపు ఇథాకాలో ఆయన భార్య పెనెలోపి కథ కూడా అంతే గొప్పది. చుట్టూ వందమంది దుర్మార్గులు చేరి, “నీ భర్త చచ్చిపోయాడు, మమ్మల్ని పెళ్లి చేసుకో,” అని వేధిస్తున్నా, ఆమె చెక్కుచెదరలేదు. ఒక పక్క తండ్రి లేని లోటుతో ఎదుగుతున్న కొడుకు టెలిమాకస్, మరోపక్క ఆక్రమణదారులు. వీటన్నింటి మధ్య ఆ ఇల్లు ఒక యుద్ధరంగంలా మారింది. ఇక్కడ యుద్ధం ఆయుధాలతో జరగడం లేదు, ఓపికతో జరుగుతోంది. ఒడిస్సస్ సముద్రం మీద అలలతో పోరాడుతుంటే, పెనెలోపి ఇంట్లో కాలంతో పోరాడుతోంది. ఆ ఇద్దరి పోరాటం ఒకే బిందువు దగ్గర ఎలా కలిసిందన్నదే ఈ కావ్యం పరమార్థం. ఇది ఒక రాజు కథ మాత్రమే కాదు. ఇది మనందరిలో ఉండే ఒక అన్వేషి కథ.
***
హోమర్ను మన వాల్మీకి, వ్యాసమహర్షులతో పోల్చుకోవచ్చు. వాల్మీకి రాముడి అడుగుజాడల్లో ధర్మాన్ని వెతికితే, వ్యాసుడు కురుక్షేత్ర యుద్ధంలో మనిషి అహంకారాన్ని వెతికాడు. హోమర్ ఈ ఇద్దరి కలయికలాగా కనిపిస్తాడు.
ఇలియడ్-మహాభారతం మధ్య ఉన్న పోలిక చూస్తే మనకు ఆశ్చర్యమేస్తుంది. కురుక్షేత్రంలో ఎలాగైతే అక్షౌహిణిల సైన్యం మట్టిలో కలిసిపోయిందో, ట్రాయ్ యుద్ధంలో కూడా గ్రీకు వీరుల తరం అలాగే అంతమైపోయింది. అక్కడ ద్రౌపది అవమానం మహాసంగ్రామానికి దారి తీస్తే, ఇక్కడ హెలెన్ అపహరణ విధ్వంసానికి మూలమైంది. ఈ రెండు యుద్ధాలూ మనకు ఒకటే చెబుతాయి - యుద్ధంలో గెలిచినా చివరకు మిగిలేది ఒక పెద్ద శ్మశానం మాత్రమే.
ఇలియడ్ కథ యుద్ధం చుట్టూ తిరుగుతుంది. యుద్ధం తర్వాత ఇంటికి తిరిగి వెళ్లే కథే ఒడిస్సీ.
ఒడిస్సీ అంటే కేవలం ఒక వీరుడి సాహసగాథ కాదు, అది ఒక మనిషి తన ఇంటిని చేరుకోవడానికి పడే సుదీర్ఘమైన ఆరాటం. రామాయణంలో రాముడు సీతమ్మను వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ రాముడు ధర్మాన్ని నమ్ముతాడు. ఇక్కడ ఒడిస్సీలో మన కథానాయకుడు ఒడిస్సస్ తన తెలివితేటలను నమ్ముతాడు. రాముడు మర్యాద పురుషోత్తముడు. ఒడిస్సస్ మాత్రం రాజైనా, వీరుడైనా, తన బలహీనతలతో మనలాంటి మనిషిగా కనిపిస్తాడు. ఆయన దారి తప్పుతాడు, లోభానికి గురవుతాడు, అవసరానికి అబద్ధాలు ఆడతాడు, కొన్నిసార్లు గర్వపడతాడు. కానీ ఆయన గుండెలో ఉన్న ఒకే ఒక్క వెలుగు - తన ఇల్లు, తన భార్య పెనెలోపి. ఆ ఒక్క ఆశే ఆయనను పదేళ్ల పాటు సముద్రం విసిరే మాయల నుంచి కాపాడుతూ వస్తుంది.
వాల్మీకి రాసిన రామాయణంలో రాముడి అన్వేషణ, సీతమ్మ నిరీక్షణ ప్రధాన అంశాలు. సీతమ్మను వెతుక్కుంటూ రాముడు అడవుల వెంట, పర్వతాల వెంట తిరుగుతూ అల్లాడిపోయిన తీరు చూస్తుంటే, హోమర్ రాసిన ఒడిస్సీలోని కథానాయకుడు ఒడిస్సస్ గుర్తుకొస్తాడు. రాముడు తన భార్య కోసం సముద్రాన్ని దాటి లంకకు వెళ్తే, ఒడిస్సస్ తన భార్య పెనెలోపిని చేరుకోవడానికి ఎన్నో ఏళ్ల పాటు సముద్రంతోనే యుద్ధం చేస్తాడు. రామాయణంలో సీతమ్మ అశోకవనంలో ఉండి, తన కళ్ళను రాముడి బాట వైపు ఉంచి ఎలాగైతే ఎదురుచూసిందో, పెనెలోపి కూడా ఇథాకా రాజభవనంలో, ప్రతి వార్తలోనూ, ప్రతి గాలిలోనూ, తన భర్త తిరుగు జాడను వెతుక్కుంటూ ఇరవై ఏళ్ల నిరీక్షణను భరించింది. వాల్మీకి కథలో 'వియోగం' ఎంత భారంగా ఉంటుందో, హోమర్ కథలో 'ఎడబాటు' కూడా అంతే భారంగా ఉంటుంది. వ్యాసుడు అహంకారాల మధ్య నలిగిన మనుషుల కథను 'మహాభారతం'గా మలిస్తే, హోమర్ తన 'ఇలియడ్'లో ఆ పదేళ్ల రక్తపాతాన్ని కళ్లకి కట్టినట్టు చూపించాడు.
నిజానికి వీళ్లంతా ఒకే దారిలో నడిచిన బాటసారులులా కనిపిస్తారు. వీరు చెప్పిన కథల్లో మనుషులు ఉంటారు, దేవతలు ఉంటారు, రాక్షసులు ఉంటారు. కానీ అన్నింటికంటే ఎక్కువగా మనిషి పడే ఆంతరంగిక సంఘర్షణ ఉంటుంది. ఆ సంఘర్షణే ఈనాటికీ మనల్ని ఈ కథల వైపు లాగుతోంది.
మనం ఈ పురాణాల్లో కేవలం కథను మాత్రమే చదవడం లేదు, వేల ఏళ్ల నాటి మనిషి వేదనను అనుభవిస్తున్నాం. పొట్టకూటి కోసం ఎక్కడో పరాయి గడ్డ మీద బతుకుతూ, ఎప్పుడెప్పుడు మన సొంత ఊరికి వెళ్తామా అని తపించే ప్రతి ఆధునిక మనిషికీ ఒడిస్సీ కథ తన సొంత కథలాగే అనిపిస్తుంది. అందుకే హోమర్ కాలాతీతమైన కవి. ఆయన పాటలో మనందరి గాథ ఉంది. అందుకే గ్రీకు భాషలో ఉన్న ఒడిస్సీ ప్రపంచంలోని ఎన్నో వందల భాషల్లోకి, ఎన్నో వేల సార్లు అనువదించబడింది.
చిన్నప్పటి నుంచీ ‘ఇలియడ్’, ‘ఒడిస్సీ’ పేర్లు ఎన్నోసార్లు వింటూనే వచ్చాను. ప్రపంచ సాహిత్యంలో ఇవి ఎంత గొప్ప మహాకావ్యాలో తెలుసు. కానీ పూర్తిగా చదవాలనే కోరిక ఉన్నా, ఎప్పుడో ఒకప్పుడు చదువుదాం అనుకుంటూ ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వచ్చింది. ఈ మధ్య క్రిస్టోఫర్ నోలన్ ‘ఒడిస్సీ’ ఆధారంగా సినిమా తీస్తున్నాడనే వార్త విన్నప్పుడు, ఆ పాత ఆసక్తి మళ్లీ బలంగా మేల్కొంది. ఇన్ని వేల ఏళ్ల తర్వాత కూడా ఒక మహాకావ్యం ఇంతటి దర్శకుడిని ఆకర్షిస్తుందంటే, అందులో మనిషిని కదిలించే ఏదో శాశ్వతమైన శక్తి ఉండక తప్పదనిపించింది.
అలా ‘ఒడిస్సీ’ని చదవడం మొదలుపెట్టాను. కథ ముందుకు సాగేకొద్దీ పాత్రలు, ప్రయాణాలు, దీవులు, దేవతలు, శాపాలు, ఇవన్నీ గుర్తుంచుకోవడానికి నాకోసం నేను నోట్స్ రాసుకోవడం ప్రారంభించాను. ఆ నోట్స్ రాస్తున్నప్పుడే, నాలాగే ఈ కావ్యం మీద ఆసక్తి ఉన్నా, ఇప్పటివరకు చదవలేకపోయిన తెలుగు పాఠకుల కోసం దీన్ని మన భాషలో ఎందుకు అందించకూడదనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచే ఈ తెలుగు రూపం పుట్టింది.
హోమర్ రాసిన మహాకావ్యం ‘ఒడిస్సీ’కి ఇది మన తెలుగు రూపం. అసలు కథ, పాత్రలు అవే అయినా, ఆ సముద్రపు హోరు మనకు వినిపించేలా, ఆ వేదన మన గుండెకు తగిలేలా ఈ కథను రాశాను. ఒడిస్సీ చదువుతూ నేను పొందిన అనుభూతిని మీతో పంచుకోవాలనే ఈ ప్రయత్నం. ఇది కేవలం ఒక అనువాదం కాదు, మనందరి అన్వేషణ.
ఒడిస్సీ మనకు చెప్పేది ఒక్కటే! మనిషి ఎంత దూరం వెళ్లినా, ఎన్ని సముద్రాలు దాటినా, అతని లోపల ఎప్పుడూ ఒక ఇల్లు మిగిలే ఉంటుంది. ఆ ఇంటికే అతని ప్రయాణం. ఆ ప్రయాణమే అతని జీవితం.
***
@AnvikshikiPub మొదలుపెట్టడంలో పెద్ద ఆలోచన లేదు. పెద్ద పెద్ద ఆశయాలు లేవు. నేను రాసిన రెండు పుస్తకాలు ప్రచురించే సంస్థలేకపోవడం నుంచి పుట్టిన ఒక చిన్న ఆలోచన. నా పుస్తకాలను మంచి క్వాలిటీతో ప్రచురించాలనే సెల్ఫిష్ ఆలోచనే అయినా, నా పుస్తకాలతో పాటు మాకు నచ్చిన కొంతమంది రచయితల పుస్తకాలను అందంగా ప్రచురించడమే కాకుండా, మరింతమంది ఎక్కువ పాఠకులకు చేరువ చేయాలనే చిన్న ఆలోచనతో మొదలైంది ఆన్వీక్షికి. ఈ ఆలోచన కార్యరూపం దాల్చడంలో మాకు ఎంతోమంది సహకారం లభించింది. కాలక్రమంలో మేము రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ప్రచురణ సంస్థంగా ఎదుగుతామని ఎప్పుడూ అనుకోలేదు. పదో పాతికో పుస్తకాలు మాత్రమే ప్రచురించి చూద్దామనుకుని ఇప్పుడు 250 పుస్తకాలదాకా ప్రచురించాం. ఈ ఏడేళ్లలో ఎంతోమంది రచయితలు, పాఠకులు, అభిమానులు, స్నేహితులు మా ప్రయత్నాన్ని ప్రోత్సాహిస్తూ వచ్చారు. వాళ్లందరి ఆదరాభిమానాలు, సహాయ సహకారాల వల్లనే మేము ఇక్కడి వరకూ రాగలిగాం. ఆన్వీక్షికి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆన్వీక్షికి ప్రచురించిన అన్ని పుస్తకాలు మీరు ఈ లింక్ ద్వారా పొందవచ్చు.
https://t.co/W5UjbIQ5ZG
రచ్చ రవి నటుడిగా మనందరికీ తెలుసు. కొన్ని నెలల క్రితం ఒక పుస్తకం గురించి మాట్లాడాలని వచ్చినప్పుడు, రవి రాసింది చదివి ఆశ్చర్యపోయాను.
ఒకటి, ఇలాంటి పుస్తకం నేను ఇంతవరకు చదవలేదు. జన్మనిచ్చిన తల్లి తండ్రుల గురించి చాలామంది రాసిన పుస్తకాలు ఉండొచ్చు. కానీ అమ్మమ్మ గురించి నేను ఇంతవరకు ఎప్పుడూ ఒక పూర్తి పుస్తకమైతే చదవలేదు. ఈ పుస్తకం చదువుతుంటే తెలియకుండా నా బాల్యంలోకి వెళ్ళిపోయాను.
మన చిన్నతనంలో చాలామందికి సెలవుల్లో అమ్మమ్మ ఇంట్లోనే గడపడం సాధారణం. కానీ ఎందుకో పెద్దయ్యాక చిన్నగా అమ్మమ్మ వాళ్ళింటికి దూరమవుతాం మనం.
రవి ఆ జ్ఞాపకాలను పదిలపరచడమే కాకుండా, ఆ అనుభవాలు తన జీవితాన్ని ఎలా మలిచాయో చెప్పుకుంటూ తన అమ్మమ్మను మనందరి మనసుల్లో ఒక జ్ఞాపకంగా పర్మనెంట్ గా ముద్రించేశాడు.
ఆన్విక్షికి ద్వారా వందమంది దాకా కొత్త రచయితలను తెలుగు సాహిత్య లోకానికి పరిచయం చేసాం. ఇప్పుడు రచ్చ రవి కూడా మా సంస్థ ద్వారా రచయితగా పరిచయం కావడం ఆనందంగా ఉంది.
వచ్చే ఆదివారం, మే 10 మదర్స్ డే సందర్భంగా ఈ పుస్తకం అందరికి అందుబాటులోకి రానుంది.
ఏడేళ్ల క్రితం ఒక్క పుస్తకంతో మొదలైన ఒక ఆలోచన ఇప్పుడు 250 పుస్తకాలతో ఆన్వీక్షికి ఏడవ వార్షికోత్సవం జరుపుకోనుంది. తెలుగులో చదివేవారు లేరు అనే ఎంతోమంది నిరాశావాదుల మాటలకు సమాధానంగా ఈ ఏడేళ్లలో తెలుగు సాహిత్యం సాధించిన ప్రగతిలో ఆన్వీక్షికి భాగమైనందుకు సంతోషంగా ఉంది. Thank you all.
ఇది మువ్వలు చెప్పే ప్రేమ కథ
అందమైన ప్రభాకర్, శ్రావణిల ప్రేమ కథ
ఇద్దరి మాటలు మీరు వినాలంటే కుందేరు సాక్షిగా నవల పేజీలు తిప్పాల్సిందే
Here amazon link : https://t.co/Yjap4hPjyO
కుందేరు సాక్షిగా నవల మీద మీరు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞుడిని.
సెకండ్ ఎడిషన్ అందుబాటులో ఉంది.
ఇప్పుడే మీ కాపీ ఆర్డర్ చేసుకోండి
Here amazon link : https://t.co/kyhTfco0rx
@AnvikshikiPub
What's with these young writers from Rayalaseema?
థ్రిల్లర్స్, స్లైస్ ఆఫ్ స్టోరీలు, ప్రేమ కధలే కాదు.. గుండెలు పిండేసే కధలు కూడా వ్రాయగలుగుతున్నారు...
ఈ "కుందేరు సాక్షిగా.." పుస్తకం ఈ సంక్రాంతి హడావుడిలో కూడా త్వరత్వరగా చదివించింది. గుండె బరువెక్కించింది.