సీఎం కేసీఆర్ గారికి జేడీఎస్ చీఫ్ శ్రీ కుమారస్వామి, శ్రీ ప్రకాశ్ రాజ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖపై పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ సంతకం చేశారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.."భారత్ రాష్ట్ర సమితి"గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గారికి అధికారికంగా లేఖ అందింది.