పిఠాపురం ఆడపడుచులకు రాఖీ కానుక పంపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
పిఠాపురం శాసనసభ్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు సోదర భావంతో 2,400 మంది వితంతు మహిళలకు రాఖీ పండుగ కానుకగా చీరలు పంపించారు. రాఖీ కానుకతో ఆనందం వ్యక్తం చేసిన పిఠాపురం ఆడపడుచులు.
పిఠాపురం నియోజకవర్గం లోని జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు ఇంటింటికి వెళ్లి కానుక అందజేస్తున్నారు.
#RakshaBandhan
#RakshaBandhan
సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..!
అక్కాచెల్లెళ్లతో అన్నదమ్ములకున్న ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) పర్వదినం సందర్భంగా సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాఖీ పౌర్ణమి భారతీయ కుటుంబ వ్యవస్థతో పెనవేసుకున్న బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలకు ఓ భావోద్వేగపూరిత సంకేతం. సోదర భావాన్ని, మహిళలకు గౌరవాన్ని, భరోసాని అందించే పండుగ.
రాఖీ పౌర్ణమి వేళ రాష్ట్రంలో మహిళల భద్రత, మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ముందుకు వెళ్తుందన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. ఇప్పటికే దీపం-2 ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. డోలీ రహిత గిరిజన గ్రామాల కల సాకారం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే 426 గిరిజన ఆవాసాలను రోడ్లతో అనుసంధానించడమైనది. అడవితల్లి బాట ఫేజ్-2 ద్వారా ఈ రోడ్లను మరింత విస్తరించే దిశగా చర్యలు చేపట్టాం.
గిరిజన మహిళల్లో కనిపించే జన్యుపరమైన వ్యాధి సికిల్ సెల్ అనీమియా నుంచి రక్షణ కల్పించేందుకు అరకులో ప్రత్యేక బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నాము. ఆడపడుచుల అభ్యున్నతి, సాధికారత దిశగా ముందుకు వెళ్తామని రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలియచేస్తున్నాము.
- Hon'ble Andhra Pradesh Deputy CM, JanaSena Chief Sri @PawanKalyan
కొండగట్టు అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయి?
₹35.19 కోట్ల TTD నిధులు సిద్ధంగా ఉన్నా…టెండర్ ఎందుకు లేదు?
• 96 గదుల సత్రం, దీక్షా విరమణ మండపం కోసం ₹35.19 కోట్లు మంజూరు
• జనవరి 3న శంకుస్థాపన పూర్తి
• మరి పనుల ప్రారంభంలో ఎందుకు జాప్యం?
• ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులు, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దీనిపై ఎందుకు స్పందించరు?
హిందూ భక్తుల సౌకర్యాలపై రాజకీయాలు వద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనపై వెంటనే సమాధానం చెప్పాలి!
#Kondagattu #TTD #JSPForTelangana #JanaSenaTelangana
పిఠాపురం ఆడపడుచులకు రాఖీ కానుక పంపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
2,400 మంది వితంతు మహిళలకు రాఖీ పండుగ కానుకగా చీరలు పంపించారు. రాఖీ కానుకతో ఆనందం వ్యక్తం చేసిన పిఠాపురం ఆడపడుచులు
@PawanKalyan@APDeputyCMO
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక రాజకీయ ఒత్తిళ్లకు, దాడులకు బెదరకుండా పోటీ చేసిన అభ్యర్థులతో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం.
ఈ సమావేశం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన విధానాలపై జనసేన కేంద్ర నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది.
సెప్టెంబర్ 2, జనసేన పార్టీ అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ యువజన విభాగం ప్రకటించనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#JSPForNewAgePolitics
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు గారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
1976లో ‘అంతులేని కథ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆయన, ఎన్నో చిత్రాల్లోనూ, పలు టెలివిజన్ సీరియళ్లలోనూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
నారాయణరావు గారితో నాకు ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలను నాతో నిర్మించిన నిర్మాతగా మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ @NagaBabuOffl అన్నయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
పర్యావరణ పరిరక్షణ, హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా మీ నాయకత్వంలో ఈ కమిటీ మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
@JanaSenaParty@PawanKalyan
చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాద ఘటనపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని స్పష్టం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రైవేటు బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.
-ఉప ముఖ్యమంత్రివారి కార్యాలయం
@PIB_India@IPR_AP@pibvijayawada
జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం
• స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై ప్రత్యేక చర్చ
• పార్టీ నాయకులకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం
వేదిక: CK కన్వెన్షన్ హాల్, మంగళగిరి
సమయం: సాయంత్రం 4 గంటలకు
గమనిక: కేవలం ఆహ్వానితులకు మాత్రమే ఈ సమావేశంలో అనుమతి ఉంటుందని గమనించగలరు.
ఆధ్యాత్మిక పిఠాపురానికి అభివృద్ధి వెలుగులు
•ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో రూ.30.66 కోట్లు నిధులు కేటాయింపు
•24 దేవాలయాల పునరుద్ధరణకు రూ.17.06 కోట్లు
•టీటీడీ కల్యాణ మండపానికి రూ.2 కోట్లు
•48 భజన మందిరాలకు రూ.11.60 కోట్లు
•లక్షలాది భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా అభివృద్ధి పనులు
“ఆధ్యాత్మికత కొలువైన క్షేత్రంలో అభివృద్ధి ఉండాలి.. చరిత్ర ఉన్న చోట పరిరక్షణ ఉండాలి.. సంస్కృతి ఉన్న చోట అది మరింత శోభిల్లాలి” అనేది ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి దృఢ సంకల్పం. పిఠాపురం నియోజకవర్గ చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూ, ఆ వైభవాన్ని భవిష్యత్ తరాలకు మరింత ఘనంగా అందించాలనే ఆయన కార్యాచరణ ఇప్పుడు క్షేత్రస్థాయిలో రూపుదాలుస్తోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రత్యేక చొరవ తీసుకొని, నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి , భజన మందిరాల నిర్మాణం, కళ్యాణ మండపాల ఏర్పాటు కోసం ఏకంగా రూ. 30.66 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఆయన నిరంతర పర్యవేక్షణలో ఈ అభివృద్ధి పనులు ప్రస్తుతం నియోజకవర్గవ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్నాయి.
• భక్తుల రద్దీకి తగ్గట్టు ఆలయాల ఆధునీకరణ
నియోజకవర్గంలోని 24 ప్రముఖ దేవాలయాల అభివృద్ధి కోసం రూ.17.06 కోట్ల నిధులను కేటాయించారు. ఈ నిధులతో ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ, మరమ్మతులతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. గొల్లప్రోలు సీతారామస్వామి ఆలయంలో ప్రాకార మండపం నిర్మాణం తుది దశకు చేరింది. కొత్తపల్లిలోని జగన్నాథ, సత్యనారాయణ స్వామి ఆలయాల్లో ధ్వజస్తంభాల ప్రతిష్ఠాపన పనులు పూర్తయ్యాయి.
పిఠాపురం కొత్తపల్లి వీధిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకుల క్వార్టర్ల స్లాబ్ పనులు పూర్తయ్యాయి. శ్రీ కుంతీ మాధవస్వామి ఆలయంలో కాలక్షేప మండపం, రామకృష్ణాపూర్ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రాజగోపురం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి రూ.5 కోట్లు, శ్రీ పాద శ్రీవల్లభ దేవస్థానానికి రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు మొదలు కానున్నాయి. పునరుద్ధరణ జరుగుతున్న ఆలయాల్లో శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా పిఠాపురంలోని పంచ మాధవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన 10వ శతాబ్దం నాటి శ్రీ కుంతీమాధవ స్వామి ఆలయంతోపాటు, పిఠాపురం మహారాజుల కాలం నాటి అనేక పురాతన దేవాలయాలు ఈ ప్రాజెక్టు ద్వారా సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలకు ఏటా సుమారు 13.76 లక్షల నుంచి 18.07 లక్షల మంది భక్తులు వస్తుంటారు. సాధారణ రోజుల్లోనే కాకుండా పండుగలు, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాల సమయంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఆయా పర్వదినాల్లో రోజుకు 20 వేల నుంచి ఏకంగా 50 వేల మంది వరకు భక్తులు తరలివస్తుంటారు. ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాల ఆధునీకరణ పనులు చేపడుతున్నారు.
• అత్యాధునిక వసతులతో టీటీడీ కల్యాణ మండపం
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో గతంలో పాడా ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపాన్ని అన్ని ఆధునిక వసతులతో పునర్నిర్మించారు. అలాగే, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ మాడ వీధుల విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఇదే స్ఫూర్తితో ప్రస్తుతం యు.కొత్తపల్లి మండలంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం నిర్మాణానికి రూ.2 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు. వివాహాలు, ధార్మిక కార్యక్రమాలు, ఇతర సామాజిక అవసరాలకు అనువుగా అత్యాధునిక వసతులతో ఈ కల్యాణ మండపాన్ని నిర్మించనున్నారు.
• భజన మందిరాలతో పల్లెల్లో ఆధ్యాత్మిక శోభ
కాకినాడ జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంపొందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించే లక్ష్యంతో 419 భజన మందిరాలను పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో తొలి దశలో 48 భజన మందిరాల నిర్మాణానికి రూ.11.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ భజన మందిరాలు కేవలం భక్తి కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. భజనలు, ఆధ్యాత్మిక సమావేశాలు, స్థానిక సాంస్కృతిక వేడుకలు, గ్రామస్థాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయనున్నారు. మొత్తంగా రూ.30.66 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురం ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణతోపాటు ఆలయాల ఆధునికీకరణ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, గ్రామీణ సామాజిక వేదికల బలోపేతానికి దోహదపడనున్నాయి.
#Pithapuram