@TGSRTCHQ@KokateSreesai @tgsrtcmdoffice @PROTGSRTC @SajjanarVC @YakaswamyChalla Thank you for your suggestion. We will examine and take up inclusion of these routes for discussion with AP officials please.
#TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు.
@TGSRTCHQ @PROTGSRTC
@TSRTCHQ @Inevitable__21 @tsrtcmdoffice @SMIT2_TSRTC Dear sir, thank you for your suggestion. Will examine and take appropriate action based on feasibility please.
*న్యూఢిల్లీలో నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్పోర్ట్ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం
*అయిదు జాతీయ పురస్కారాలను అందుకున్న టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్
నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్స్ పోర్ట్ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మకమైన అయిదు ఎక్స్లెన్స్ అవార్డులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) గెలుచుకున్న విషయం తెలిసిందే. 2022-23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్ఆర్టీసీకి దక్కాయి.
న్యూఢిల్లీలోని ఇండియా హబిటెట్ సెంటర్ లో శుక్రవారం సాయంత్రం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఏఎస్ఆర్టీయూ అధ్యక్షులు, కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్, ఐఏఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఎస్ఆర్టీసీ గెలుపొందిన అయిదు నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్స్ పోర్ట్ ఎక్స్లెన్స్ అవార్డులను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారి నేతృత్వంలోని ఆర్టీసీ అధికారుల బృందానికి ఆయన అందజేశారు.
రహదారి భద్రతలో ప్రథమ, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషిల్ విభాగంలో ప్రథమ, అర్బన్ విభాగంలో ద్వితీయ, సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరిలో ప్రథమ, సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు గాను మరో ప్రథమ పురస్కారాన్ని టీఎస్ఆర్టీసీ అధికారుల బృందానికి అందజేశారు.
ప్రతిష్టాత్మకమైన అయిదు జాతీయ స్థాయి అవార్డులు దక్కడం సంస్థకు ఎంతో గర్వకారణమని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అన్నారు. ఈ పురస్కారాలతో టీఎస్ఆర్టీసీ ఖ్యాతి మరింతగా ఇనుమడించిందని ఆయన చెప్పారు. సిబ్బంది నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థకు ఈ పురస్కారాలు వరించాయని పేర్కొన్నారు. అవార్డులు వచ్చేలా కృషిచేసిన 43 వేల టీఎస్ఆర్టీసీ కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాలను అంకితం చేస్తున్నట్లు సజ్జనర్ ప్రకటించారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ అదనపు కార్యదర్శి మహమూద్ అహ్మద్ గారు, ఏఎస్ఆర్టీయూ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ద్వారక తిరుమల రావు, ఐపీఎస్ గారు, డైరెక్టర్ కిషోర్ గారు, ఈడీ సూర్య కిరణ్ గారు, టీఎస్ఆర్టీసీ సీఎంఈ రఘునాథరావు గారు, డిప్యూటీ సీపీఎం(అడ్మిన్) శిరీష, డిప్యూటీ సీటీఎం(ఐటీ) సమీరా అఫ్రీన్, ఆదిలాబాద్ డిప్యూటీ ఆర్ఎం ఎస్.ప్రణీత్, నల్లగొండ డిప్యూటీ ఆర్ఎం శివ శంకర్, కొత్తగూడెం డీఎం బీవీ రావు, తదితరులు పాల్గొన్నారు.
@TSRTCHQ @PROTSRTC @SajjanarVC @YakaswamyChalla
#TSRTC ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్ ప్రెస్ నాన్ ఏసీ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సందడిగా జరిగింది.
@Bhatti_Mallu @PonnamLoksabha @KomatireddyKVR @TSRTCHQ @PROTSRTC @YakaswamyChalla
సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి శుభవార్త! ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్లపై 10 శాతం రాయితీ కల్పించాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్లపై 10 శాతం డిస్కౌంట్ను కల్పించింది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ఏప్రిల్ 30 వరకు డిస్కౌంట్ అమల్లో ఉంటుంది. లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబద్ నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు రూట్లలో నడుస్తుండగా.. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ కు, గోదావరిఖని-బెంగళూరు, కరీంనగర్-బెంగళూరు, నిజామాబాద్ -తిరుపతి, నిజామాబాద్ -బెంగళూరు, వరంగల్-బెంగళూరు రూట్లలో తిరుగుతున్నాయి. ఈ రూట్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుతోంది.
@TSRTCHQ @PonnamLoksabha @CTMOTSRTC @PROTSRTC
హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వెళ్తుండగా ఆర్టీసి బస్సులో ఆకస్మిక ప్రయాణం చేయడం జరిగింది
బస్సులో ప్రయణిస్తున్న ప్రయాణికులతో ముచ్చటించి
నారాయణ పెట్ బస్సులో వెళ్తున్న ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది .