JSP & Cults Never Forget 👇
- Ram Charan & Fans ❤️
- Prabhas & Rebels ❤️
- Nani Anna ❤️
JSP Kosam Katapadda Prathi Fandom lo konthamandi ❤️✊
#JanaSena#PawanKalyan
Picture abhi baaki hey Mere Dosthon
Block Buster lu Industry Hit lu cinemallone kadu Raajakeeyallo kuda chustharu - E Pawan Kalyan Aadinche Aata Soodduru gani
త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని దర్శించుకున్న శ్రీ @PawanKalyan గారు
•ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు
•శ్రీకృష్ణునికి, శ్రీరామ స్వామి, అయ్యప్పస్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ
•దీపాలంకరణ, మీనుట్టు, వేది వజిపాడు సేవల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో విఖ్యాతిగాంచిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆలయంలో విశిష్ట సేవల్లో ఒకటిగా పేరున్న దీపారాధన సేవలో పాల్గొన్నారు. ఒక్క రోజు దీపారాధన సేవకు విరాళం అందించి, స్వయంగా దీపాలు వెలిగించి సేవలో పాల్గొన్నారు. ఆలయం ప్రధాన ద్వారం ఎదురుగా, శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధాన దీపాల్లో జ్యోతి ప్రజ్వలన గావించారు. దీపారాధనతోపాటు ఆలయ సంప్రదాయాలను అనుసరించి మీనుట్టు, వేది వజిపాడు సేవల్లోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. శంఖుచక్రాలతోపాటు ధనుస్సు, హారం ధరించిన శ్రీ రామస్వామి వారి అద్భుత రూపాన్ని దర్శించి, సంధ్యాకాల అర్చనలు నిర్వహించారు. శ్రీరామ స్వామి వారితో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీకృష్ణునికి, అయ్యప్ప స్వామకి పట్టు వస్త్రాల సమర్పించారు. అనంతరం గర్భాలయంలో మూలవిరాట్టుకి కుడివైపు ఉన్న దక్షిణా మూర్తికి, నైరుతి దిక్కున ఉన్న వినాయకుడికి, అనంతపద్మనాభ స్వామి వారి శయన రూపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేల్ శాంతి(ప్రధాన అర్చకులు) శ్రీ రామన్ తిరుమేని గారు పూజ అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. అంతకు ముందు శ్రీరామ స్వామి క్షేత్రానికి విచ్చసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కొచ్చిన దేవస్థానం బోర్డు ఛైర్మన్, శ్రీరామ స్వామి ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ అడ్మినిస్ట్రేటర్, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
•తీర్వా నదిలో చేపలకి ఆహారం.. వేది వజిపాడు సేవకు విరాళం
శ్రీరామ స్వామి వారి దర్శనానికి ముందు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి అదే ప్రాంగణంలో ఉత్తర దిక్కున ఉన్న శ్రీకృష్ణుని శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. అనంతరం మీనుట్టు (చేపలకు ఆహారం అందించడం) సేవలో పాల్గొన్నారు. తీర్వా నదికి ఆలయం అనుకుని ఉండడంతో, ఆ నదిలో చేపలకి ఆహారం అందించడం ఆచారంగా వస్తోంది. ఇక్కడ చేపలకు ఆహారం అందించి మత్స్యావతార రూపుడైన విష్ణుమూర్తికి స్వయంగా ఆహారం అందించినట్టు భక్తులు భావిస్తారు. స్వామి దర్శనానంతరం వేడి వజిపాడుగా పిలిచే బాణాసంచ పేల్చే సేవలో పాల్గొన్నారు. త్రిప్రయార్ ఆలయం తెరిచి ఉన్నంత సమయం బాణాసంచా పేల్చడం ఇక్కడ ఆచారం. సీతాదేవి ఆచూకి లభించిన విషయాన్ని తన పొలికేక ద్వారా శ్రీ ఆంజనేయ స్వామి వారు శ్రీరాముడికి చేరవేయగా, రామస్వామి బాణాసంచ పేలుడుతో బదులిచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. దాన్నే త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో నేటికీ పాటిస్తున్నారు. వేది వజిపాడుగా పిలిచే ఈ సేవలో పాల్గొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, 1,001 టపాసులు పేల్చేందుకు అయిన మొత్తాన్ని విరాళంగా సమర్పించారు. చివరిగా శ్రీ శాస్తగా భక్తులు కొలుచుకునే అయ్యప్పస్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
త్రిప్రయార్ లోని శ్రీరామ స్వామి విగ్రహం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిచే పూజలందుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ద్వారకానగరం సముద్ర గర్భంలో కలసిపోయిన అనంతరం రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు కేరళం తీరానికి కొట్టుకువచ్చినట్టు చరిత్ర చెబుతోంది. కేరళంలో ఆలయానికి సమీపంలో ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం స్వామి సేవలో పాల్గొన్నారు.
పని పూర్తయ్యే వరకు కాదు… ప్రజలకు ఫలితం అందే వరకు పర్యవేక్షణ ఉండాలి !!
పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు కేరళ నుంచి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
వివిధ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, మౌలిక వసతుల పనుల పురోగతిని సమీక్షించి, పెండింగ్ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
🔹 పిఠాపురం మున్సిపాలిటీలో సుమారు ₹300 కోట్ల అభివృద్ధి పనులు
🔹 గొల్లప్రోలులో ₹100 కోట్ల తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్య పనులు
🔹 పాఠశాలల అభివృద్ధికి ₹3.5 కోట్లు, మూలపేట ZP పాఠశాలలో 8 అదనపు తరగతి గదులకు ₹1.34 కోట్లు
🔹 ఆలయాల అభివృద్ధికి ₹30.66 కోట్లు
🔹 పిఠాపురం ROBకు ₹118 కోట్లు – నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం
🔹 PADA కింద ₹50 కోట్ల Critical Gap Funding వినియోగంపై సమీక్ష
🔹 PADA పరిధిలో ఇప్పటివరకు ₹1,026.34 కోట్ల నిధులు మంజూరు
🔹 ఉప్పాడ సముద్ర రక్షణ గోడకు ₹323 కోట్లు
🔹 ₹100 కోట్ల ఆయుష్ మెడికల్ కాలేజీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం
🔹 ₹15 కోట్ల హ్యాండ్లూమ్ సెంటర్ పనులను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని సూచన
🔹 అంగన్వాడీలు, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, సంక్షేమ హాస్టళ్లు, శ్మశాన వాటికలు, పారిశుధ్య మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
మంజూరు చేసిన నిధులు కాగితాలపై కాకుండా… పనుల రూపంలో కనిపించాలి, వాటి ఫలాలు ప్రజలకు చేరాలి.
పిఠాపురం అభివృద్ధిలో వేగం, నాణ్యత, జవాబుదారీతనంతో ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.