#YSRaavanCP#AntiNationalJagan
వైఎస్సార్సీపీ అంటే వైఎస్ 'రావణ్' కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ప్రజలు. అంబటి నుంచి జగన్ వరకు మా రావణ్ కు మేము అండగా నిలబడతాం అనడం... న్యాయసహాయం అందించమని జగన్ ఆదేశించినట్టుగా అంబటి చెప్పడం... గొడ్డలి పార్టీ నేత ఫ్లాట్ నుంచే రావణ్ నడిపించే 'ప్రశ్న' ఛానెల్ నడుస్తుండటం చూస్తే ప్రజలు అనుకునేది నిజమే అనిపిస్తోంది.
#PsychoFekuJagan
#AndhraPradesh
#ChooseSpeedChooseAP#RayalaseemaRising
Cement is usually grey. But can it be green?
Tomorrow, I’m excited that we will be breaking ground on a new way to make cement - sustainably, for our planet.
What could it be?
Kadapa. Stay tuned.
అమరావతిపై జగన్ ఆడిన విషనాటకానికి పద్మనాభరెడ్డి మరణం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శవరాజకీయాలు చేయడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన అనుకూల మీడియాకు కొత్తేమీ కాదు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి మరణాన్ని అడ్డం పెట్టుకుని, జగన్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం మరోసారి వారి నైజానికి అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న భూసమీకరణ వల్లే పద్మనాభరెడ్డి ఒత్తిడికి గురై చనిపోయారంటూ జగన్ చేయిస్తున్న ఈ ప్రచారం పూర్తిగా అబద్ధం, ఫేక్.
అసలు నిజం ఏమిటంటే
• పద్మనాభరెడ్డి అనే వ్యక్తి పేరిట ప్రస్తుతం అక్కడ ఎటువంటి భూమీ లేదు.
• ఆయన కుమారుడు ఉజ్వల్ కుమార్ రెడ్డి పేరిట కేవలం 1 ఎకరం 19 సెంట్ల భూమి మాత్రమే ల్యాండ్ పూలింగ్ స్కీం కింద నోటిఫై చేయబడింది.
• సదరు భూమి సీడ్ యాక్సిస్ రోడ్, కొండవీటి వాగు లేదా మరే ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల పరిధిలోకి రాదు. అలాంటప్పుడు భూమి కోల్పోతున్నారనే ఒత్తిడి ఆయనపై ఎలా ఉంటుంది? ఈ ప్రాజెక్టుల కోసం ఆయన భూమిని కోల్పోవాల్సి వచ్చిందని జగన్ మీడియా చెబుతున్నది పచ్చి అబద్ధం.
సగటు రైతు ప్రశ్న
👉అమరావతి కోసం భూములిచ్చిన రైతులపై ఐదేళ్ల పాటు కక్ష సాధించి, వందలాది మంది మరణానికి కారణమైన జగన్, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతున్నారు?
👉 ఐదేళ్ల జగన్ పాలన, అమరావతిపై సాగిన అణచివేత
నిజంగా రైతుల మరణాల గురించి మాట్లాడాల్సి వస్తే, వేలెత్తి చూపించాల్సింది జగన్ మోహన్ రెడ్డి వైపే. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన అమరావతి రైతులపై పగబట్టి, వారిని మానసిక క్షోభకు గురిచేసి దాదాపు 253 మంది రైతుల ప్రాణాలు బలితీసుకున్న చరిత్ర జగన్ది కాదా?
👉రాజధాని ఉద్యమ సమయంలో జరిగిన కొన్ని దారుణాలు ఈనాటికీ ప్రజల గుండెల్లో అలానే ఉన్నాయి.
1. మహిళలపై అరాచకాలు:గర్భిణీ స్త్రీల కడుపులపై బూటు కాళ్లతో తన్నించి, జుట్టు పట్టి రోడ్లపై ఈడ్చుకెళ్లిన దుర్మార్గం జగన్ పాలనలో జరగలేదా? దుర్గగుడికి వెళ్తున్న అమరావతి మహిళలపై లాఠీచార్జ్ చేయించిన శాడిజం ఎవరిది?
2. అక్రమ కేసులు: హక్కుల కోసం పోరాడిన ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన విడ్డూరం ఈ రాష్ట్రంలో చూశాం.
3. బారికేడ్ల వెనుక పాలన: రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే వారి శిబిరాలపై రౌడీలతో దాడులు చేయించి, ప్రజలను చూడలేక ఇళ్ల తలుపులకు అడ్డుగా బారికేడ్లు, రోడ్లపై పరదాలు కట్టుకుని తిరిగిన పిరికితనం జగన్ ది కాదా?
4. కుల ముద్ర వేసి. అభివృద్ధిని తొక్కిపెట్టి: రాజధానికి భూములిచ్చిన వారిలో 32 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, 23 శాతం మంది రెడ్లు, 14 శాతం బీసీలు, 9 శాతం కాపులు, 3 శాతం మైనారిటీలు ఉన్నారు. అంటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అమరావతికి మద్దతు పలికారు. కానీ, కేవలం 18 శాతం ఉన్న ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అమరావతిని 'కమ్మరావతి' అని విష ప్రచారం చేయించింది జగన్ కాదా?
5. దళితులు అధికంగా ఉన్న ప్రాంతంలో రాజధాని వస్తే ఆ వర్గాలు ఆర్థికంగా ఎదుగుతాయనే కుట్రతో, రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఐదేళ్ల పాటు డ్రామాలు ఆడి, ఏ ఒక్క రాజధాని లేకుండా చేసిన నయా తుగ్లక్ జగన్ మోహన్ రెడ్డి కాదా ?
ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిపై విషం కక్కిన జగన్, నాటి రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది రైతులను బలవంతంగా ఆపి, వారి జీవితాలు బాగుపడకుండా అడ్డుకున్నాడు. ఆనాడు జగన్ సృష్టించిన అభద్రతాభావం, దిగులుతోనే పద్మనాభరెడ్డి వంటి ఎందరో రైతులు మానసిక వేదనతో చనిపోయారు. కాబట్టి జగన్ మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారమే చూసినా... పద్మనాభరెడ్డి లాంటి రైతుల అకాల మరణాలకు ముమ్మాటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే కారణం!
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh