It was a privilege to clap the first shot and launch the shoot of #NBK112 in #Amaravati.
This is more than the beginning of a film - it is another step towards making Amaravati a vibrant hub for the creative economy. Under the leadership of Hon'ble CM Shri @ncbn garu, we are committed to creating world-class infrastructure that enables the film industry and creators to thrive in Andhra Pradesh.
My best wishes to Bala Mavayya, the entire cast and crew for a blockbuster success. Looking forward to seeing many more films begin their journey from Andhra Pradesh.
డిఎస్సీ 2025లో హారిజాంటల్ రిజర్వేషన్లపై ఇప్పుడు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న వైసీపీ, హారిజాంటల్ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో (GO 77) ఇచ్చింది జగన్ ప్రభుత్వమే అని మర్చిపోయినట్లుంది. కోర్టు తీర్పుల ఆధారంగా ఆ జీవో (తేదీ: 02-Aug-2023న) జారీ చేసినట్లు అప్పటిలో జగన్ ప్రభుత్వమే చెప్పింది.
మరి 2025 DSC అభ్యర్థులను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నావు జగన్?
వాళ్ళ మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నావు జగన్ ?
అధికారంలో ఉన్నప్పుడు చేసింది మర్చిపోయినట్టు నటిస్తూ ... అధికారం పోయాక మరో కథనా?
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
విశాఖ కేజీహెచ్ లో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. వారికి ధైర్యం చెప్పాను. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చాను. సెవెన్ హిల్స్, కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించాను. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నాను. కార్మికులతో మాట్లాడి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చాను.
బాధలో ఉన్న కుటుంబాల వద్దకు వెళ్లింది రాజకీయాల కోసం కాదు... బాధను పంచుకోవడానికి
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన విషాద ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, పలువురు తీవ్రంగా గాయపడటం ప్రతి ఒక్కరినీ బాధించింది.
అలాంటి సమయంలో మంత్రి నారా లోకేష్ గారు కేజీహెచ్కు, అనంతరం స్టీల్ ప్లాంట్కు వెళ్లింది రాజకీయాలు చేయడానికి కాదు... బాధలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడానికి. కన్నీటి పర్యంతమైన కుటుంబాలను ఓదార్చడానికి. వారి చేతిని పట్టుకుని ప్రభుత్వం మీతోనే ఉందని భరోసా ఇవ్వడానికి.
కానీ దురదృష్టవశాత్తూ, అక్కడ కూడా కొందరు రాజకీయ నినాదాలతో వాతావరణాన్ని ఉద్రిక్తం చేయడానికి ప్రయత్నించారు.
అయినా లోకేష్ గారు సహనం కోల్పోలేదు.
“సార్... ప్లీజ్. కుటుంబాలతో మాట్లాడనివ్వండి. ఇప్పుడు రాజకీయాలు వద్దు... ప్లీజ్” అని పదేపదే విజ్ఞప్తి చేశారు.
నినాదాలు కొనసాగినా, ఆయన వెనక్కి తగ్గలేదు. బాధిత కుటుంబాల వద్ద కూర్చొన్నారు. వారి ఆవేదనను విన్నారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
నాయకత్వం అంటే మైక్ ముందు మాట్లాడటం కాదు... బాధలో ఉన్న వారి పక్కన కూర్చోవడం.
నాయకత్వం అంటే నినాదాలు చేయడం కాదు... కన్నీరు తుడవడం.
నాయకత్వం అంటే రాజకీయ ప్రదర్శన కాదు... మానవత్వాన్ని చూపించడం.
ఆ రోజు బాధిత కుటుంబాలకు ఒక మంత్రి మాత్రమే కనిపించలేదు... ఒక అన్నయ్య కనిపించాడు.
కొంతమందికి రాజకీయాలు కనిపించి ఉండొచ్చు. కానీ బాధలో ఉన్న కుటుంబాలకు మాత్రం అండగా నిలిచిన మనిషి కనిపించాడు.
చరిత్ర ఎప్పుడూ నినాదాలను గుర్తుంచుకోదు.
బాధలో ఉన్న వారి పక్కన నిలిచిన వారినే గుర్తుంచుకుంటుంది.
#VizagSteelMartyrs #NaraLokesh #VizagSteelPlant
డేటా సెంటర్లు మంచివి కావని అంటూ కొంతమంది సృష్టిస్తున్న అపోహలపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు.
"డేటా సెంటర్లు మంచివి కావు" అంటూ అమెరికా ఉదాహరణ చెబుతున్నారు. అమెరికాను చూసుకుంటే, మన దేశంలో వన్ నేషన్ - వన్ గ్రిడ్ ఉంది. అమెరికాలో అది లేదు.
నీటి విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం గోదావరి నుంచి దాదాపు 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇది వియత్నాం లేదా బ్రెజిల్ దేశాల మొత్తం వార్షిక నీటి వినియోగంతో సమానం.
మేము నిర్మించాలనుకుంటున్న 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే అవసరం. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్, ఒక గిగావాట్ డేటా సెంటర్ కంటే 7 రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుంది.
కానీ ప్రతి ఒక్కరూ డేటా సెంటర్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప, థర్మల్ పవర్ ప్లాంట్ల గురించి మాట్లాడటం లేదు. కాబట్టి యువతతో ఈ విషయాలపై చర్చించడం, వారి భయాలు మరియు అపోహలను తొలగించడం చాలా ముఖ్యం.
#NaraLokesh
#AndhraPradesh
#Mahanadu2026#NTRLivesOn
మహా నాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తి..
దార్శనికుడు చంద్రబాబు దిశా నిర్దేశం..
యువసారధి లోకేష్ కార్యాచరణ..
ప్రతిబింబించిన మహానాడు 2026
లక్షలాది టీడీపీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషితో మహా వేడుకగా విజయవంతమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ
హైబ్రిడ్ విధానంలో 24 లక్షల మందిపైగా డిజిటల్ అటెండెన్స్ నమోదైన ఈ మహానాడు రికార్డు సృష్టించింది.
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి. దశాబ్దాల మన కల నెరవేరుతోంది. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుంది. కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక వృద్ధికి బాటలు వేస్తుంది. మన రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్గా మార్చేందుకు ఇది ఒక కీలక మైలురాయి. ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారికి రాష్ట్ర ప్రజల తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు.
@narendramodi@AshwiniVaishnaw
#Mahanadu2026#SthreeShakti
స్త్రీశక్తి థీమ్తో, 'జై కార్యకర్త' నినాదంతో రెండు రోజుల పాటు జరిగిన హైబ్రిడ్ మహానాడు విజయవంతమైంది. 12 దేశాలు, 1875 క్లస్టర్ల నుండి 24 లక్షల మందికి పైగా కార్యకర్తలు, నేతలు, అభిమానులు భాగస్వాములు కావడం నాకు చాలా సంతోషం కలిగించింది. పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ @naralokesh ప్రతిపాదించినట్టుగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుపై చర్చించాం. తెలుగుజాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని చాటుతూ, రాష్ట్రాభివృద్ధికి పునరంకితం అయ్యేలా జరిగిన మహనాడును విజయవంతం చేసిన కార్యకర్తలకు, నేతలకు నా అభినందనలు.
#Mahanadu2026 విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కోట్లాది కుటుంబసభ్యుల ఆశీస్సులతో నేను టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత జరిగిన తొలి మహానాడు ఘన విజయం టీం టీడీపీ కృషి. సమష్టిగా పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయగలమో టీడీపీ కుటుంబం నిరూపించింది.
#SthreeShakti
The next era of Indian politics must belong to women leadership.
At #Mahanadu2026, I proposed 33% reservation for women in TDP for the 2029 elections.
Women must not remain mere beneficiaries in politics. They must become decision-makers and leaders shaping India’s future.
TDP will lead from the front. This is not a slogan - it is our commitment.
#SthreeShakti
#NaaTDPNaaBadhyata
మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను @ysjagan గారు! మీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మేం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి జగన్ గారూ! మీరు టెన్త్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరం. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో, నిద్రాహారాలు మాని, చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లు అందరికీ జగన్ గారు లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలి. మెగా డీఎస్సీ ఆపాలని 200 కేసులు, గూగుల్, టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా వారి భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తున్న జగన్ గారూ మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరు.
ఒకే మతం అయినా ఒకే ఊర్లో ఒక కుల దేవతను మరొకరు మొక్కరు. అన్ని భావ వైరుధ్యాల విభిన్న సంస్కృతులు మన దేశంలో ఉంటాయి.
వేరే కులం, వేరే ప్రాంతం, వేరే మతాల పండగలను సాధారణంగా గౌరవించరు లేదా పట్టించుకోరు.
కానీ కుల, మత, ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా లక్షలాది మందితో ఒక పండగ జరుగుతుంది.
నాలుగు దశాబ్దాలుగా జరుగుతోంది.
సమాజమంతా శుభానికి సూచికైన పసుపుమయం అయిపోతుంది.
తెలుగు నేలపై పసుపు జెండా కేవలం ఒక రాజకీయ గుర్తు కాదు; అది కోట్ల మంది గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవ నినాదం. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, అన్న నందమూరి తారక రామారావు గారు నాటిన ఆశయాల మొక్క, నేడు మహావృక్షమై నిలిచింది. ఆ వృక్షానికి ప్రతి ఏటా మే నెలలో జరిగే వసంతోత్సవమే ‘మహానాడు’.
ఇది కేవలం ఒక పార్టీ ప్రతినిధుల సభ కాదు; కష్టాల కడలిని ఈది, అణచివేతలను ఎదుర్కొని, త్యాగాల పునాదులపై నిలబడిన లక్షలాది మంది కార్యకర్తల భావోద్వేగాల మేళవింపు.
నాడు, తెలుగు జాతికి ఒక ప్రత్యేక గుర్తింపును, ఢిల్లీ పీఠాల ముందు మోకరిల్లని ఆత్మగౌరవాన్ని ప్రసాదించడానికి అన్న ఎన్టీఆర్ చైతన్య రథమెక్కిన రోజులు గుర్తొస్తే నేటికీ నరనరాల్లో రక్తం ఉరకలేస్తుంది. ‘సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు’ అంటూ ఆయన ప్రవచించిన సిద్ధాంతం ఈనాటికీ మహానాడు వేదికలపై ప్రతిధ్వనిస్తూనే ఉంది.
అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజా పక్షాన నిలబడి పోరాడే తత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఈ పండుగ ప్రతి కార్యకర్తకూ నూరిపోస్తుంది. నాయకుడు దిశానిర్దేశం చేస్తే, ఆ దిశను తమ శ్వాసగా మార్చుకునే సైనికులు కదిలే ప్రస్థానం ఇది.
"ప్రాణం పోయినా, పీక కోసినా ‘జై తెలుగుదేశం’ అని పలికే నిబద్ధత.. కష్టకాలంలోనూ జెండాను గుండెలకు హత్తుకుని నిలిచే కార్యకర్తల త్యాగనిరతే ఈ పసుపు సైన్యానికి అసలైన బలం."
మహానాడు విశిష్టత ఎక్కడుందంటే, అది సామాన్య కార్యకర్తను అగ్రపీఠంపై కూర్చోబెడుతుంది. ఎండనక, వాననక, కక్ష సాధింపు చర్యలకు భయపడక, పార్టీ కోసం సర్వస్వాన్ని ధారపోసిన ప్రతి ఒక్కరి శ్రమకు లభించే గౌరవ వందనం ఇది.
నారా చంద్రబాబు నాయుడి సుదీర్ఘ విజన్, నారా లోకేష్ యువ చైతన్యం ఈ పండుగలో మేళవించి, సరికొత్త భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఇటీవల ‘స్త్రీ శక్తి’ వంటి వినూత్న థీమ్లతో సమాజంలో సగభాగమైన మహిళలకు, వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ, ‘మహానాడు’ కేవలం రాజకీయ తీర్మానాలకే పరిమితం కాకుండా సామాజిక విప్లవాలకు వేదికగా మారుతోంది.
చరిత్ర ఎప్పుడూ సులువుగా రాయబడదు; ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర త్యాగాలతో, పోరాటాలతో లిఖించబడింది. చీకట్లు ముసిరినప్పుడు వెలుగురేఖలా, కష్టాలు ఎదురైనప్పుడు కొండంత అండలా నిలబడే వ్యవస్థ ఇది.
ఈ పసుపు తోరణాలు, రాత్రి వేళల్లో సైతం కార్యాలయాల్లో వెలిగే కాంతులు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. నవ సమాజ నిర్మాణానికి, తెలుగుజాతి అఖండ ప్రగతికి సరికొత్త శంఖారావం. మహానాడు స్ఫూర్తి ప్రతి ఒక్కరి గుండెల్లో నిరంతరం ప్రవహించే ఒక చైతన్య స్రవంతి!
తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే సిద్ధాంతం.. జోహార్ ఎన్టీఆర్! జై తెలుగుదేశం!
#Mahanadu2026
#SthreeShakti
#TeluguDesamParty
#AndhraPradesh
తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn గారి ఆశయాలకు మరింత చేరువవుతాం.
మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.
మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం!
#NaaTDPNaaBadhyata
#నాతెలుగుదేశంనాబాధ్యత
‘సంజీవని’ సిటిజన్ వెల్ నెస్ మిషన్ నా మనసుకు ఎంతో దగ్గరగా ఉండే ప్రాజెక్టు. సంపద కంటే ఆరోగ్యం ఉన్న వాళ్లే అదృష్టవంతులు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలున్నారు. సమాజం బాగుండాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ అనే విధానంలో సంజీవని ప్రారంభించాం. కుప్పంలో పైలట్ గా ప్రారంభమైన సంజీవని ప్రాజెక్టు చిత్తూరు జిల్లాలో విజయవంతంగా నడుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళిక చేశాం. వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రజారోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడమే సంజీవని ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. 42 వైద్య పరీక్షలను ఇంటి వద్దే నిర్వహించి రిపోర్టులు ఇవ్వటంతో పాటు వ్యక్తిగత ఆరోగ్య పర్యవేక్షణ కోసం డాక్టర్ అప్పాయింట్ మెంట్, వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్య సలహాలు, సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డుల పర్యవేక్షణ చేస్తున్నాం. సంజీవని అనేది ఓ సాఫ్ట్ వేర్ మాత్రమే కాదు అత్యుత్తమ డిజిటల్ పబ్లిక్ హెల్త్ ఆపరేటివ్ సిస్టమ్. ఈ వినూత్న విధానం విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లే. నేను ఇవన్నీ చేస్తున్నది మీ కోసమే.
#Sanjeevani
ఇలాంటి క్రూరత్వం సినిమాల్లో చూస్తాం.. వైఎస్ కుటుంబం 40 ఏళ్ల క్రితమే చూపించింది..
పులివెందులలో వైఎస్ రాజారెడ్డి రౌడీ, హత్యా రాజకీయాలకు ఈ ఫోటోలే సాక్ష్యం. తనకు, తన కొడుక్కి రాజకీయంగా ఇబ్బంది వస్తుందనే కారణంతో, లింగాల మండలం పార్నపల్లిలో టీడీపీకి చెందిన జొన్నలగడ్డ సోదరులు సత్యనారాయణ, సూర్యనారాయణ ఇళ్లను డైనమైట్లతో రాజారెడ్డి పేల్చేశారని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనం..
నాటి వైఎస్ కుటుంబం అరాచక విధ్వంసకాండకు, బాంబుల సంస్కృతికి ఇవిగో సాక్ష్యాలంటూ ఫోటోలను విడుదల చేసిన మంత్రి పయ్యావుల.
#PsychoFekuJagan
#AndhraPradesh
ఎందుకు జగన్ పేదలకు ఎక్కువ మెడికల్ సీట్లు ఉచితంగా ఇస్తుంటే, ఈ ఏడుపు ?
నీకంటే ప్రతి మెడికల్ కాలేజీలో, 11 సీట్లు అదనంగా ఇస్తున్నాం. మొత్తం 110 ఫ్రీ సీట్లు పేదలకు అదనంగా వస్తున్నాయి..
నువ్వు ఎంత ఫేక్ చేసినా, ఎంత గొంతు చించుకున్నా, ప్రజలు నమ్మరు జగన్...
#JaganExposesJagan
#JaganFakedMedicalColleges
#PsychoFekuJagan
#PPPModel
#AndhraPradesh