On #InternationalYouthDay, my heartfelt greetings and best wishes to all the young minds whose energy, ideas and determination are shaping the India of today and tomorrow.
Our youth are not just the future of our nation; they are our greatest strength today and our brightest hope for tomorrow.
Wishing every young person the courage to dream, the confidence to achieve and the opportunity to create a better tomorrow.
“దిశ”ను ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం.
మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైయస్సార్సీపీ ప్రభుత్వం “దిశ”ను తీసుకొచ్చింది. నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చార్జిషీటు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించాం.
దిశలో భాగంగా మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు SOS బటన్ నొక్కినా, ఫోన్ను 5 సార్లు షేక్ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చాం. 1.51 కోట్ల మంది దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్ను అప్పట్లో మా ప్రభుత్వంలో పోలీసులు పరిష్కరించారు.
18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసును అందుబాటులోకి తీసుకొచ్చి 13,500 మందితో క్షేత్రస్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించాం. 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం.
నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా ఈ కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేశాం. సత్వర విచారణ కోసం 13 ప్రత్యేక POCSO కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటాబేస్ను రూపొందించాం.అందుకనే దిశ విజయవంతగా మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలను అదించింది.
2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గించగలిగారు.
164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేశారు. తీవ్రమైన కేసుల్లో 51 శాతానికిపైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేశారు.
గతంలో DNA నివేదికలకు నెలలు పట్టేది. దిశ ఫోరెన్సిక్ వ్యవస్థతో వాటిని రోజుల్లోనే అందించే పరిస్థితి తీసుకొచ్చాం. 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి.
మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. వార్షిక సగటు కేసులు 14,338 నుంచి 10,426కు తగ్గాయి.
ఇదీ దిశ ఇచ్చిన భరోసా. ఇవీ దిశ సాధించిన ఫలితాలు. అందుకే 19జాతీయ అవార్డులను మా ప్రభుత్వ హయాంలో “దిశ’’ గెలుచుకుంది. “దిశ” అనేది కాగితాల మీదున్న పేరు కాదు. ప్రమాదంలో ఉన్న మహిళ SOS నొక్కిన క్షణం నుంచి, నిందితుడికి శిక్ష పడే వరకు ఆమెకు అండగా ఉండే సజీవమైన మహిళా రక్షణ నెట్వర్క్.
ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం “BNS (భారతీయ న్యాయ సంహిత) చాలు, దిశ అవసరం లేదు” అంటోంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన SOS వ్యవస్థ, ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు, గ్రామ స్థాయి నుంచే మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, లైంగిక నేరస్తుల డేటాబేస్, వేగవంతమైన ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్, ప్రత్యేక కోర్టులు, నిర్ణీత సమయంలో దర్యాప్తు! న్యాయం అనే లక్ష్యానికి BNS ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది?
మహిళలు, చిన్నారులపై తీవ్రమైన దారుణాలు జరిగినప్పుడు 7 పని రోజుల్లో పోలీసు దర్యాప్తు, ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత 14 పని రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసేలా దిశ ద్వారా తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా వైయస్సార్సీపీదే. 21 రోజుల్లోగా బాధితులకు న్యాయం అందించాలన్న అలాంటి లక్ష్యాన్ని కూడా ఈ ప్రభుత్వం విమర్శించడం మరింత బాధాకరం.
ఆ లక్ష్యం వెనుక ఉద్దేశం ఒక్కటే, దర్యాప్తులో జాప్యం ఉండకూడదు. విచారణలో ఆలస్యం ఉండకూడదు. మహిళలు, చిన్నారులపై నేరాలను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా విచారించాలి. నేరం చేస్తే చట్టం వేగంగా, కఠినంగా స్పందిస్తుందనే భయం నేరస్తుల్లో ఉండాలి. అలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి, వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యాన్నే తప్పుపట్టడం మహిళలకు ఏ సందేశం పంపుతోంది? మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం జరగాలని కోరుకోవడమే ఈ ప్రభుత్వానికి అభ్యంతరమా?
“దిశ”ను ఉపసంహరించుకోవడం ద్వారా @ncbn ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోంది. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. మహిళలు తమ రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోంది.
మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి.
దిశను రద్దు చేయడం కాదు-రక్షించాలి.
దిశను నిర్వీర్యం చేయడం కాదు-మరింత బలోపేతం చేయాలి.
English Version- https://t.co/40y4wquoK9
పని వైయస్సార్సీపీది … ప్రచారం చంద్రబాబుది!
‘క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్’-అదే చంద్రబాబు మార్కు రాజకీయం
ఉత్తరాంధ్ర కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్పోర్టు కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుంది. తద్వారా దేశవిదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుంది.
అయితే ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ను చోరీ చేసేందుకు చంద్రబాబుగారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.
@ncbn గారూ… భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండి. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా, ఏమీ చేయకపోయినా, ఒక రాయి వేయడం తప్ప, భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది?
జూన్ 2020లో నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం నుంచి, ల్యాండ్ అక్విజషన్, ఆర్ అండ్ ఆర్, సైట్ క్లియరెన్స్, ఎన్ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్, ఇంటర్నల్ రోడ్లు, ఏరోనాటికల్ సర్వీసులు, ఆర్థిక సమీకరణ వరకు ప్రతి కీలకమైన ప్రక్రియ పూర్తయింది మా ప్రభుత్వ హయాంలోనే. కాదంటారా చంద్రబాబుగారూ?
అన్నింటికంటే ముఖ్యంగా మీరు పూర్తి చేయలేకపోయిన భూసేకరణను మేం పూర్తి చేశాం. నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాం. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.967 కోట్లు, ఎయిర్పోర్టుకు నీళ్లు తీసుకురావడంకోసం రూ.75కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కోసం రూ. 134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్లకోసం రూ.7.29 కోట్లు, సబ్స్టేషన్ కోసం రూ.2.35 కోట్లు మొత్తంగా రూ.1200 కోట్లు పెట్టింది మేం. మరి మీరు చేసింది ఏమిటి చంద్రబాబుగారూ?
ఇవన్నీ పూర్తి చేశాం కాబట్టే, అన్ని అనుమతులు, అన్ని NOCలు, అన్ని సౌకర్యాలు పూర్తిచేశాం కాబట్టే, కోవిడ్ వంటి మహాసంక్షోభాన్ని ఎదుర్కొంటూనే, పనులు ప్రారంభించి, 2024 ఎన్నికల నాటికే, విమానాశ్రయ రన్వే పనులను కీలక దశకు తీసుకురాగలిగాం. టెర్మినల్ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాం.
మా ప్రభుత్వం చేసిన విశేష కృషి నేపథ్యంలోనే 2026 జూన్లోనే భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించాం. మేం చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలం.
కానీ చంద్రబాబుగారూ… మీరు అప్పడూ ఏమీ చేయలేదు, ఇప్పుడు కూడా ఏమీ చేయడంలేదు. విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. ‘‘ఎయిర్పోర్టు ఉంది… కానీ సిటీ నుంచి వేగంగా, తక్కువ సమయంలో చేరుకునేందుకు రోడ్డు లేదు. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సమయంలో విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా 77 మీటర్ల వెడల్పుతో, రూ. 6,300 కోట్ల ఖర్చుతో 55 కి.మీ. మేర ఆరులేన్ల హైవేకోసం కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడితీసుకురావడంతో, కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీ గారు స్వయంగా ఆ రహదారిని మంజూరు చేస్తున్నట్లు అక్కడే ప్రకటించారు. ఆయన ఇప్పుడు కూడా అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. మరి చంద్రబాబుగారూ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ కూడా అధికారంలో ఉన్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఆ రహదారికి అతీగతీ లేదు. ఇప్పడు భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాలంటే ప్రయాణికులు నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదీ మీ చిత్తశుద్ధి, గతంలో అయినా అంతే, ఇప్పుడైనా అంతే.
పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి, దాదాపు 80 ఏళ్లు వస్తున్నాయి.
సంబంధిత ఆధారాలు- https://t.co/Tb1siVSfEE
#CreditChorBabu
రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. తమ అపార జ్ఞాన సంపదతో, ఓర్పుతో విద్యార్థులకు జీవిత విలువలను బోధిస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న గురువులందరికీ హృదయపూర్వక వందనాలు.
#GuruPurnima
మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం.
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు శ్రీ కారుమూరి నాగేశ్వర రావు @karumurionline గారి కుమారులు, యువనేత శ్రీ కారుమూరి సునీల్ @sunil_karumuri అక్రమ అరెస్టును ఖండించిన వైఎస్సార్సీపీ బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి, చిట్టమూరు మండల ఉపాధ్యక్షులు బీవీ రమణయ్య
@YSRCParty@ysjagan
నేరస్తుల కోసమే వైసీపీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న సరికొత్త పొలిటికల్ లైన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు, విస్మయానికి దారితీస్తోంది. విజయవాడలో దారుణమైన నేరాల చరిత్ర ఉండి, అదృశ్యమైన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వెళ్లడం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. ఒక బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రి, నిందితుడి ట్రాక్ రికార్డ్ తెలిసి కూడా నేరుగా వారి ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించడం ద్వారా సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారనే దానిపై పౌర సమాజం అవాక్కవుతోంది.
పార్టీ నేతలకు కాదు..నేరస్తులకు జగన్ పరామర్శలు
ఈ పరామర్శల వెనుక ఒక సీరియల్ పాటర్న్ కనిపిస్తోంది. ఇది కేవలం ఒక అనుకోని ఘటన కాదు.. గతంలో గుంటూరు జిల్లా తెనాలిలోనూ ఇలాగే తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లకు జగన్ స్వయంగా వెళ్లి పరామర్శలు చేశారు. ఇప్పుడు విజయవాడలో బీరు సీసాలతో ఒక యువకుడిని కిరాతకంగా చంపి, ఆ రక్తపాతాన్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్గా పెట్టిన సైకో మైండ్సెట్ ఉన్న రౌడీషీటర్ కోసం తాడేపల్లి ప్యాలెస్ కదిలిరావడం చూస్తుంటే.. జగన్ తన రాజకీయ ఎజెండాను చాలా స్పష్టంగా, మొహమాటం లేకుండా ప్రజల ముందు ఉంచినట్లు కనిపిస్తోంది. పార్టీ నేతలు చాలా మంది జైళ్లకు వెళ్లినా పరామర్శల్లేవు కానీ..ఇలాంటి రౌడీల ఇళ్లకు వెళ్తున్నారంటే జగన్ మైండ్ సెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
ప్రజలకు నేరుగానే తన ఉద్దేశం చెబుతున్న జగన్
జగన్ ఈ చేతల ద్వారా ప్రజలకు అత్యంత వినాశకరమైన, స్పష్టమైన సందేహాలకు తావులేని సందేశాన్ని ఇస్తున్నారు. నేను పూర్తిగా నేరగాళ్లకు, సమాజానికి హాని చేసే శక్తులకు అండగా ఉంటాను.. రేపు పొరపాటున నేను మళ్లీ అధికారంలోకి వచ్చినా కూడా రాష్ట్ర ప్రజల జీవితాలు, శాంతిభద్రతలు మళ్లీ ఈ రౌడీమూకల చేతుల్లోనే ఉంటాయి అని ఆయన తన చర్యల ద్వారా నిరూపిస్తున్నారని సామాన్యులు భావిస్తున్నారు. తన పార్టీకి మద్దతిచ్చే కులానికి చెందిన నవీన్ రెడ్డి లాంటి సామాన్య కుటుంబాలను వదిలేసి, సమాజానికి క్యాన్సర్ లాంటి నేరగాళ్లకు రాజకీయ రక్షణ కల్పించడమే విపక్ష పంథాగా మారడం ఏపీ చరిత్రలోనే నేర రాజకీయం.
తేల్చుకోవాల్సింది జగన్ మద్దతుదారులే !
ప్రభుత్వంపై ప్రజాపోరాటాలు చేయడమంటే ప్రజల పక్షాన నిలబడటం.. అంతే కానీ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే క్రిమినల్స్ వెనుక నిలబడటం కాదనే కనీస లాజిక్ను వైసీపీ విస్మరించింది. జగన్ తీసుకుంటున్న ఈ వివాదాస్పద నిర్ణయాలు కూటమి ప్రభుత్వానికి బురదజల్లడం పక్కన పెడితే.. సగటు ఓటర్లలో వైసీపీ పట్ల తీవ్ర అసహ్యానికి, భయానికి కారణమవుతున్నాయి. నేరగాళ్లకు కొమ్ముకాసే ఇటువంటి ‘రాజకీయ సంస్కృతి’ రాష్ట్రానికి అవసరమా లేదా అనేది తేల్చుకోవాల్సిన బాధ్యతను జగన్ తన పర్యటనల ద్వారా ప్రజలకే వదిలేశారని, రాబోయే రోజుల్లో ప్రజలు దీనిపై మరింత నిర్మొహమాటంగా తమ తీర్పును ఇవ్వడం ఖాయం
న్యాయం జరిగిందో లేదో కానీ ఆ తల్లి దుఃఖం కొంతైనా తగ్గినట్లు కనిపిస్తుంది..
కానీ నిన్నటి వరకు రౌడీ షీటర్ అని, కేసులు అని, పలు రకాల మాటలతో వికృత క్రీడలాడిన మీ తెలుగుదేశం శ్రేణుల ముఖ చిత్రాలేంటో???
@JaiTDP
"నీకు న్యాయం చేస్తాం" అన్నారు, చేసి చూపించారు. కూటమి ప్రభుత్వంలో ఒక సామాన్యుడికి నిజమైన న్యాయం జరిగింది.
చంద్రబాబు గారి లాంటి మహోన్నతమైన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు ఉన్నంత కాలం న్యాయం నిలబడుతుంది అనే భరోసా వచ్చింది. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
#ChandrababuNaidu
#AndhraPradesh
Hyderabad, Telangana: YSRCP leader, Mekapati Vikram Reddy says, "To understand this, I think the TDP has a very strong propaganda machine. One of the narratives being promoted today is to project Nara Lokesh as the next possible head of the TDP, if not the future Chief Minister of Andhra Pradesh. Please examine what Nara Lokesh has done for the state over the last two years after assuming a leadership role. He has promoted what critics refer to as the "Red Book Constitution." According to his opponents, this has contributed to political polarization and discord in many villages across Andhra Pradesh..."
అనిత గారి అసలు రూపం అందరికీ తెలిసేలా చేయండి.
గతం అనిత గారు మాట్లాడిన విధానం అందరూ వినండి.
అప్పుడు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు చెబుతోంది.
ఒక మహిళగా ఉంటూ ఇలాంటి సంస్కారం లేకుండా మాట్లాడటం ఏంటి @Anitha_TDP గారు??
Heartiest congratulations to Dhiraj Bommadevara from Vijayawada on creating history at the Archery World Cup by winning the Men’s Singles Gold Medal. Winning two gold medals in a single day, including the Mixed Doubles title, is a remarkable achievement that has made Andhra Pradesh and India proud. Wishing him many more victories and glory in the years ahead.
#IndianArchery
@BommadevaraD
The @ncbn government continues to suppress the voices of the people and the opposition. After the takedown of our official Instagram handle earlier this year, the official YSRCP Facebook page has now been made inaccessible in India.
This is not just an attack on YSRCP; it is an attack on democratic values and freedom of expression. We only reveal facts, expose the government’s failures and corrupt practices, and bring to light issues that affect the people. Silencing an opposition party’s official handles, there by opposition voices for speaking the truth sets a dangerous precedent and is most undemocratic.
From cases being filed against those questioning the government on expenditure profligacy associated with Amaravati capital development, irregularities in the DSC process, TTD ghee tenders, and other matters of public importance bringing to light appropriate evidence of rampant corruption, to the restriction of critical content online, a disturbing pattern is emerging.
We will challenge these unfair actions through every legal and constitutional avenue. No intimidation, censorship, or misuse of institutions can silence the voice of the people. We remain committed to holding those in power accountable and defending the fundamental right to freedom of speech and expression.
We demand the immediate restoration of the official page in the interest of democracy and to uphold the constitutional spirit.
@AshwiniVaishnaw, @GoI_MeitY, @AmitShah, @PMOIndia, @Meta, @MIB_India, @Facebook
#SaveDemocracy #FreedomOfSpeech
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India