.@ncbn గారూ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైయస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీచేస్తారా? రైతుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా? ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడికాదా ? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా? లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కో-ఆర్డినేట్ చేయడం అత్యంత దారుణం.
అమరావతి పేరుతో మీరు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పు అవుతుందా? భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీచేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే కొండవీటి వాగును నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి, గత్యంతరంలేని పరిస్థితులను వారికి కల్పించడం, భూములు ఇవ్వకపోయినా, రిటర్న్బుల్ ప్లాట్లకింద రైతుల పొలాలను, వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయించడం… ఇన్నిరకాలుగా నరకయాతనకు గురిచేస్తుంటే, ఆ బాధలు భరించలేక రైతులు కన్నీరు పెడుతుంటే, వారి గోడు వింటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం మేం చేస్తుంటే, మీరు మీ వాళ్లచేత రౌడీయిజం చేయిస్తారా?
అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? మీ బినామీలు, మీ నాయకులకు భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా? అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వగలరా?
చంద్రబాబుగారు, ఇవాళ మీ అవినీతి, దోపిడీకోసం రాష్ట్రంలో జంగిల్ రాజ్యాన్ని స్థాపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో మీ పచ్చముఠాలతో స్వైరవిహారం చేయిస్తున్నారు. ప్రజా గొంతుకలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. దీనిపై ఇదివరకే మేం చాలాసార్లు హెచ్చరించాం. అయినా మీలో మార్పు రాలేదు సరికదా, రోజురోజుకూ మీ దుర్మార్గాలను రెట్టింపు చేస్తున్నారు. ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి, రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయం. మీరు చేసే దాడులకు వైయస్సార్సీపీ తలవంచదు. అమరావతి పేరుతో రైతులను మీరు పెడుతున్న ఇబ్బందులను, అవినీతి, దోపిడీలను, దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు మేం ఎండగడతాం. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరివాళ్లు కాదు. వారి పక్షాన నిలబడుతూ, వైయస్సార్సీపీ వారికి తోడుగా నిలుస్తుంది.
English Version- https://t.co/VLL3jBidAz
Heartiest birthday wishes to Brother Vijay, the Hon’ble Chief Minister of Tamil Nadu. May you be blessed with good health and success in all your endeavors.
@TVKVijayHQ
Best event anukovachu entire Indian film industry lo ne recent times lo andaru happy ga vacharu director,hero Chepina rules and safety precautions tesukunaru heartful of lifetime experience icharu..malli malli elanti moments vachina denini beat chese di radu emo #Varanasi ❤️❤️❤️
నేరస్తుల కోసమే వైసీపీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న సరికొత్త పొలిటికల్ లైన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు, విస్మయానికి దారితీస్తోంది. విజయవాడలో దారుణమైన నేరాల చరిత్ర ఉండి, అదృశ్యమైన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వెళ్లడం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. ఒక బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రి, నిందితుడి ట్రాక్ రికార్డ్ తెలిసి కూడా నేరుగా వారి ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించడం ద్వారా సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారనే దానిపై పౌర సమాజం అవాక్కవుతోంది.
పార్టీ నేతలకు కాదు..నేరస్తులకు జగన్ పరామర్శలు
ఈ పరామర్శల వెనుక ఒక సీరియల్ పాటర్న్ కనిపిస్తోంది. ఇది కేవలం ఒక అనుకోని ఘటన కాదు.. గతంలో గుంటూరు జిల్లా తెనాలిలోనూ ఇలాగే తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లకు జగన్ స్వయంగా వెళ్లి పరామర్శలు చేశారు. ఇప్పుడు విజయవాడలో బీరు సీసాలతో ఒక యువకుడిని కిరాతకంగా చంపి, ఆ రక్తపాతాన్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్గా పెట్టిన సైకో మైండ్సెట్ ఉన్న రౌడీషీటర్ కోసం తాడేపల్లి ప్యాలెస్ కదిలిరావడం చూస్తుంటే.. జగన్ తన రాజకీయ ఎజెండాను చాలా స్పష్టంగా, మొహమాటం లేకుండా ప్రజల ముందు ఉంచినట్లు కనిపిస్తోంది. పార్టీ నేతలు చాలా మంది జైళ్లకు వెళ్లినా పరామర్శల్లేవు కానీ..ఇలాంటి రౌడీల ఇళ్లకు వెళ్తున్నారంటే జగన్ మైండ్ సెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
ప్రజలకు నేరుగానే తన ఉద్దేశం చెబుతున్న జగన్
జగన్ ఈ చేతల ద్వారా ప్రజలకు అత్యంత వినాశకరమైన, స్పష్టమైన సందేహాలకు తావులేని సందేశాన్ని ఇస్తున్నారు. నేను పూర్తిగా నేరగాళ్లకు, సమాజానికి హాని చేసే శక్తులకు అండగా ఉంటాను.. రేపు పొరపాటున నేను మళ్లీ అధికారంలోకి వచ్చినా కూడా రాష్ట్ర ప్రజల జీవితాలు, శాంతిభద్రతలు మళ్లీ ఈ రౌడీమూకల చేతుల్లోనే ఉంటాయి అని ఆయన తన చర్యల ద్వారా నిరూపిస్తున్నారని సామాన్యులు భావిస్తున్నారు. తన పార్టీకి మద్దతిచ్చే కులానికి చెందిన నవీన్ రెడ్డి లాంటి సామాన్య కుటుంబాలను వదిలేసి, సమాజానికి క్యాన్సర్ లాంటి నేరగాళ్లకు రాజకీయ రక్షణ కల్పించడమే విపక్ష పంథాగా మారడం ఏపీ చరిత్రలోనే నేర రాజకీయం.
తేల్చుకోవాల్సింది జగన్ మద్దతుదారులే !
ప్రభుత్వంపై ప్రజాపోరాటాలు చేయడమంటే ప్రజల పక్షాన నిలబడటం.. అంతే కానీ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే క్రిమినల్స్ వెనుక నిలబడటం కాదనే కనీస లాజిక్ను వైసీపీ విస్మరించింది. జగన్ తీసుకుంటున్న ఈ వివాదాస్పద నిర్ణయాలు కూటమి ప్రభుత్వానికి బురదజల్లడం పక్కన పెడితే.. సగటు ఓటర్లలో వైసీపీ పట్ల తీవ్ర అసహ్యానికి, భయానికి కారణమవుతున్నాయి. నేరగాళ్లకు కొమ్ముకాసే ఇటువంటి ‘రాజకీయ సంస్కృతి’ రాష్ట్రానికి అవసరమా లేదా అనేది తేల్చుకోవాల్సిన బాధ్యతను జగన్ తన పర్యటనల ద్వారా ప్రజలకే వదిలేశారని, రాబోయే రోజుల్లో ప్రజలు దీనిపై మరింత నిర్మొహమాటంగా తమ తీర్పును ఇవ్వడం ఖాయం