మణికేశ్వరం ఆలయంలో డీపీఓ ప్రత్యేక పూజలు
ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారిణి యం. అనూపమ గారు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనూపమ గారిని, వారి భర్తను దుశ్శాలువాతో సత్కరించడం జరిగింది.
📅 23.08.2026
పోలవరం గురించి నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది @ysjagan ! ఎందుకంటే పోలవరం ప్రాజెక్టును బ్యారేజిగా మార్చింది నువ్వు. దాన్ని రిజర్వాయర్ గా మార్చింది కూటమి ప్రభుత్వం. నువ్వు అవన్నీ మర్చిపోయి బెంగుళూరు ప్యాలెస్ లో ఊహా ప్రపంచంలో బ్రతుకుతున్నట్టు ఉన్నావు. కానీ పోలవరం ప్రాజెక్టుకు నువ్వు చేసిన అన్యాయం గురించి గూగుల్ లో ఇలా కొడితే, అలా వచ్చేస్తుంది.
పోలవరం ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిస్తామంటూ ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పలుమార్లు ప్రతిపాదనలు పంపించింది మీ ప్రభుత్వంలోనే కదా, జగన్ మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? 2022 జనవరిలో పోలవరం ప్రాజెక్టు ఫేజ్-I&II అంటూ 41.15 మీటర్ల ఎత్తున ప్రతిపాదిస్తూ అప్పటి స్పెషల్ సి.ఎస్. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సి.ఇ.ఓ.కు లేఖ రాసి, డబ్బులు అడగలేదా? మీరు, గతంలో మీ సారథ్యంలో ఉన్న మీ అధికారులు 41.15 మీటర్ల కోసం రాసిన లేఖలు మర్చిపోయారా ? మీ అబద్ధపు సాక్షిలో, గతంలో మీరు చేసిన పనులు మీరే రాసుకుని, చంద్రబాబు గారి పై దుష్ప్రచారం చేస్తున్నారా?
పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో మా కూటమి ప్రభుత్వం మీ లాగా ఎక్కడా రాజీపడే ప్రసక్తే ఉండదు. గతంలో, 2014-19 మద్య చంద్రబాబు గారు ప్రతిపాదించినట్లుగా 150 అడుగుల మేర నీటి నిల్వ ఉండే విధంగా 45.72 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టును నిర్మించి తీరుతాం. పోలవరం ప్రాజెక్ట్ 45.72 మీటర్ల ఎత్తులోనే ఉంటుంది. 150 అడుగుల నీటి మట్టాన్ని నిర్వహించేది చంద్రబాబు గారి ప్రభుత్వమే. 45.72 మీటర్ల ఎత్తులో నీళ్ళు నిలబెడితేనే, చంద్రబాబు గారి కల అయిన నదుల అనుసంధానం జరిగి, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించడం కుదురుతుంది. కాబట్టి ఈ విషయంలో మా ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తేలేదు. ఇకనైనా మీరు ఫేక్ రాతలు, ఫేక్ ప్రచారాలు మాని, ప్రజలకు ఉపయోగపడే రాతలు రాసి, ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చే ప్రయత్నం చేయండి.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
కరోనా కాలంలో ఉపాధ్యాయులను కాపలాదారులుగా పెట్టి అవమానించింది వైసీపీ ప్రభుత్వం. ఉపాధ్యాయ నియామకాలు లేకుండా చేసింది కూడా అదే ప్రభుత్వం. ఇప్పుడు సక్రమంగా నిర్వహించిన 2025 డీఎస్సీపై అబద్ధాలు చెప్పడం విడ్డూరం!
చరిత్ర మరిచిపోయినాప్రజలు మర్చిపోలేదు
#2025DSC#DSC#Teachers#APPolitics
అద్దంకి మండలం మణికేశ్వరంలో 'తల్లికి వందనం' నిధుల విడుదల వేడుకలు!
CM శ్రీ @ncbn గారు, మంత్రి శ్రీ @gottipati గారు, మంత్రి శ్రీ @nalokesh గారి చిత్రపటాలకు పాలాభిషేకం, కేక్ కటింగ్. ఇచ్చిన హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి గ్రామ ప్రజల కృతజ్ఞతలు.
#ThallikiVandanam#Addanki#APTDP
తప్పు చేస్తే మనవాడైనా,
ఇతరులైనా చర్యలు తప్పవు
గుంటూరులో మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించిన టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేయించాం. పార్టీ నుండి సస్పెండ్ చేశాం.
#ChandrababuNaidu#AndhraPradesh
#RayalaseemaRising#RayalaseemaSteelPlant
రాయలసీమ రైజింగ్ ... స్వర్ణయుగం ప్రారంభమైంది.
రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న గుర్తుకు వచ్చేవారు. వీటితోపాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు, స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ కూడా గుర్తుకు వస్తున్నాయి.
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh
#RayalaseemaRising#RayalaseemaSteelPlant
రెండు దశాబ్దాల రాయలసీమ ప్రజల కల ఈరోజు నెరవేరింది. సీమ ఖనిజ సంపద... సీమ అభివృద్ధికే వినియోగించాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని సున్నపురాళ్లపల్లిలో 'జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్' పనులు ప్రారంభించి నిజం చేశాం. దీనికి అనుబంధంగా 'నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు'కు, అలాగే విజయనగరం జిల్లాలోని 'జేఎస్డబ్ల్యూ పారిశ్రామిక పార్కు'కు కూడా శంకుస్థాపన చేసుకున్నాం. గత ప్రభుత్వంలో కేవలం శంకుస్థాపనలతో సరిపెట్టి ప్రజలను మభ్యపెడితే... మేం పనులు మొదలుపెట్టి రాయలసీమ స్టీల్ ప్లాంటుకు వాస్తవరూపం ఇస్తున్నాం. 2028 నాటికి ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్ నిర్మాణం పనులు ఈరోజు నుంచి జరుగుతాయి. స్టీల్ ప్లాంట్ రాకతో కడపజిల్లా వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా, వేలాది మంది యువతకు ఉద్యోగాలు దక్కుతాయి. అటు విశాఖ స్టీల్ ప్లాంట్, ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్... ఇటు జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్తో ఆంధ్రప్రదేశ్ను ఉక్కు రాష్ట్రంగా మారుస్తున్నాం.
@TheJSWGroup
కరవు కథలు రాసిన నేల... ఇప్పుడు కలల్ని సాకారం చేస్తున్న నేల...
నీటి ప్రతి చుక్కలో ఆశ ఉంది...
రైతు ప్రతి చెమట చుక్కలో భరోసా ఉంది...
రోడ్డు ప్రతి కిలోమీటరులో అభివృద్ధి ఉంది...
పరిశ్రమ ప్రతి అడుగులో యువత భవిష్యత్తు ఉంది...
పెట్టుబడి ప్రతి రూపాయిలో ఉపాధి ఉంది...
రాయలసీమ ప్రతి విజయగాథలో విజనరీ నాయకత్వం ఉంది...
'రాయల' నాటి వైభవాన్ని... 'రాయల్' సీమగా మలుస్తూ,
స్వర్ణాంధ్ర నిర్మాణంలో రాయలసీమను అభివృద్ధికి కొత్త చిరునామాగా తీర్చిదిద్దుతోంది కూటమి ప్రభుత్వం.
#RayalaseemaRising
#ChandrababuNaidu
#NaraLokesh
#Rayalaseema
రౌడీయిజాన్ని నమ్ముకున్న గొడ్డలి పార్టీ అనేక భూ వివాదాలకు తెరలేపింది. తరతరాలుగా ఉన్న భూములను కూడా గొడ్డలి పార్టీ నేతలు గుంజుకోవాలని చూశారు. ప్రజల భూములకు సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకాలపై గొడ్డలి పార్టీ నేత ఫొటోలు ముద్రించారు. ఆ ఫొటోలను తొలగించి, రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను అందించాం.
#RayalaseemaRising
#CBNInKuppam
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh
రాయలసీమను రతనాల సీమగా మలుస్తున్న విజనరీ చంద్రబాబు
కరువు, ఫ్యాక్షన్ ముద్రను చెరిపి... పెట్టుబడులు, పరిశ్రమలు, నీరు, ఉద్యోగాలతో కొత్త చరిత్ర రాస్తున్న నాయకత్వం
ఒకప్పుడు "రాయలసీమ అంటే రాళ్లసీమ... కరువు సీమ... ఫ్యాక్షన్ సీమ" అనే ముద్ర ఉండేది. వర్షాభావం, సాగునీటి కొరత, వలసలు, నిరుద్యోగం, రాజకీయ హింస... ఇవే సీమకు గుర్తింపుగా మారాయి.
కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా మారుతోంది.
రాయలసీమ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాటలు స్టీల్ ప్లాంట్లు, స్పేస్ సిటీలు, డ్రోన్ సిటీలు, డిఫెన్స్ కారిడార్లు, గ్రీన్ ఎనర్జీ, భారీ పరిశ్రమలు, నీటి భద్రత, హార్టికల్చర్ హబ్, లక్షల ఉద్యోగాలు.
ఈ మార్పు వెనుక ఉన్న దార్శనికత ఒకటే... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఎన్టీఆర్ ప్రారంభించిన మార్పు... చంద్రబాబు పూర్తి చేస్తున్న విజన్
రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు బదులుగా అభివృద్ధి రాజకీయాలను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ.
ఎన్టీఆర్ ఆలోచనలకు కొనసాగింపుగా చంద్రబాబు గారు రాయలసీమ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల, స్వర్ణముఖి, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, అవుకు టన్నెల్, పట్టిసీమ వంటి అనేక నీటి ప్రాజెక్టులను నిర్మించారు.
కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి సీమకు తీసుకొచ్చి... "కరువు సీమ" అనే ముద్రను చెరిపేయడానికి పునాది వేశారు.
రెండేళ్లలో సాగునీటి విప్లవం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ సాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
రెండేళ్లలోనే సాగునీటి ప్రాజెక్టులకు ₹12,484 కోట్లు
2026-27 బడ్జెట్లో మరో ₹10,000 కోట్లు
హంద్రీ-నీవాకు ₹3,873 కోట్ల వ్యయం
ప్రభుత్వం వచ్చిన తొలి 100 రోజుల్లోనే హంద్రీ-నీవా ప్రధాన కాలువ విస్తరణ, కుప్పం, పుంగనూరు బ్రాంచ్ కాలువల లైనింగ్ పూర్తి
మల్యాల ఎత్తిపోతల ద్వారా రికార్డు స్థాయిలో 52 టీఎంసీల నీరు
రాయలసీమలో 530 జలాశయాలు నింపడం
మూలపల్లి, కళ్యాణి డ్యాంలకు నీరు అందించేందుకు ₹126 కోట్లు
మడకశిర బ్రాంచ్ కాలువ విస్తరణకు ₹790 కోట్లు
గోరుకల్లు, శ్రీశైలం, తుంగభద్ర తదితర ప్రాజెక్టుల మరమ్మతులకు ₹610 కోట్లు
దీంతో కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీటి భద్రత లభిస్తోంది.
'జలధార - జలహారతి'తో భూగర్భ జలాల పునర్జన్మ
నీటి నిర్వహణలో కూటమి ప్రభుత్వం చేపట్టిన జలధార - జలహారతి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది.
అన్నమయ్య జిల్లాలోనే
భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరిగాయి
ఎండిపోయిన 20 వేల బోర్లు తిరిగి జీవం పొందాయి
వ్యవసాయ విద్యుత్ వినియోగంలో ₹96 కోట్ల ఆదా
ప్రతి చెరువులో 25-50% నీటి నిల్వ
ఉద్యాన పంటలు మరో 20 వేల హెక్టార్లకు విస్తరణ
ఐదు లక్షల ఎకరాల్లో పశుగ్రాసం
రోజుకు అదనంగా లక్ష లీటర్ల పాల ఉత్పత్తి
ఇదే నమూనాను రాయలసీమలోని 20 వేల చెరువులకు విస్తరించారు.
వ్యవసాయంలో కొత్త దిశ
రాయలసీమను దేశంలోనే అతిపెద్ద హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.
"రాయలసీమ మిషన్"కు లక్ష కోట్ల రూపాయల ప్రణాళిక
90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్
63% పంటలు మైక్రో ఇరిగేషన్ కింద
దేశంలోనే నంబర్-1 మైక్రో ఇరిగేషన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
నీటి ఆదా... దిగుబడి పెరుగుదల... రైతు ఆదాయం పెంపు... ఇదే లక్ష్యం.
పరిశ్రమలతో సీమ ముఖచిత్రం మారుతోంది
ఒకప్పుడు ఉద్యోగాల కోసం యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సి వచ్చేది.
ఇప్పుడు పరిశ్రమలే రాయలసీమకు వస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం
₹4.63 లక్షల కోట్ల పెట్టుబడులు
239 పరిశ్రమలు
4.11 లక్షల ఉద్యోగాలు
లక్ష్యంగా ముందుకెళ్తోంది.
స్పేస్ సిటీ... డ్రోన్ సిటీ... డిఫెన్స్ సిటీ
దేశంలోనే మొదటిసారిగా
స్పేస్ సిటీ
డ్రోన్ సిటీ
డిఫెన్స్ తయారీ కేంద్రాలు
రాయలసీమలో ఏర్పడుతున్నాయి.
డ్రోన్ సిటీ
కర్నూలు, అనంతపురంలో 600 ఎకరాల్లో
Algobotics
Drogo
Latrics
Sensel Maze
JDK Fly
Sarla Aviation
Spacefields
వంటి సంస్థలు ఇప్పటికే అడుగుపెట్టాయి.
సత్యసాయి జిల్లా... ఏరోస్పేస్ హబ్
రూ.15,800 కోట్లతో
Aircraft Integration & Flight Testing Centre
ఇక్కడే ఏర్పాటు అవుతోంది.
ఇక్కడే
AMCA యుద్ధ విమానాల తయారీ
డిఫెన్స్ ఎకోసిస్టమ్
డ్రోన్ పరిశ్రమలు
అభివృద్ధి చెందనున్నాయి.
దీని చుట్టూ మరో ₹1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
అదే జిల్లాలో
భారత్ ఎలక్ట్రానిక్స్
HFCL
KSSL
JK Mini Aerospace
Astrobase Space
వంటి అనేక సంస్థలు వస్తున్నాయి.
స్పేస్ సిటీగా తిరుపతి
తిరుపతిలో
Ethereal Exploration
Skyroot Aerospace
వంటి సంస్థలు రాకెట్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి.
సోలార్ శక్తికి కేంద్రంగా రాయలసీమ
మూడేళ్లలో 50 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
అందులో భాగంగా
Premier Energies
Websol
Voltsun Labs
Agastya Energy
Gridon
SAEL
వంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.
స్టీల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీ పెట్టుబడులు
రాయలసీమలో ఇప్పటికే లేదా నిర్మాణంలో ఉన్న ముఖ్య ప్రాజెక్టులు:
JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్ – ₹16,350 కోట్లు
JSW సోలార్ క్యాప్టివ్ పవర్ – ₹20,350 కోట్లు
Hero MotoCorp Global Parts Centre
Royal Enfield
Apollo Tyres విస్తరణ
Carrier Global
LG Electronics
Greenko
IndiChip Semiconductors
Chinta Green Energy
Adani Green Energy
వంటి ప్రాజెక్టులు వేలాది ఉద్యోగాలను తీసుకువస్తున్నాయి.
రోడ్లు... విమానాశ్రయాలు... కనెక్టివిటీ
రాయలసీమ అభివృద్ధికి మౌలిక వసతులే బలమని భావించిన ప్రభుత్వం
₹39,058 కోట్లతో 48 జాతీయ రహదారులు
1,441 కి.మీ. రహదారి నిర్మాణం
రెండేళ్లలోనే 504 కి.మీ. పూర్తి
అమరావతి–అనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే పునఃప్రారంభం
కడప, కర్నూలు విమానాశ్రయాల అభివృద్ధి
కుప్పం విమానాశ్రయానికి సన్నాహాలు
కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వేగం
వంటి చర్యలు చేపట్టింది.
సంక్షేమం కూడా సమాన ప్రాధాన్యం
అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా కొనసాగుతోంది.
తల్లికి వందనం
16.46 లక్షల మంది విద్యార్థుల కోసం
₹2,867.54 కోట్లు
అన్నదాత సుఖీభవ
17.35 లక్షల మంది రైతులకు
₹3,241 కోట్లు
ఆటో డ్రైవర్ల సేవలో
74 వేల మంది డ్రైవర్లకు
₹111.3 కోట్లు
మత్స్యకారుల సేవలో
3,157 కుటుంబాలకు
₹12.01 కోట్లు
రాయలసీమ ఇక వలసల ప్రాంతం కాదు... అవకాశాల ప్రాంతం
ఒకప్పుడు
నీటి కోసం పోరాటం
ఉద్యోగాల కోసం వలసలు
పరిశ్రమల లేమి
కరువు
ఫ్యాక్షన్
అనే మాటలు వినిపించేవి.
ఈరోజు
స్పేస్ సిటీ
డ్రోన్ సిటీ
స్టీల్ ప్లాంట్
సెమీకండక్టర్
గ్రీన్ ఎనర్జీ
ఏరోస్పేస్
డిఫెన్స్
హార్టికల్చర్ హబ్
భారీ జాతీయ రహదారులు
నీటి భద్రత
లక్షల ఉద్యోగాలు
అనే పదాలు వినిపిస్తున్నాయి.
రాయలసీమ అభివృద్ధి ఒక్క ప్రాజెక్టుతో సాధ్యమయ్యేది కాదు. నీరు, వ్యవసాయం, మౌలిక వసతులు, పరిశ్రమలు, సాంకేతికత, విద్య, సంక్షేమం - ఈ అన్ని రంగాలను ఒకేసారి ముందుకు తీసుకెళ్లే సమగ్ర దృష్టి అవసరం. ఆ దిశగా కూటమి ప్రభుత్వం రాయలసీమను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోందని ఈ ప్రాజెక్టులు, పెట్టుబడులు, మౌలిక వసతుల కార్యక్రమాలు సూచిస్తున్నాయి.
"రాళ్లసీమ"గా ముద్రపడిన ప్రాంతాన్ని "రతనాల సీమ"గా, కరువు గుర్తింపును అవకాశాల గుర్తింపుగా మార్చాలనే విజన్తో సాగుతున్న ఈ ప్రయాణం, రాయలసీమ భవిష్యత్తును కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నంగా నిలుస్తోంది.
@ncbn@naralokesh
#RayalaseemaRising
#ChandrababuNaidu
#NaraLokesh
#Rayalaseema
కుప్పంలో 3 రోజుల నా పర్యటన ఎంతో ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగింది. ప్రశాంతమైన, స్వచ్ఛమైన కుప్పంలో పర్యటన కొత్త శక్తినిచ్చింది. దశాబ్దాల తరబడి పెండింగులో ఉన్న కంగుంది భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాం. వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే రూ.9322 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. వ్యవసాయం, ఫౌల్ట్రీ, తయారీ రంగంలో అవకాశాలకు నాంది పలికాం. స్వర్ణ కుప్పం సాకారం చేయడానికి... సరికొత్త కుప్పాన్ని ఆవిష్కరించడానికి సమగ్రమైన విజన్ సిద్ధం చేస్తున్నాం. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న కుప్పం... రానున్న రోజుల్లో దేశానికే మోడల్ నియోజకవర్గంగా నిలుస్తుంది.
#2YrsOfTrustDevelopmentWelfare
ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే... అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం–అభివృద్ధి–సుపరిపాలన అందిస్తున్నాం. అధికారాన్ని బాధ్యతగా, పాలకులు అంటే సేవకులుగా భావిస్తూ పనిచేస్తున్నాం. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పని చేస్తున్నాం. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ... రాష్ట్ర భవిష్యత్కు బాటలు వేస్తున్నాం. రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్దిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, అటు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు ప్రజల మద్దతు, సహకారం కోరుతూ...జై ఆంధ్రప్రదేశ్!
@narendramodi@PawanKalyan