The next era of Indian politics must belong to women leadership.
At #Mahanadu2026, I proposed 33% reservation for women in TDP for the 2029 elections.
Women must not remain mere beneficiaries in politics. They must become decision-makers and leaders shaping India’s future.
TDP will lead from the front. This is not a slogan - it is our commitment.
#SthreeShakti
#NaaTDPNaaBadhyata
ఒకే మతం అయినా ఒకే ఊర్లో ఒక కుల దేవతను మరొకరు మొక్కరు. అన్ని భావ వైరుధ్యాల విభిన్న సంస్కృతులు మన దేశంలో ఉంటాయి.
వేరే కులం, వేరే ప్రాంతం, వేరే మతాల పండగలను సాధారణంగా గౌరవించరు లేదా పట్టించుకోరు.
కానీ కుల, మత, ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా లక్షలాది మందితో ఒక పండగ జరుగుతుంది.
నాలుగు దశాబ్దాలుగా జరుగుతోంది.
సమాజమంతా శుభానికి సూచికైన పసుపుమయం అయిపోతుంది.
తెలుగు నేలపై పసుపు జెండా కేవలం ఒక రాజకీయ గుర్తు కాదు; అది కోట్ల మంది గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవ నినాదం. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, అన్న నందమూరి తారక రామారావు గారు నాటిన ఆశయాల మొక్క, నేడు మహావృక్షమై నిలిచింది. ఆ వృక్షానికి ప్రతి ఏటా మే నెలలో జరిగే వసంతోత్సవమే ‘మహానాడు’.
ఇది కేవలం ఒక పార్టీ ప్రతినిధుల సభ కాదు; కష్టాల కడలిని ఈది, అణచివేతలను ఎదుర్కొని, త్యాగాల పునాదులపై నిలబడిన లక్షలాది మంది కార్యకర్తల భావోద్వేగాల మేళవింపు.
నాడు, తెలుగు జాతికి ఒక ప్రత్యేక గుర్తింపును, ఢిల్లీ పీఠాల ముందు మోకరిల్లని ఆత్మగౌరవాన్ని ప్రసాదించడానికి అన్న ఎన్టీఆర్ చైతన్య రథమెక్కిన రోజులు గుర్తొస్తే నేటికీ నరనరాల్లో రక్తం ఉరకలేస్తుంది. ‘సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు’ అంటూ ఆయన ప్రవచించిన సిద్ధాంతం ఈనాటికీ మహానాడు వేదికలపై ప్రతిధ్వనిస్తూనే ఉంది.
అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజా పక్షాన నిలబడి పోరాడే తత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఈ పండుగ ప్రతి కార్యకర్తకూ నూరిపోస్తుంది. నాయకుడు దిశానిర్దేశం చేస్తే, ఆ దిశను తమ శ్వాసగా మార్చుకునే సైనికులు కదిలే ప్రస్థానం ఇది.
"ప్రాణం పోయినా, పీక కోసినా ‘జై తెలుగుదేశం’ అని పలికే నిబద్ధత.. కష్టకాలంలోనూ జెండాను గుండెలకు హత్తుకుని నిలిచే కార్యకర్తల త్యాగనిరతే ఈ పసుపు సైన్యానికి అసలైన బలం."
మహానాడు విశిష్టత ఎక్కడుందంటే, అది సామాన్య కార్యకర్తను అగ్రపీఠంపై కూర్చోబెడుతుంది. ఎండనక, వాననక, కక్ష సాధింపు చర్యలకు భయపడక, పార్టీ కోసం సర్వస్వాన్ని ధారపోసిన ప్రతి ఒక్కరి శ్రమకు లభించే గౌరవ వందనం ఇది.
నారా చంద్రబాబు నాయుడి సుదీర్ఘ విజన్, నారా లోకేష్ యువ చైతన్యం ఈ పండుగలో మేళవించి, సరికొత్త భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఇటీవల ‘స్త్రీ శక్తి’ వంటి వినూత్న థీమ్లతో సమాజంలో సగభాగమైన మహిళలకు, వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ, ‘మహానాడు’ కేవలం రాజకీయ తీర్మానాలకే పరిమితం కాకుండా సామాజిక విప్లవాలకు వేదికగా మారుతోంది.
చరిత్ర ఎప్పుడూ సులువుగా రాయబడదు; ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర త్యాగాలతో, పోరాటాలతో లిఖించబడింది. చీకట్లు ముసిరినప్పుడు వెలుగురేఖలా, కష్టాలు ఎదురైనప్పుడు కొండంత అండలా నిలబడే వ్యవస్థ ఇది.
ఈ పసుపు తోరణాలు, రాత్రి వేళల్లో సైతం కార్యాలయాల్లో వెలిగే కాంతులు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. నవ సమాజ నిర్మాణానికి, తెలుగుజాతి అఖండ ప్రగతికి సరికొత్త శంఖారావం. మహానాడు స్ఫూర్తి ప్రతి ఒక్కరి గుండెల్లో నిరంతరం ప్రవహించే ఒక చైతన్య స్రవంతి!
తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే సిద్ధాంతం.. జోహార్ ఎన్టీఆర్! జై తెలుగుదేశం!
#Mahanadu2026
#SthreeShakti
#TeluguDesamParty
#AndhraPradesh
‘సంజీవని’ సిటిజన్ వెల్ నెస్ మిషన్ నా మనసుకు ఎంతో దగ్గరగా ఉండే ప్రాజెక్టు. సంపద కంటే ఆరోగ్యం ఉన్న వాళ్లే అదృష్టవంతులు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలున్నారు. సమాజం బాగుండాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ అనే విధానంలో సంజీవని ప్రారంభించాం. కుప్పంలో పైలట్ గా ప్రారంభమైన సంజీవని ప్రాజెక్టు చిత్తూరు జిల్లాలో విజయవంతంగా నడుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళిక చేశాం. వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రజారోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడమే సంజీవని ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. 42 వైద్య పరీక్షలను ఇంటి వద్దే నిర్వహించి రిపోర్టులు ఇవ్వటంతో పాటు వ్యక్తిగత ఆరోగ్య పర్యవేక్షణ కోసం డాక్టర్ అప్పాయింట్ మెంట్, వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్య సలహాలు, సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డుల పర్యవేక్షణ చేస్తున్నాం. సంజీవని అనేది ఓ సాఫ్ట్ వేర్ మాత్రమే కాదు అత్యుత్తమ డిజిటల్ పబ్లిక్ హెల్త్ ఆపరేటివ్ సిస్టమ్. ఈ వినూత్న విధానం విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లే. నేను ఇవన్నీ చేస్తున్నది మీ కోసమే.
#Sanjeevani
గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ...
వైసీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే. వైసీపీ హయాంలో జరిగిన 11 ఘటనలే అందుకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకు చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం.
#GoddaliParty#PsychoFekuJagan#ChandrababuNaidu#AndhraPradesh
ఇలాంటి క్రూరత్వం సినిమాల్లో చూస్తాం.. వైఎస్ కుటుంబం 40 ఏళ్ల క్రితమే చూపించింది..
పులివెందులలో వైఎస్ రాజారెడ్డి రౌడీ, హత్యా రాజకీయాలకు ఈ ఫోటోలే సాక్ష్యం. తనకు, తన కొడుక్కి రాజకీయంగా ఇబ్బంది వస్తుందనే కారణంతో, లింగాల మండలం పార్నపల్లిలో టీడీపీకి చెందిన జొన్నలగడ్డ సోదరులు సత్యనారాయణ, సూర్యనారాయణ ఇళ్లను డైనమైట్లతో రాజారెడ్డి పేల్చేశారని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనం..
నాటి వైఎస్ కుటుంబం అరాచక విధ్వంసకాండకు, బాంబుల సంస్కృతికి ఇవిగో సాక్ష్యాలంటూ ఫోటోలను విడుదల చేసిన మంత్రి పయ్యావుల.
#PsychoFekuJagan
#AndhraPradesh
1989లో.. రాజారెడ్డి ఎంత దుర్మార్గం చేశాడంటే..
రాజకీయాల్లో హింసకు కొత్త పుంతలు తొక్కించిన ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ. 1989 కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ ప్రత్యర్థిని రాజారెడ్డి వేటాడిన తీరు ఇప్పటి తరానికి తెలియదు. 2 వేల మంది గుండాలతో, తన ప్రత్యర్థి ఇంటిని ఆ రోజుల్లోనే కంప్రెసర్ తీసుకొచ్చి, పునాదులను డ్రిల్ చేసి, డైనమైట్లు పెట్టి ఇంటిని కూల్చేసి భయానక వాతావరణం సృష్టించారు.
#PsychoFekuJagan
#PayyavulaKeshav
#AndhraPradesh
Andhra Pradesh is where the Speed of Doing Business meets the Speed of Execution. Today, we dedicated SAEL’s 600 MW solar project in Rayalaseema to the people.
Built with an investment of ₹3,000 crore in a record 11 months, this landmark project reflects our unwavering commitment to a sustainable future and reinforces Andhra Pradesh’s position at the forefront of India’s clean energy transition.
My compliments to @SAEL_India team for completing the project in record time and for creating meaningful benefits for our people through jobs, development, and new opportunities.
#SAELComesToAP
#RayalaseemaTakesOff
#ChooseSpeedChooseAP
ఒరేయ్ వైసీపీ పేటీఎం “ @JaganannaCNCTS ”గా… నీకు అసలు బుర్ర లేదనేది ఈ ట్వీట్తో మరోసారి తేలిపోయింది రా. గతంలో @ysjagan రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసి @ncbn గారిపై ఎన్నో కేసులు పెట్టించారు. తెలుసుకో… వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాదాపు 100 ఎంక్వైరీలు వేయించాడు. వందల కేసులు పెట్టించాడు. కానీ కోర్టులో ఒక్క రూపాయి అవినీతి చేశారని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నిరూపించలేకపోయాడు. అదీ చరిత్ర.
ఆఖరికి మీ నాయకుడి తల్లి వైఎస్ విజయమ్మ గారు వేసిన కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అక్కడ కోర్టు మొట్టికాయలు వేయడంతో ఆమె స్వయంగా కేసు విత్డ్రా చేసుకుంది. అదీ తెలుసుకో. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి తన బినామీలతో ఎన్నో కేసులు వేయించాడు. ఒక్కటి కూడా నిలబడలేదు. అన్నీ వీగిపోయాయి.
మళ్లీ నువ్వు ఇంకో కేసు గురించి మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారిపై కక్షసాధింపుతో అక్రమ కేసు పెట్టి 52 రోజులు జైల్లో పెట్టగలిగారు గానీ, ఆయన తప్పు చేశాడని నిరూపించలేకపోయారు. ఆ కేసు న్యాయస్థానాల్లో నిలబడలేదు. చివరకు ఆయన నిర్దోషి అని తేలిపోయింది.
ఇప్పుడు మీ నాయకుడి సంగతి మాట్లాడుదాం. చిప్పకూడు తిని చంచల్గూడ జైలులో 16 నెలలు ఉన్న చరిత్ర మీ నాయకుడిది. సిగ్గు లేకుండా కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటూ, డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ తిరిగే బ్రతుకు మీ నాయకుడిది. కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకోవడానికి ఎన్ని ఎత్తులు వేస్తాడో దేశం మొత్తం చూస్తోంది. కోర్టు పర్మిషన్ లేకుండా పక్క దేశానికి కూడా వెళ్లలేని వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి.
ఈరోజు కూడా ఆయనపై ఉన్న కేసులు ట్రయల్లోనే ఉన్నాయి. 16కి పైగా సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. ఎందుకంటే ఇంత అవినీతి చరిత్ర ఉన్న నాయకుడు భారతదేశ రాజకీయాల్లో లేడు.
ఈరోజు మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, బాబాయి వివేకానంద రెడ్డి హత్య వంటి ఘటనలపై సెంటిమెంట్ రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చారు. కానీ కోర్టుల్లో మాత్రం మీ నాయకుడు నిర్దోషి అని నిరూపించుకోలేకపోయాడు.
నీకు నిజంగా దమ్ముంటే, “జగనన్న సైనికుడు” అని చెప్పుకుంటే… మీ నాయకుడిని ఒప్పించి కోర్టులో పిటిషన్ వేయించు — “నా మీద ఉన్న అన్ని కేసులను రోజువారీ విచారణ చేసి త్వరగా తీర్పు ఇవ్వండి” అని చెప్పమని అడుగు. అది చేయలేడు. ఎందుకంటే నిజం బయటపడుతుందనే భయం.
ఈరోజుకీ కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లలేని వ్యక్తి మీ నాయకుడు. ఐదేళ్లు అధికారంలో ఉండి కోర్టులకు హాజరు కాకుండా తప్పించుకున్న దొంగ రాజకీయాలు దేశం మొత్తం చూసింది.
ఇంకో విషయం… మీ నాయకుడి తాత రాజారెడ్డి మీద రౌడీషీట్ ఉందని, పోలీసులు కొట్టారని కూడా చాలామంది అప్పట్లో చెప్పుకున్నారు. రాజశేఖర్ రెడ్డిని కూడా పోలీసులు తరిమారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని ఎలా కొట్టారో మనమంతా ఇటీవలే చూశాం.
మీ కుటుంబ నేర చరిత్ర, అవినీతి చరిత్ర మొత్తం బయటకు వస్తే ప్రజలు తూ అని ఉమ్మేస్తారు. అందుకే ఇంకోసారి ఇలాంటి ట్వీట్లు వేయొద్దు.
ఓపెన్ చాలెంజ్… నిజంగా దమ్ముంటే మీ నాయకుడితో కోర్టులో పిటిషన్ వేయించి, “నా మీద ఉన్న అన్ని కేసులను ఫాస్ట్ట్రాక్లో విచారించండి” అని చెప్పించు.
ఈరోజు కోర్టు పర్మిషన్ లేకుండా దేశం దాటలేని వ్యక్తి మీ నాయకుడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి నిజాయితీపై మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. చంద్రబాబు నాయుడు గారి మీద వందల కేసులు పెట్టినా ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు అంటే ఆయన ఎంత నిజాయితీ గల నాయకుడో అర్థం చేసుకో.
ఇంకా ఒక విషయం — మీ నాయకుడి చెల్లెలే (@realyssharmila) చెప్పింది, “మా అన్నకు బెయిల్ రావడం కాంగ్రెస్ (@INCIndia) పార్టీ, సోనియా గాంధీ వేసిన భిక్ష” అని. కాళ్లు పట్టుకుని, దయదాక్షిణ్యాలతో బెయిల్ తెచ్చుకున్న చరిత్ర మీది.
గుర్తుపెట్టుకో… రానున్న రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఇంకా చిత్తుచిత్తుగా ఓడిస్తారు. మీ నాయకుడు చేసిన తప్పులకు శిక్షలు పడటం ఖాయం. గుర్తుపెట్టుకో రా వైసీపీ పేటీఎం.
రేపు భవిష్యత్తులో చంచల్గూడాలోనా, తిహార్ జైలులోనా, రాజమండ్రి జైలులోనా — ఏ బ్లాక్లో ఉంటాడో ప్రజలే నిర్ణయిస్తారు. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. రేపు ఒక్క సీటు కూడా రాని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజలకు మీ నేర చరిత్ర, అవినీతి చరిత్ర మొత్తం అర్థమైంది.
మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను @ysjagan గారు! మీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మేం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి జగన్ గారూ! మీరు టెన్త్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరం. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో, నిద్రాహారాలు మాని, చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లు అందరికీ జగన్ గారు లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలి. మెగా డీఎస్సీ ఆపాలని 200 కేసులు, గూగుల్, టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా వారి భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తున్న జగన్ గారూ మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరు.
తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn గారి ఆశయాలకు మరింత చేరువవుతాం.
మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.
మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం!
#NaaTDPNaaBadhyata
#నాతెలుగుదేశంనాబాధ్యత
మా నాన్న ఉత్తరం రాశాడు.. మా తాత కలలు కన్నాడు.. నేను రాత్రి ఆత్మలతో మాట్లాడి కంపెనీలు తెచ్చానని సొల్లు కబుర్లు చెప్పే ఎమ్మెల్యే ఉన్నాడు.
ఆ వ్యక్తికి ఒక్కటే చెప్తున్నా.. జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే, గొడ్డలి మీ బ్రాండ్..
#SAELComesToAP#RayalaseemaTakesOff#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh
A memorable evening that our family will always cherish.
It was an honour and a pleasure to host Hon’ble Prime Minister Shri Narendra Modi Ji at our residence today. His warmth, affection, and generous interaction made this occasion truly special for all of us.
I thank the Hon’ble Prime Minister for this gracious gesture and for his constant encouragement and support towards the development journey of Andhra Pradesh.
@narendramodi
It was a great privilege to welcome Hon’ble Prime Minister Shri Narendra Modi ji to our home in Hyderabad today. Deeply grateful for the warmth, affection and blessings he bestowed upon our family. It was especially memorable to have three generations of our family together with him under one roof. Devaansh was truly blessed to receive his encouragement and blessings as well.
As always, I leave inspired by his unwavering commitment to the nation and deeply motivated to work even harder in service of society and the people. Moments like these remain cherished for a lifetime.
@narendramodi