మన గర్వం,మన ధైర్యం, ఆధునిక భారతదేశ రూపశిల్పి,
భారతదేశానికి టార్చ్ బేరర్... యావత్ భారత దేశ యువతకు ఆదర్శనీయుడు,
దేశ ప్రధాని, శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు... @narendramodi ji💐💐💐
#HappyBirthdayModiji
సంక్షేమ శాఖలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా బలహీనవర్గాల విద్యార్థుల డైట్ కోసం 10 శాతం అదనంగా కేటాయించాలని సీఎం చంద్రబాబు గారు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించినా, ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే పెరిగిన డైట్ ఛార్జీలను ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
#YSRCPRowdyism
.@ysjagan పార్టీని జనం గొడ్డలి పార్టీ అంటున్నది ఇందుకే. తన ఇంట్లో భారీగా మారణాయుధాలు, రాళ్లు, ఇనుప రాడ్లు, బీరు సీసాలు సిద్ధం చేసి అనంతపురంలో భారీ హింసకు ప్లాన్ చేసాడు గొడ్డలి పార్టీ నేత తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి. పోలీసులు ఆ ప్లాన్ ను భగ్నం చేసారు కాబట్టి సరిపోయింది కానీ... లేకపోతే ఎన్ని ప్రాణాలు పోయేవో. ఎంత రక్తపాతం జరిగేదో!
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
#YcpCriminalPolitics#PsychoFekuJagan
ఒంగోలు గొడ్డలి పార్టీ కార్యాలయంలో వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న పై సొంత పార్టీ నేత శ్రీను దారుణంగా చేయి చేసుకున్నాడు. ఎస్సీ, ఎస్టీలను వైసీపీలో ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే. కానీ ఇంకా దారుణం ఏంటంటే దీని మీద జగన్ స్పందించకపోవడం. పైగా ఆ మహిళ తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకోవాలని చూస్తే అధిష్టానం ఫోన్లు కూడా ఎత్తలేదంట.
#AndhraPradesh
గొడ్డలి పార్టీ అధికారంలోకి రాగానే ధ్వంసమైన దేవతా విగ్రహాలు, తగలబడిన రథాలు, గుడులలో జరిగిన చోరీలు, వీటన్నిటిమీద ఆ పార్టీ నేతలు మాట్లాడిన మాటలు... ఇవన్నీ చెబుతున్నాయి ఈ రావణుడు వారు నాటిన విత్తనం నుంచే మొలకెత్తాడు అని.
#AntiNationalJagan#AntiHinduJagan#PsychoFekuJagan
#AndhraPradesh
కుప్పంలో 3 రోజుల నా పర్యటన ఎంతో ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగింది. ప్రశాంతమైన, స్వచ్ఛమైన కుప్పంలో పర్యటన కొత్త శక్తినిచ్చింది. దశాబ్దాల తరబడి పెండింగులో ఉన్న కంగుంది భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాం. వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే రూ.9322 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. వ్యవసాయం, ఫౌల్ట్రీ, తయారీ రంగంలో అవకాశాలకు నాంది పలికాం. స్వర్ణ కుప్పం సాకారం చేయడానికి... సరికొత్త కుప్పాన్ని ఆవిష్కరించడానికి సమగ్రమైన విజన్ సిద్ధం చేస్తున్నాం. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న కుప్పం... రానున్న రోజుల్లో దేశానికే మోడల్ నియోజకవర్గంగా నిలుస్తుంది.
రాయలసీమను రతనాల సీమగా మలుస్తున్న విజనరీ చంద్రబాబు
కరువు, ఫ్యాక్షన్ ముద్రను చెరిపి... పెట్టుబడులు, పరిశ్రమలు, నీరు, ఉద్యోగాలతో కొత్త చరిత్ర రాస్తున్న నాయకత్వం
ఒకప్పుడు "రాయలసీమ అంటే రాళ్లసీమ... కరువు సీమ... ఫ్యాక్షన్ సీమ" అనే ముద్ర ఉండేది. వర్షాభావం, సాగునీటి కొరత, వలసలు, నిరుద్యోగం, రాజకీయ హింస... ఇవే సీమకు గుర్తింపుగా మారాయి.
కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా మారుతోంది.
రాయలసీమ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాటలు స్టీల్ ప్లాంట్లు, స్పేస్ సిటీలు, డ్రోన్ సిటీలు, డిఫెన్స్ కారిడార్లు, గ్రీన్ ఎనర్జీ, భారీ పరిశ్రమలు, నీటి భద్రత, హార్టికల్చర్ హబ్, లక్షల ఉద్యోగాలు.
ఈ మార్పు వెనుక ఉన్న దార్శనికత ఒకటే... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఎన్టీఆర్ ప్రారంభించిన మార్పు... చంద్రబాబు పూర్తి చేస్తున్న విజన్
రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు బదులుగా అభివృద్ధి రాజకీయాలను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ.
ఎన్టీఆర్ ఆలోచనలకు కొనసాగింపుగా చంద్రబాబు గారు రాయలసీమ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల, స్వర్ణముఖి, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, అవుకు టన్నెల్, పట్టిసీమ వంటి అనేక నీటి ప్రాజెక్టులను నిర్మించారు.
కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి సీమకు తీసుకొచ్చి... "కరువు సీమ" అనే ముద్రను చెరిపేయడానికి పునాది వేశారు.
రెండేళ్లలో సాగునీటి విప్లవం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ సాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
రెండేళ్లలోనే సాగునీటి ప్రాజెక్టులకు ₹12,484 కోట్లు
2026-27 బడ్జెట్లో మరో ₹10,000 కోట్లు
హంద్రీ-నీవాకు ₹3,873 కోట్ల వ్యయం
ప్రభుత్వం వచ్చిన తొలి 100 రోజుల్లోనే హంద్రీ-నీవా ప్రధాన కాలువ విస్తరణ, కుప్పం, పుంగనూరు బ్రాంచ్ కాలువల లైనింగ్ పూర్తి
మల్యాల ఎత్తిపోతల ద్వారా రికార్డు స్థాయిలో 52 టీఎంసీల నీరు
రాయలసీమలో 530 జలాశయాలు నింపడం
మూలపల్లి, కళ్యాణి డ్యాంలకు నీరు అందించేందుకు ₹126 కోట్లు
మడకశిర బ్రాంచ్ కాలువ విస్తరణకు ₹790 కోట్లు
గోరుకల్లు, శ్రీశైలం, తుంగభద్ర తదితర ప్రాజెక్టుల మరమ్మతులకు ₹610 కోట్లు
దీంతో కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీటి భద్రత లభిస్తోంది.
'జలధార - జలహారతి'తో భూగర్భ జలాల పునర్జన్మ
నీటి నిర్వహణలో కూటమి ప్రభుత్వం చేపట్టిన జలధార - జలహారతి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది.
అన్నమయ్య జిల్లాలోనే
భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరిగాయి
ఎండిపోయిన 20 వేల బోర్లు తిరిగి జీవం పొందాయి
వ్యవసాయ విద్యుత్ వినియోగంలో ₹96 కోట్ల ఆదా
ప్రతి చెరువులో 25-50% నీటి నిల్వ
ఉద్యాన పంటలు మరో 20 వేల హెక్టార్లకు విస్తరణ
ఐదు లక్షల ఎకరాల్లో పశుగ్రాసం
రోజుకు అదనంగా లక్ష లీటర్ల పాల ఉత్పత్తి
ఇదే నమూనాను రాయలసీమలోని 20 వేల చెరువులకు విస్తరించారు.
వ్యవసాయంలో కొత్త దిశ
రాయలసీమను దేశంలోనే అతిపెద్ద హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.
"రాయలసీమ మిషన్"కు లక్ష కోట్ల రూపాయల ప్రణాళిక
90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్
63% పంటలు మైక్రో ఇరిగేషన్ కింద
దేశంలోనే నంబర్-1 మైక్రో ఇరిగేషన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
నీటి ఆదా... దిగుబడి పెరుగుదల... రైతు ఆదాయం పెంపు... ఇదే లక్ష్యం.
పరిశ్రమలతో సీమ ముఖచిత్రం మారుతోంది
ఒకప్పుడు ఉద్యోగాల కోసం యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సి వచ్చేది.
ఇప్పుడు పరిశ్రమలే రాయలసీమకు వస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం
₹4.63 లక్షల కోట్ల పెట్టుబడులు
239 పరిశ్రమలు
4.11 లక్షల ఉద్యోగాలు
లక్ష్యంగా ముందుకెళ్తోంది.
స్పేస్ సిటీ... డ్రోన్ సిటీ... డిఫెన్స్ సిటీ
దేశంలోనే మొదటిసారిగా
స్పేస్ సిటీ
డ్రోన్ సిటీ
డిఫెన్స్ తయారీ కేంద్రాలు
రాయలసీమలో ఏర్పడుతున్నాయి.
డ్రోన్ సిటీ
కర్నూలు, అనంతపురంలో 600 ఎకరాల్లో
Algobotics
Drogo
Latrics
Sensel Maze
JDK Fly
Sarla Aviation
Spacefields
వంటి సంస్థలు ఇప్పటికే అడుగుపెట్టాయి.
సత్యసాయి జిల్లా... ఏరోస్పేస్ హబ్
రూ.15,800 కోట్లతో
Aircraft Integration & Flight Testing Centre
ఇక్కడే ఏర్పాటు అవుతోంది.
ఇక్కడే
AMCA యుద్ధ విమానాల తయారీ
డిఫెన్స్ ఎకోసిస్టమ్
డ్రోన్ పరిశ్రమలు
అభివృద్ధి చెందనున్నాయి.
దీని చుట్టూ మరో ₹1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
అదే జిల్లాలో
భారత్ ఎలక్ట్రానిక్స్
HFCL
KSSL
JK Mini Aerospace
Astrobase Space
వంటి అనేక సంస్థలు వస్తున్నాయి.
స్పేస్ సిటీగా తిరుపతి
తిరుపతిలో
Ethereal Exploration
Skyroot Aerospace
వంటి సంస్థలు రాకెట్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి.
సోలార్ శక్తికి కేంద్రంగా రాయలసీమ
మూడేళ్లలో 50 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
అందులో భాగంగా
Premier Energies
Websol
Voltsun Labs
Agastya Energy
Gridon
SAEL
వంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.
స్టీల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీ పెట్టుబడులు
రాయలసీమలో ఇప్పటికే లేదా నిర్మాణంలో ఉన్న ముఖ్య ప్రాజెక్టులు:
JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్ – ₹16,350 కోట్లు
JSW సోలార్ క్యాప్టివ్ పవర్ – ₹20,350 కోట్లు
Hero MotoCorp Global Parts Centre
Royal Enfield
Apollo Tyres విస్తరణ
Carrier Global
LG Electronics
Greenko
IndiChip Semiconductors
Chinta Green Energy
Adani Green Energy
వంటి ప్రాజెక్టులు వేలాది ఉద్యోగాలను తీసుకువస్తున్నాయి.
రోడ్లు... విమానాశ్రయాలు... కనెక్టివిటీ
రాయలసీమ అభివృద్ధికి మౌలిక వసతులే బలమని భావించిన ప్రభుత్వం
₹39,058 కోట్లతో 48 జాతీయ రహదారులు
1,441 కి.మీ. రహదారి నిర్మాణం
రెండేళ్లలోనే 504 కి.మీ. పూర్తి
అమరావతి–అనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే పునఃప్రారంభం
కడప, కర్నూలు విమానాశ్రయాల అభివృద్ధి
కుప్పం విమానాశ్రయానికి సన్నాహాలు
కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వేగం
వంటి చర్యలు చేపట్టింది.
సంక్షేమం కూడా సమాన ప్రాధాన్యం
అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా కొనసాగుతోంది.
తల్లికి వందనం
16.46 లక్షల మంది విద్యార్థుల కోసం
₹2,867.54 కోట్లు
అన్నదాత సుఖీభవ
17.35 లక్షల మంది రైతులకు
₹3,241 కోట్లు
ఆటో డ్రైవర్ల సేవలో
74 వేల మంది డ్రైవర్లకు
₹111.3 కోట్లు
మత్స్యకారుల సేవలో
3,157 కుటుంబాలకు
₹12.01 కోట్లు
రాయలసీమ ఇక వలసల ప్రాంతం కాదు... అవకాశాల ప్రాంతం
ఒకప్పుడు
నీటి కోసం పోరాటం
ఉద్యోగాల కోసం వలసలు
పరిశ్రమల లేమి
కరువు
ఫ్యాక్షన్
అనే మాటలు వినిపించేవి.
ఈరోజు
స్పేస్ సిటీ
డ్రోన్ సిటీ
స్టీల్ ప్లాంట్
సెమీకండక్టర్
గ్రీన్ ఎనర్జీ
ఏరోస్పేస్
డిఫెన్స్
హార్టికల్చర్ హబ్
భారీ జాతీయ రహదారులు
నీటి భద్రత
లక్షల ఉద్యోగాలు
అనే పదాలు వినిపిస్తున్నాయి.
రాయలసీమ అభివృద్ధి ఒక్క ప్రాజెక్టుతో సాధ్యమయ్యేది కాదు. నీరు, వ్యవసాయం, మౌలిక వసతులు, పరిశ్రమలు, సాంకేతికత, విద్య, సంక్షేమం - ఈ అన్ని రంగాలను ఒకేసారి ముందుకు తీసుకెళ్లే సమగ్ర దృష్టి అవసరం. ఆ దిశగా కూటమి ప్రభుత్వం రాయలసీమను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోందని ఈ ప్రాజెక్టులు, పెట్టుబడులు, మౌలిక వసతుల కార్యక్రమాలు సూచిస్తున్నాయి.
"రాళ్లసీమ"గా ముద్రపడిన ప్రాంతాన్ని "రతనాల సీమ"గా, కరువు గుర్తింపును అవకాశాల గుర్తింపుగా మార్చాలనే విజన్తో సాగుతున్న ఈ ప్రయాణం, రాయలసీమ భవిష్యత్తును కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నంగా నిలుస్తోంది.
@ncbn@naralokesh
#RayalaseemaRising
#ChandrababuNaidu
#NaraLokesh
#Rayalaseema
రౌడీయిజాన్ని నమ్ముకున్న గొడ్డలి పార్టీ అనేక భూ వివాదాలకు తెరలేపింది. తరతరాలుగా ఉన్న భూములను కూడా గొడ్డలి పార్టీ నేతలు గుంజుకోవాలని చూశారు. ప్రజల భూములకు సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకాలపై గొడ్డలి పార్టీ నేత ఫొటోలు ముద్రించారు. ఆ ఫొటోలను తొలగించి, రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను అందించాం.
#RayalaseemaRising
#CBNInKuppam
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh
కరవు కథలు రాసిన నేల... ఇప్పుడు కలల్ని సాకారం చేస్తున్న నేల...
నీటి ప్రతి చుక్కలో ఆశ ఉంది...
రైతు ప్రతి చెమట చుక్కలో భరోసా ఉంది...
రోడ్డు ప్రతి కిలోమీటరులో అభివృద్ధి ఉంది...
పరిశ్రమ ప్రతి అడుగులో యువత భవిష్యత్తు ఉంది...
పెట్టుబడి ప్రతి రూపాయిలో ఉపాధి ఉంది...
రాయలసీమ ప్రతి విజయగాథలో విజనరీ నాయకత్వం ఉంది...
'రాయల' నాటి వైభవాన్ని... 'రాయల్' సీమగా మలుస్తూ,
స్వర్ణాంధ్ర నిర్మాణంలో రాయలసీమను అభివృద్ధికి కొత్త చిరునామాగా తీర్చిదిద్దుతోంది కూటమి ప్రభుత్వం.
#RayalaseemaRising
#ChandrababuNaidu
#NaraLokesh
#Rayalaseema
#RayalaseemaRising#RayalaseemaSteelPlant
రెండు దశాబ్దాల రాయలసీమ ప్రజల కల ఈరోజు నెరవేరింది. సీమ ఖనిజ సంపద... సీమ అభివృద్ధికే వినియోగించాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని సున్నపురాళ్లపల్లిలో 'జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్' పనులు ప్రారంభించి నిజం చేశాం. దీనికి అనుబంధంగా 'నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు'కు, అలాగే విజయనగరం జిల్లాలోని 'జేఎస్డబ్ల్యూ పారిశ్రామిక పార్కు'కు కూడా శంకుస్థాపన చేసుకున్నాం. గత ప్రభుత్వంలో కేవలం శంకుస్థాపనలతో సరిపెట్టి ప్రజలను మభ్యపెడితే... మేం పనులు మొదలుపెట్టి రాయలసీమ స్టీల్ ప్లాంటుకు వాస్తవరూపం ఇస్తున్నాం. 2028 నాటికి ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్ నిర్మాణం పనులు ఈరోజు నుంచి జరుగుతాయి. స్టీల్ ప్లాంట్ రాకతో కడపజిల్లా వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా, వేలాది మంది యువతకు ఉద్యోగాలు దక్కుతాయి. అటు విశాఖ స్టీల్ ప్లాంట్, ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్... ఇటు జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్తో ఆంధ్రప్రదేశ్ను ఉక్కు రాష్ట్రంగా మారుస్తున్నాం.
@TheJSWGroup
#RayalaseemaRising#RayalaseemaSteelPlant
రాయలసీమ రైజింగ్ ... స్వర్ణయుగం ప్రారంభమైంది.
రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న గుర్తుకు వచ్చేవారు. వీటితోపాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు, స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ కూడా గుర్తుకు వస్తున్నాయి.
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh
#VeligondaProject
మొన్న శనివారం చంద్రబాబుగారు వెలిగొండ నిర్వాసితులతో సమావేశమై రూ.300 కోట్ల పరిహారాన్ని వారి ఖాతాల్లో జమచేశారు. నిన్న ఆదివారం కావడంతో ఈరోజు నిర్వాసితుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. బ్యాంకుల నుంచి తమ ఫోన్లకు వస్తున్న సందేశాలను చూసుకుని మురిసిపోతూ "థాంక్యూ సీఎం చంద్రబాబుగారు" అంటూ నిర్వాసిత కుటుంబాల వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
"జగన్మోహన్ రెడ్డి, నువ్వు గడిచిన ఐదేళ్లు రాష్ట్రానికి చేసిన విధ్వంసం చాలు. రాజధాని రైతులకు నువ్వు చేసిన ద్రోహం నీకు గుర్తుంటే రాజధాని అమరావతి వైపు చూడొద్దు" అంటూ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చిన రాజధాని అమరావతి మహిళా రైతులు.
#RythuluAgainstRowdies
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులు, రైతుల కళ్లల్లో ఆనందం, వారి ముఖాల్లో కనిపించిన నమ్మకం నా గుండెను తాకింది. 4.50 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, 20 లక్షల మందికిపైగా తాగునీరు అందించే వెలిగొండకు భూములిచ్చిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత మేం తీసుకున్నాం. అందులో భాగంగా 2,351 మంది నిర్వాసితులకు మొదటి దశలో రూ.300 కోట్లు అందించాం. ప్రతి నిర్వాసిత కుటుంబానికి రానున్న రోజుల్లో న్యాయం చేస్తాం. ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయి. ఈ సీజన్ లోనే ఫేజ్ 1 ద్వారా సాగునీళ్లు ఇస్తాం. కరువు ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు తెస్తాం.
#VeligondaProject
స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే జగన్ గారు ఓర్వలేకపోతున్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఉన్నవారితోపాటు అదనంగా మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే ఉసూరుమంటున్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్లు పైలైట్ ప్రాజెక్టుగా చేపట్టాం. ఈ స్కూళ్ల పరిధిలో పనిచేస్తున్న 233 మంది కుక్-కమ్-హెల్పర్లు యథావిధిగా తమ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న మరో 33 స్మార్ట్ కిచెన్ల పరిధిలో ఏ ఒక్కరి ఉపాధికీ ఢోకాలేదు. పైగా స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వయంశక్తి సంఘ మహిళలకు 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, సుమారు 76 మంది డ్రైవర్లకు అదనంగా ఉపాధి కల్పించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే స్మార్ట్ కిచెన్లతో ఉన్నవారితోపాటు అదనంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు జగన్ గారు? పేదలు బాగుపడితే చూడలేరా?
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో వేతనాలు చెల్లించలేదని జగన్ గారు ఆరోపించిన వైఎస్సార్ కడప జిల్లాలో పనిచేస్తున్న మొత్తం 3,450 మంది కుక్-కమ్-హెల్పర్లు ఏప్రిల్ - 2026 నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించేశాం. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవుల కారణంగా గౌరవ వేతనాలు చెల్లింపు ఉండదు. జూన్ నెల ఇంకా పూర్తి కాలేదు. మరి జగన్ గారు ఎవరి బకాయిలు గురించి ఫేక్ ఆరోపణలు చేశారో చెప్పాలి.
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో విద్యార్థులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన, ప్రమాణాలకు అనుగుణమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పేద పిల్లలకు మంచి భోజనం పెట్టడం, ఆరోగ్యం ఉండడం కూడా సహించలేకపోతే ఎలా జగన్ గారు?
@ysjagan
గొడ్డలి పార్టీ నేతలు ఎప్పటికీ మారరు. కుట్రలు చేయడం ఆపరు. వాళ్ళ వలన ప్రజలకు కీడే తప్ప మంచి జరగదు. జరగనివ్వరు. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అనర్హులు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులను వాళ్ళు ఐదేళ్ల పాటు ఎంతగా హింసించారో రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. మళ్ళీ ఈరోజు కుట్రలు చేయడానికి అమరావతికి వెళ్లి ఆ రైతుల కోపాన్ని చూసొచ్చారు.
#RythuluAgainstRowdies
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#AndhraPradesh