#RayalaseemaRising#RayalaseemaSteelPlant
రాయలసీమ రైజింగ్ ... స్వర్ణయుగం ప్రారంభమైంది.
రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న గుర్తుకు వచ్చేవారు. వీటితోపాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు, స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ కూడా గుర్తుకు వస్తున్నాయి.
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh
#RayalaseemaRising#RayalaseemaSteelPlant
రెండు దశాబ్దాల రాయలసీమ ప్రజల కల ఈరోజు నెరవేరింది. సీమ ఖనిజ సంపద... సీమ అభివృద్ధికే వినియోగించాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని సున్నపురాళ్లపల్లిలో 'జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్' పనులు ప్రారంభించి నిజం చేశాం. దీనికి అనుబంధంగా 'నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు'కు, అలాగే విజయనగరం జిల్లాలోని 'జేఎస్డబ్ల్యూ పారిశ్రామిక పార్కు'కు కూడా శంకుస్థాపన చేసుకున్నాం. గత ప్రభుత్వంలో కేవలం శంకుస్థాపనలతో సరిపెట్టి ప్రజలను మభ్యపెడితే... మేం పనులు మొదలుపెట్టి రాయలసీమ స్టీల్ ప్లాంటుకు వాస్తవరూపం ఇస్తున్నాం. 2028 నాటికి ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్ నిర్మాణం పనులు ఈరోజు నుంచి జరుగుతాయి. స్టీల్ ప్లాంట్ రాకతో కడపజిల్లా వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా, వేలాది మంది యువతకు ఉద్యోగాలు దక్కుతాయి. అటు విశాఖ స్టీల్ ప్లాంట్, ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్... ఇటు జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్తో ఆంధ్రప్రదేశ్ను ఉక్కు రాష్ట్రంగా మారుస్తున్నాం.
@TheJSWGroup
#VeligondaProject
మొన్న శనివారం చంద్రబాబుగారు వెలిగొండ నిర్వాసితులతో సమావేశమై రూ.300 కోట్ల పరిహారాన్ని వారి ఖాతాల్లో జమచేశారు. నిన్న ఆదివారం కావడంతో ఈరోజు నిర్వాసితుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. బ్యాంకుల నుంచి తమ ఫోన్లకు వస్తున్న సందేశాలను చూసుకుని మురిసిపోతూ "థాంక్యూ సీఎం చంద్రబాబుగారు" అంటూ నిర్వాసిత కుటుంబాల వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
"జగన్మోహన్ రెడ్డి, నువ్వు గడిచిన ఐదేళ్లు రాష్ట్రానికి చేసిన విధ్వంసం చాలు. రాజధాని రైతులకు నువ్వు చేసిన ద్రోహం నీకు గుర్తుంటే రాజధాని అమరావతి వైపు చూడొద్దు" అంటూ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చిన రాజధాని అమరావతి మహిళా రైతులు.
#RythuluAgainstRowdies
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులు, రైతుల కళ్లల్లో ఆనందం, వారి ముఖాల్లో కనిపించిన నమ్మకం నా గుండెను తాకింది. 4.50 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, 20 లక్షల మందికిపైగా తాగునీరు అందించే వెలిగొండకు భూములిచ్చిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత మేం తీసుకున్నాం. అందులో భాగంగా 2,351 మంది నిర్వాసితులకు మొదటి దశలో రూ.300 కోట్లు అందించాం. ప్రతి నిర్వాసిత కుటుంబానికి రానున్న రోజుల్లో న్యాయం చేస్తాం. ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయి. ఈ సీజన్ లోనే ఫేజ్ 1 ద్వారా సాగునీళ్లు ఇస్తాం. కరువు ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు తెస్తాం.
#VeligondaProject
స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే జగన్ గారు ఓర్వలేకపోతున్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఉన్నవారితోపాటు అదనంగా మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే ఉసూరుమంటున్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్లు పైలైట్ ప్రాజెక్టుగా చేపట్టాం. ఈ స్కూళ్ల పరిధిలో పనిచేస్తున్న 233 మంది కుక్-కమ్-హెల్పర్లు యథావిధిగా తమ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న మరో 33 స్మార్ట్ కిచెన్ల పరిధిలో ఏ ఒక్కరి ఉపాధికీ ఢోకాలేదు. పైగా స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వయంశక్తి సంఘ మహిళలకు 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, సుమారు 76 మంది డ్రైవర్లకు అదనంగా ఉపాధి కల్పించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే స్మార్ట్ కిచెన్లతో ఉన్నవారితోపాటు అదనంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు జగన్ గారు? పేదలు బాగుపడితే చూడలేరా?
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో వేతనాలు చెల్లించలేదని జగన్ గారు ఆరోపించిన వైఎస్సార్ కడప జిల్లాలో పనిచేస్తున్న మొత్తం 3,450 మంది కుక్-కమ్-హెల్పర్లు ఏప్రిల్ - 2026 నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించేశాం. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవుల కారణంగా గౌరవ వేతనాలు చెల్లింపు ఉండదు. జూన్ నెల ఇంకా పూర్తి కాలేదు. మరి జగన్ గారు ఎవరి బకాయిలు గురించి ఫేక్ ఆరోపణలు చేశారో చెప్పాలి.
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో విద్యార్థులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన, ప్రమాణాలకు అనుగుణమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పేద పిల్లలకు మంచి భోజనం పెట్టడం, ఆరోగ్యం ఉండడం కూడా సహించలేకపోతే ఎలా జగన్ గారు?
@ysjagan
గొడ్డలి పార్టీ నేతలు ఎప్పటికీ మారరు. కుట్రలు చేయడం ఆపరు. వాళ్ళ వలన ప్రజలకు కీడే తప్ప మంచి జరగదు. జరగనివ్వరు. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అనర్హులు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులను వాళ్ళు ఐదేళ్ల పాటు ఎంతగా హింసించారో రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. మళ్ళీ ఈరోజు కుట్రలు చేయడానికి అమరావతికి వెళ్లి ఆ రైతుల కోపాన్ని చూసొచ్చారు.
#RythuluAgainstRowdies
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#AndhraPradesh
#25yrsOfBasavatarakamHospital
క్యాన్సర్ను జయించిన విజేత
స్వప్న పదోతరగతి చదువుతున్నప్పుడే బోన్ క్యాన్సర్ బయటపడింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. ఎక్కడా ఆరోగ్యం మెరుగు పడలేదు. NBK ఫ్యాన్స్ అసోసియేషన్కి చెందిన అనంతపురం జగన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. నందమూరి బాలకృష్ణ గారు స్వప్నకు అందించిన వైద్య చికిత్సను స్వయంగా పర్యవేక్షించారు. క్యాన్సర్ జయించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన స్వప్న, తనకు పునర్జన్మ ప్రసాదించిన బసవతారకం ఆసుపత్రికి, నందమూరి బాలకృష్ణకు, అనంతపురం జగన్కు కృతజ్ఞతలు తెలిపింది.
#NandamuriBalakrishna
It was a privilege to clap the first shot and launch the shoot of #NBK112 in #Amaravati.
This is more than the beginning of a film - it is another step towards making Amaravati a vibrant hub for the creative economy. Under the leadership of Hon'ble CM Shri @ncbn garu, we are committed to creating world-class infrastructure that enables the film industry and creators to thrive in Andhra Pradesh.
My best wishes to Bala Mavayya, the entire cast and crew for a blockbuster success. Looking forward to seeing many more films begin their journey from Andhra Pradesh.
చిన్న పడవల కొనుగోలుకు ఒక్కో పడవకు రూ.2.50 లక్షలు, పెద్ద పడవకు రూ.7.50 లక్షల వరకు వ్యయం అవుతుందని, ఈ బోట్లు నెల్లూరులో తయారవుతాయని, కుటుంబానికి నెలకు రూ.20 వేల వరకు సంపాదన ఉంటుందని మంత్రి నారా లోకేష్ గారికి వివరించిన మత్స్యకారులు.
#MatsyakarulaSevalo#NaraLokesh#AndhraPradesh
చిన్న వయసులోనే పెద్దల సభకు ఎన్నికయ్యి... మీ జీవిత లక్ష్యాన్ని సాధించారు @vijaychinthak గారు !
చంద్రబాబు గారు, లోకేష్ గారి తరహా #speedofgovernence లో మిమ్మల్ని మీరు నిరూపించుకుని మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ...
Wishing you all the very Best vijay garu 💐
#VijayChintakayala #TDP #Congratulations #AndhraPradesh