ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్న దొర గారు.. తేనె పూసిన కత్తితో ఉద్యోగుల కడుపులు కోస్తున్నాడు. పంచాయతీ కార్యదర్శులను మూడేండ్లకే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, నాలుగేండ్లు దాటినా ఉలుకూపలుకు లేదు. నిబంధనల పేరుతో కార్యదర్శులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక చేతితో అవార్డులు పెడుతూ.. మరో చేతితో మట్టి కొడుతున్నాడు. రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేస్తున్నా.. దొరగారు మత్తు వీడటంలేదు. నీ కుటుంబానికి పదవులు ఇచ్చేందుకు ఎలాంటి రూల్స్ అక్కర్లేదు కానీ.. కష్టపడి పని చేస్తున్న కార్యదర్శులకు నిబంధనలా? మరోవైపు సీపీఎస్ ను రద్దు చేస్తామని చెప్పిన సారు.. తొమ్మిదేండ్లుగా నిద్రలోనే ఉన్నాడు. ఉద్యోగులను అన్ని రకాలుగా వాడుకొని, ఇప్పటికే జీతాలు ఎగ్గొడుతున్న ముఖ్యమంత్రి.. పెన్షన్ విధానాన్ని అయినా పునరుద్ధరించడం లేదు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పేది ఉద్యోగులే. కేసీఆర్ ను గద్దె దింపేది ఉద్యోగులే. ఇకనైనా కేసీఆర్ గారు.. కార్యదర్శులకు, ఉద్యోగులకు క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాసి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ క్రమబద్దీకరణ గురించి ప్రకటన చేసినందుకు గౌరవ పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారిని సన్మానించి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది పాలకుర్తి మండలం జనగామ జిల్లా.@EDRBRS@BRSHarish@KTRBRS@TelanganaCMO@TelanganaCS
హన్మకొండ లోని R&B క్యాంపు కార్యాలయంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ లను రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన సందర్భంగా వరంగల్ జిల్లా JPS లతో కలిసి సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.