హన్మకొండ లోని R&B క్యాంపు కార్యాలయంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ లను రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన సందర్భంగా వరంగల్ జిల్లా JPS లతో కలిసి సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ @BRSHarish, శ్రీ @YadavTalasani, ఎమ్మెల్సీలు శ్రీ @PRR_BRS, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ @KaushikReddyBRS, ఎమ్మెల్యేలు శ్రీ @JeevanReddyBRS, శ్రీ @BalkaSumanTRS, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
@TelanganaCMO మీరు సృష్టించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేసి మీ యొక్క మాటను నిలబెట్టుకోండి సార్ మీ యొక్క మాట కోసం మా అందరి కుటుంబాలు వేచి చూస్తున్నాయి సార్ 9355 కుటుంబాలు సార్
ఈ నెల 18వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది.
State Cabinet will meet under the Chairmanship of Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao at 3 PM in Dr. B.R. Ambedkar Telangana State Secretariat on 18th May (Thursday).
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె విరమణ.
గౌరవ ముఖ్యమంత్రి @TelanganaCMO గారు గౌరవ మంత్రివర్యులు @EDRBRS రెగ్యులరైజేషన్ చేసి జెపియస్/ఓపియస్ జీవితాల్లో వెలుగునింపుతారని ఆశిస్తూ...
#JPSRegularisation#Mahabubabad
#KCR 10,000 మంది పంచాయతి సెక్రటరీల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, వాళ్ల బలవన్మరణాలకు కారకులై, మళ్లీ ఈ రోజు 12 గం. లోగా విధుల్లో చేరక పోతే ఉద్యోగం నుండి తొలగించి వేరే వాళ్లను నియమించుకుంటామనడం రాజ్యాంగ విరుద్దం-నిరంకుశత్వం. Absolutely Unconstitutional and Dictatorial.
తెలంగాణను విచ్చలవిడిగా దోచుకుంటూ మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నేటి నుండి సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించవలసిందిగా తెలంగాణ ప్రజలను కోరుతున్నాం.
నేడు సాయంత్రం 7 గం. కు ప్రజలందరం కలిసి ఈ దోపిడి #KCR ప్రభుత్వం పై పోరాటంలో అసువులు బాసిన ఉద్యోగ యోధులకు (భైరి సోని,JPS గారితో సహా) ప్రతి గ్రామ పంచాయతి కార్యాలయం నుండి మహనీయుల విగ్రహాల వరకు కొవ్వొత్తుల ర్యాలీలను నిర్వహిద్దాం. పార్టీలకతీతంగా అందరూ ఇందులో స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా మనవి🙏
అందరు ఉద్యోగ మిత్రులు సోమవారం నాడు లంచ్ టైం లో కీ.శే సోని గారికి మీ మీ ఆఫీసుల్లో నివాళులు అర్పించి సమ్మె చేస్తున్న ఉద్యోగ మిత్రులకు బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి. 🙏
ఒక్కరి కోసం అందరం- అందరి కోసం ఒక్కరం- ఇదే మన నినాదం.
#RegulariseJPS/OPS #LiberateTelangana
#TelanganaStandsWithJPS
@RSPraveenSwaero అదే జూనియర్ పంచాయతీరాజ్ సెక్రెటరీ లను రెగ్యులర్ చేస్తే ఆమె బ్రతికి ఉండేది, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే వారి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి
వరంగల్-ఖానాపూర్ లో ఆత్మహత్య చేసుకున్న పంచాయతి సెక్రటరీ Ms. Sony గారి మృతి అత్యంత బాధాకరం.దీనికి కారణం #KCR ప్రభుత్వ మొండి వైఖరి,మోసపూరిత విధానాలే.
మీకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా బుక్కుతున్న మీ పార్టీ నాయకుల మీదున్నంత ప్రేమ,ఈ JPSల మీద ఎలాగూ లేదు. వాళ్ల ప్రాణాలు ఎందుకు తీస్తున్నరు?