నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
పాపను చంపిన వారిని...
కేసును నీరుగార్చిన వారిని...
సాక్ష్యాలను తారుమారు చేసిన వారిని వదిలేసి...
సుగాలీ ప్రీతికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకువచ్చి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి, న్యాయం కోసం మొదటి నుంచి చివరి వరకు పోరాడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిపైనే కేసు పెట్టడం ఎంత దురదృష్టకరమో ప్రజలే ఆలోచించాలి.
"పళ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు" అన్న మాట మరోసారి నిజమైంది. ప్రజల కోసం, బాధితుల కోసం నిలబడే నాయకుడిపైనే రాజకీయ కక్షతో కేసులు పెట్టడం న్యాయాన్ని అణచివేయలేం.
సుగాలీ ప్రీతి కోసం గొంతెత్తింది శ్రీ పవన్ కళ్యాణ్ గారే.ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసేలా చేసింది ఆయన పోరాటమే.
నేరస్థులను ప్రశ్నించిన నాయకుడిని నిందితుడిగా చూపించే ప్రయత్నాలు ఎంత చేసినా... సత్యం ఎప్పటికీ గెలుస్తుంది.
@JanaSenaParty@PawanKalyan@JSPShatagniTeam@APDeputyCMO
#PawanKalyanAneNenu #janasenaparty #lokammadhavi
#pawankalyantransformsap #janasenaparty