నాడు వైఎస్.. నేడు @ysjagan .. ఫేక్ ప్రచారం పైనే రాజకీయం చేశారు… చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి పింక్ డైమండ్ పై ఇలాగే ఫేక్ ప్రచారాలు చేశారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అన్నారనే ప్రచారం కూడా అంతే ఫేక్ వార్త. ఈ అబ్బా కొడుకుల బతుకే ఫేక్ బతుకు. వ్యవసాయం దండగ అన్ని అని తాను అన్నట్లు నిరూపించాలని చంద్రబాబు గారు నిండు అసెంబ్లీలో జగన్ తండ్రికి అప్పటిలో ఛాలెంజ్ విసిరారు. దానికి సమాధానం చెప్పలేక అప్పటిలోనే వై ఎస్ తోక ముడిచాడు. ఇప్పుడు వైఎస్ కొడుకు మళ్లీ అదే ప్రచారం మొదలు పెట్టాడు….
చంద్రబాబు గారు ‘‘మనసులో మాట’’ పుస్తకంలో ఏమి రాసారో చూడండి.. రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి, గోడౌన్లు కట్టాలి, రవాణా సౌకర్యాలు కల్పించాలి, వ్యవసాయంలో రిస్క్ తగ్గేవరకూ వారిని కాపాడాలి… ఇలా అనేక విషయాలు రైతుకు ఉపయోగపడేవి, ప్రభుత్వాలు చేయాల్సినవి చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందనేది చంద్రబాబుగారు ఎప్పుడూ చెప్పే మాట.
దేశ ఆదాయానికి, రాష్ట్ర ఆదాయానికి మూల స్తంభం అయిన వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు గారు చూపే విజన్, వేసే ప్రణాళికల కారణంగానే చాలా సార్లు వ్యవసాయం లాభసాటిగా మారిన మాట వాస్తవం. సాగు నీటి అవసరాలు తీర్చేందుకు చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
నదుల అనుసంధానం నుంచి ప్రాజెక్టుల నిర్మాణం వరకు చంద్రబాబు గారి దార్శనికత పాలకులందరికి ఆదర్శం.
‘‘గ్రామాలు వదలద్దు… వ్యవసాయం ముద్దు’’ అనే సంకల్పంతో పని చేసే చంద్రబాబు గారిపై వ్యవసాయం దండగ అన్నారని ప్రచారం చేస్తారా ఫేక్ ఫెలోస్?
జగన్ పాలనలో పశ్చిమగోదావరి జిల్లాలో వరి రైతులు తమంతట తామే ‘‘క్రాప్ హాలిడే’’ ప్రకటించుకుని పంటలు వేయలేదు… అలాంటి పార్టీ చంద్రబాబుగారిపై తప్పుడు ప్రచారం చేస్తున్నది.
దేశంలో మొట్టమొదటి సారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘‘ధరల స్థిరీకరణ నిధి’’ ఏర్పాటు చేసి రైతులను మార్కెట్ లో ధరల హెచ్చుతగ్గుల నుంచి ఉపశమనం కల్పించిన దార్శనికుడు చంద్రబాబు గారు…. ఈ ఫేక్ ఫెలోస్ కు తెలియని విషయాలు ఇవన్నీ….
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
#IntintikiTeluguDesam
ఇంతతక్కువ సమయంలో అరకోటి కుటుంబాలకు పార్టీని చేర్చగలగడం... ప్రభుత్వ పాలన గురించి ప్రజలకు అవగాహన కలిగించడం మామూలు విషయం కాదు. కేవలం కార్యకర్తల సంకల్పంతోనే ఇది సాధ్యం. అందుకు కార్యకర్తలకు అభినందనలు. ఇదే ఉత్సాహంతో “ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం” కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా కొనసాగించండి.
#2YrsOfTrustDevelopmentWelfare
#AndhraPradesh
#IntintikiTeluguDesam
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని 25 లక్షల కుటుంబాలకు చేరువచేసిన టీడీపీ కార్యకర్తలకు, నేతలకు అభినందనలు. ప్రజలకు ప్రభుత్వ విజయాలను వివరించడంతో పాటు, క్షేత్రస్థాయిలో వారు ఎదురవుతున్న సమస్యలు, ప్రజల సలహాలు మరియు అభిప్రాయాలను తెలుసుకోండి. వాటిని పార్టీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం ద్వారా మరింతగా పార్టీని ప్రజలకు దగ్గర చేయండి.
#2YrsOfTrustDevelopmentWelfare
#IntintikiTeluguDesam#2YrsOfTrustDevelopmentWelfare#IdhiManchiPrabhutvam
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి సమానమే. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు అందించాలన్నదే చంద్రబాబు గారి అభిమతం. ఈ రెండేళ్లలో అభివృద్ధి వికేంద్రీకరణ, సర్వజన సంక్షేమం అన్నిటినీ మించి ప్రజల్లో ఏర్పడిన నమ్మకం... వీటికి నిదర్శనం ఈ వివరాలు. ఒకసారి చూడండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
కర్నూలు జిల్లా ఆస్పరిలో ఈ రోజు సంజీవని కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రజారోగ్య భద్రతే ధ్యేయంగా ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి...ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో సమర్థవంతమైన వైద్యాన్ని అందిస్తాం. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని....ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని....ప్రజలు కూడా ఉత్తమ ఆరోగ్య విధానాలతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ కోసం అడుగేయాలని కోరుతున్నాను.
#Sanjeevani
#TallikiVandanam
పిల్లలు ఎందరున్నా.. వారి భవిష్యత్తుపై బెంగ లేదు యిక..
దండోరా వేసి చెప్పినట్టే.. అందరు పిల్లలకూ ‘తల్లికి వందనం’ కానుక..!
మొత్తం విద్యావ్యవస్థనే బాగుచేసే పనికి పూనుకున్న నారా లోకేష్..
రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకూ భరోసా ఇస్తూ చరిత్ర సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
‘‘కోటిమంది కార్యకర్తలు సభ్యులుగా ఉన్న అతిపెద్ద కుటుంబం నాది...
ఆ కుటుంబం కోసం ఏపని చేసినా పవిత్రంగా చేయాలనేది నేను బలంగా నమ్ముతాను..
ఇన్సూరెన్సు, ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లు ఒక భాగం మాత్రమే..
ఇప్పుడు కార్యకర్తలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నాం.. వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నాం.’’
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
నాయకత్వం అంటే కేవలం అధికారం కాదు... ప్రజల నమ్మకాన్ని గుండెల్లో మోస్తూ, వారితో కలిసి నడిచే అడుగు. మన కోసం, మన భవిష్యత్ తరాల కోసం నేను మీ వెన్నంటే ఉంటాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంతా ఒక కుటుంబం. ఇక్కడ వర్గాలుండవు. కార్యకర్తలంతా ఒక్కటే గుర్తు పెట్టుకోండి. పార్టీ కోసం కష్టపడండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది.
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన జగన్నాథ స్వామి రథ యాత్రలో పాల్గొన్నాను. జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవి ఆశీనులైన రథాన్ని లాగే పవిత్ర క్రతువులో భాగస్వామిని అయ్యాను. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మధు పండిట్ దాసా గారికి, హరే కృష్ణ గోకుల క్షేత్రం అధ్యక్షులు శ్రీ వంశీధర దాస గారికి నా ధన్యవాదాలు.
విధ్వంసాన్ని, అరాచకాన్ని ఎవరైనా గుర్తు చేసుకుంటారా జగన్ రెడ్డి గారు!. మీ ఐదేళ్ల పాలన మత్స్యకారుల పాలిట పీడకల లాంటిది. పీడకలను ఎవరైనా గుర్తుకు తెచ్చుకుంటారా?
#PsychoFekuJagan#AndhraPradesh
#ChooseSpeedChooseAP#RayalaseemaRising
Cement is usually grey. But can it be green?
Tomorrow, I’m excited that we will be breaking ground on a new way to make cement - sustainably, for our planet.
What could it be?
Kadapa. Stay tuned.
అమరావతిపై జగన్ ఆడిన విషనాటకానికి పద్మనాభరెడ్డి మరణం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శవరాజకీయాలు చేయడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన అనుకూల మీడియాకు కొత్తేమీ కాదు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి మరణాన్ని అడ్డం పెట్టుకుని, జగన్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం మరోసారి వారి నైజానికి అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న భూసమీకరణ వల్లే పద్మనాభరెడ్డి ఒత్తిడికి గురై చనిపోయారంటూ జగన్ చేయిస్తున్న ఈ ప్రచారం పూర్తిగా అబద్ధం, ఫేక్.
అసలు నిజం ఏమిటంటే
• పద్మనాభరెడ్డి అనే వ్యక్తి పేరిట ప్రస్తుతం అక్కడ ఎటువంటి భూమీ లేదు.
• ఆయన కుమారుడు ఉజ్వల్ కుమార్ రెడ్డి పేరిట కేవలం 1 ఎకరం 19 సెంట్ల భూమి మాత్రమే ల్యాండ్ పూలింగ్ స్కీం కింద నోటిఫై చేయబడింది.
• సదరు భూమి సీడ్ యాక్సిస్ రోడ్, కొండవీటి వాగు లేదా మరే ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల పరిధిలోకి రాదు. అలాంటప్పుడు భూమి కోల్పోతున్నారనే ఒత్తిడి ఆయనపై ఎలా ఉంటుంది? ఈ ప్రాజెక్టుల కోసం ఆయన భూమిని కోల్పోవాల్సి వచ్చిందని జగన్ మీడియా చెబుతున్నది పచ్చి అబద్ధం.
సగటు రైతు ప్రశ్న
👉అమరావతి కోసం భూములిచ్చిన రైతులపై ఐదేళ్ల పాటు కక్ష సాధించి, వందలాది మంది మరణానికి కారణమైన జగన్, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతున్నారు?
👉 ఐదేళ్ల జగన్ పాలన, అమరావతిపై సాగిన అణచివేత
నిజంగా రైతుల మరణాల గురించి మాట్లాడాల్సి వస్తే, వేలెత్తి చూపించాల్సింది జగన్ మోహన్ రెడ్డి వైపే. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన అమరావతి రైతులపై పగబట్టి, వారిని మానసిక క్షోభకు గురిచేసి దాదాపు 253 మంది రైతుల ప్రాణాలు బలితీసుకున్న చరిత్ర జగన్ది కాదా?
👉రాజధాని ఉద్యమ సమయంలో జరిగిన కొన్ని దారుణాలు ఈనాటికీ ప్రజల గుండెల్లో అలానే ఉన్నాయి.
1. మహిళలపై అరాచకాలు:గర్భిణీ స్త్రీల కడుపులపై బూటు కాళ్లతో తన్నించి, జుట్టు పట్టి రోడ్లపై ఈడ్చుకెళ్లిన దుర్మార్గం జగన్ పాలనలో జరగలేదా? దుర్గగుడికి వెళ్తున్న అమరావతి మహిళలపై లాఠీచార్జ్ చేయించిన శాడిజం ఎవరిది?
2. అక్రమ కేసులు: హక్కుల కోసం పోరాడిన ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన విడ్డూరం ఈ రాష్ట్రంలో చూశాం.
3. బారికేడ్ల వెనుక పాలన: రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే వారి శిబిరాలపై రౌడీలతో దాడులు చేయించి, ప్రజలను చూడలేక ఇళ్ల తలుపులకు అడ్డుగా బారికేడ్లు, రోడ్లపై పరదాలు కట్టుకుని తిరిగిన పిరికితనం జగన్ ది కాదా?
4. కుల ముద్ర వేసి. అభివృద్ధిని తొక్కిపెట్టి: రాజధానికి భూములిచ్చిన వారిలో 32 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, 23 శాతం మంది రెడ్లు, 14 శాతం బీసీలు, 9 శాతం కాపులు, 3 శాతం మైనారిటీలు ఉన్నారు. అంటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అమరావతికి మద్దతు పలికారు. కానీ, కేవలం 18 శాతం ఉన్న ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అమరావతిని 'కమ్మరావతి' అని విష ప్రచారం చేయించింది జగన్ కాదా?
5. దళితులు అధికంగా ఉన్న ప్రాంతంలో రాజధాని వస్తే ఆ వర్గాలు ఆర్థికంగా ఎదుగుతాయనే కుట్రతో, రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఐదేళ్ల పాటు డ్రామాలు ఆడి, ఏ ఒక్క రాజధాని లేకుండా చేసిన నయా తుగ్లక్ జగన్ మోహన్ రెడ్డి కాదా ?
ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిపై విషం కక్కిన జగన్, నాటి రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది రైతులను బలవంతంగా ఆపి, వారి జీవితాలు బాగుపడకుండా అడ్డుకున్నాడు. ఆనాడు జగన్ సృష్టించిన అభద్రతాభావం, దిగులుతోనే పద్మనాభరెడ్డి వంటి ఎందరో రైతులు మానసిక వేదనతో చనిపోయారు. కాబట్టి జగన్ మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారమే చూసినా... పద్మనాభరెడ్డి లాంటి రైతుల అకాల మరణాలకు ముమ్మాటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే కారణం!
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
#YSRaavanCP#AntiNationalJagan
వైఎస్సార్సీపీ అంటే వైఎస్ 'రావణ్' కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ప్రజలు. అంబటి నుంచి జగన్ వరకు మా రావణ్ కు మేము అండగా నిలబడతాం అనడం... న్యాయసహాయం అందించమని జగన్ ఆదేశించినట్టుగా అంబటి చెప్పడం... గొడ్డలి పార్టీ నేత ఫ్లాట్ నుంచే రావణ్ నడిపించే 'ప్రశ్న' ఛానెల్ నడుస్తుండటం చూస్తే ప్రజలు అనుకునేది నిజమే అనిపిస్తోంది.
#PsychoFekuJagan
#AndhraPradesh
గోదారమ్మ పట్టిసీమ ద్వారా తరలి వచ్చి కృష్ణమ్మను కలిసే పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జల హారతి కార్యక్రమంలో పాల్గొన్నాను. నదుల అనుసంధానంలో భాగంగా దశాబ్దం క్రితం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 450 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించి ఇక్కడి భూములను సస్యశ్యామలం చేశాం. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేటి రోజుల్లో కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు ఊపిరి పోశాయి. భారత సాగునీటి రంగానికి దిక్సూచిగా నిలిచిన ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కే.ఎల్. రావు గారి 124వ జయంతి సందర్భంగా సాగునీటి రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నాం. ఆయన స్ఫూర్తితో రానున్న మూడేళ్లలో పూర్తి చేసే 36 ఇరిగేషన్ ప్రాజెక్టులపై క్యాలెండర్ను ప్రకటించాము. దేవుడి దయ, ప్రజల మద్దతుతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం.
#TallikiVandanam
జులై 22వ తేదీన 64,76,590 మంది విద్యార్థులకు రూ.15,000 చొప్పున తల్లికి వందనం నిధులను జమ చేయడానికి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇందులో ఒక్కొక్కరి నుంచి రూ.2000లను మినహాయించుకుని ఆ సొమ్మును రాష్ట్రంలో విద్యా సౌకర్యాలను మెరుగు పరచడానికి ఉపయోగిస్తారు.
ఒకటో తరగతిలో చేరే వారు 59,500 మంది, జూనియర్ ఇంటర్ లో చేరేవారు 56,100 మంది ఉండొచ్చని అంచనా. అలాగే వివిధ కారణాల వల్ల అర్హతను నిర్ధారించలేక పోయిన వారు మరో 1,55,000 మంది ఉంటారని అంచనా. వీరందరికీ వెరిఫికేషన్ పూర్తి చేసి ఆగస్టు 30వ తేదీన తల్లికి వందనం నిధులు జమ చేస్తారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
నాడు రాయలసీమకు చేపలు, రొయ్యలు దుకాణాలు తెస్తేనే అభివృద్ధి అని జగన్ చెప్పుకునే వైకాపా పాలన రోజులు..
నేడు రాయల్ ఎన్ఫీల్డ్, కియా, SGF రాకతో రాయలసీమను రతనాల సీమగా మార్చారు సీఎం చంద్రబాబు గారు.
#RayalaseemaRising#2YrsOfTrustDevelopmentWelfare#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#FarmersFriendlyGovt
కొత్తపేట నియోజకవర్గంలోని పిచ్చుకులంక గ్రామంలో నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రైతులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. సభా ప్రాంగణంలో పచ్చ కండువాలను గాల్లో తిప్పుతూ సీఎం రాకను ఆహ్వానించిన రైతుల ఉత్సాహానికి ప్రతిస్పందనగా ముఖ్యమంత్రి కూడా పచ్చ కండువాను గాల్లో తిప్పుతూ సభికులను అభివాదం చేశారు.
#ChandrababuNaidu
#AndhraPradesh