This is what I have always said: @ysjagan is a reformer, whereas @JaiTDP and @ncbn are credit chors.
The people of Andhra Pradesh have been foolishly brainwashed into choosing feudal TDP over Y. S. Jagan.
#CreditChorBabu
Dear YSRCP supporters,
You are always welcome to express your support and enthusiasm. We kindly request everyone to follow the party’s guidelines to avoid any possible confusion.
#YSRCP#JaganannaConnects
X is full of...
1)ఉద్యోగం లేని వాళ్ళు: ఖాళీగా ఉండటం వల్ల వచ్చే నిరాశ, అసూయతో ఇతరుల ఎదుగుదలను చూసి తట్టుకోలేక
2)కడుపు నిండిన NRIs:
జీవితంలో అన్నీ దొరకడం వల్ల వచ్చే అహంకారంతో ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడతారు.
3)రూమర్స్ వినే NRIs: నిజానిజాలు తెలుసుకోకుండా, కేవలం గాసిప్స్ (ఉబుసుపోని మాటలు) నమ్ముతూ లేనిపోని గొడవలు సృష్టిస్తారు.
4)సిక్ మైండెడ్ NRIs: విదేశాల్లో ఉంటూ ఆధునిక వసతులు అనుభవిస్తున్నా, ఆలోచనలు మాత్రం చాలా సంకుచితంగా, కుళ్ళుతో నిండి ఉంటాయి.గలీజ్ మైండ్ సెట్ వాళ్ళు: కుల, మత, ప్రాంతీయ భేదాలతో ఇతరుల వ్యక్తిగత జీవితాలపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంటారు.
5)సినిమా పిచ్చి (Blind Fanaticism)హీరోలను కేవలం నటులుగా కాకుండా దేవుళ్లుగా భావిస్తారు.సినిమా బాగుందా లేదా అనే దానికంటే, తమ హీరో రికార్డులు క్రియేట్ చేశాడా లేదా అనేదే వీరికి ముఖ్యం.సినిమా కోసం సొంత కుటుంబాలను, చదువులను, ఉద్యోగాలను కూడా నిర్లక్ష్యం చేస్తారు.
6) రెచ్చగొట్టే తత్వం (Provocative Nature)సోషల్ మీడియా (X/Twitter, Instagram, YouTube) వేదికగా వేరే హీరోల అభిమానులను కావాలనే రెచ్చగొడతారు."మా హీరో తోపు, మీ హీరో వేస్ట్" అంటూ ట్రోల్స్, మీమ్స్ (Memes) క్రియేట్ చేసి గొడవలు స్టార్ట్ చేస్తారు.ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ ఆన్లైన్ వార్స్ (Online Wars) నడుపుతుంటారు.
7) బూతులు మాట్లాడే ఫాంటసీ (Abusive & Toxic Fantasy)వాదనలో గెలవలేనప్పుడు చాలా సులభంగా అసభ్య పదజాలం (బూతులు)వాడుతుంటారు.ఎదుటివారి ఇళ్లల్లో ఉండే మహిళలను, వ్యక్తిగత జీవితాలను లాగి మరీ అసభ్యంగా కామెంట్స్ చేస్తారు.తెర వెనుక (Anonymous/Fake Profiles) దాక్కుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంలో వీరికి ఒక రకమైన వికృత ఆనందం (Fantasy) దొరుకుతుంది.
ఈ మనస్తత్వానికి కారణాలు:నిరుద్యోగం & ఖాళీ సమయం:
చేతిలో పని లేకపోవడం వల్ల రోజంతా ఫోన్లలోనే గడుపుతారు.
గుర్తింపు కోసం ఆరాటం: నిజ జీవితంలో సాధించలేని గుర్తింపును, సోషల్ మీడియాలో లైకులు, రీట్వీట్ల ద్వారా పొందాలని చూస్తారు.
సామాజిక స్పృహ లేకపోవడం: ఏది తప్పు, ఏది రైట్ అని ఆలోచించే విచక్షణ కోల్పోవడం.ఇలాంటి వారి వల్ల సినిమా ఇండస్ట్రీకి గానీ, వారు అభిమానించే హీరోలకు గానీ ఎలాంటి ఉపయోగం లేదు సరే కదా, సమాజంలో యువత ఆలోచనా విధానం పూర్తిగా నాశనమవుతోంది.
All of those offline friends - their X accounts are either to raise some support issues or follow stocks or news...
I havent come across worst comment in their handles not even a single friend or colleague who is good ... couple of them mentioned they use X for 🌽 ...
I feel sometimes im one of the above qualities ...
check which one is your number or numbers....
you are not an exception buddy...
#TeluguTwitter
బ్రో, నిన్ను చూస్తే, నాకు ఈ చింతకాయ పిచ్చలే గుర్తుకు వస్తాయి 🤣 @iTDP_Official
నా చిన్న తనంలో ఎండాకాలంలో చింతకాయలు తిని, ఎవడు ఎంత దూరం పిచ్చలు ఉమ్మేస్తాడో పందెం పెట్టుకునే వాళ్ళం... 🤣
Cute boy Sintakaya🥰
జగన్మోహన్ రెడ్డి చొరవతోనే మత్స్యకారుల ఆచూకీ కోసం కేంద్రంపై ఒత్తిడి: ఎంపీ గురుమూర్తి.
మత్స్యకారుల ప్రాణాలకు భద్రత ఏది – రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ.
తిరుపతి: సముద్రంలో గల్లంతైన కోనసీమకు చెందిన ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చామని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్లోని భారత రాయబార కార్యాలయాలతో సమన్వయం చేస్తూ గాలింపు చర్యలను ముమ్మరం చేయించామని చెప్పారు. గురువారం తిరుపతిలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ గురుమూర్తి మాట్లాడారు.
ఇటీవల ఆగస్టు 3న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి బయలుదేరిన బోటు సముద్రంలో మరమ్మతులకు గురై బంగ్లాదేశ్ సరిహద్దు వైపు కొట్టుకుపోయిందని తెలిపారు. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు దాదాపు 24 రోజుల పాటు సముద్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఈస్ట్ కోస్ట్ స్పీడ్ బోట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో తాము సంబంధిత కేంద్ర మంత్రులు, అధికారులతో సంప్రదింపులు జరిపి గాలింపు చర్యలు కొనసాగించేలా చర్యలు తీసుకున్నామని ఎంపీ గురుమూర్తి వివరించారు. కోస్ట్గార్డ్ అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారని, చివరకు పశ్చిమ బెంగాల్కు చెందిన మత్స్యకారుల బోటు సిబ్బంది గల్లంతైన ఏడుగురు మత్స్యకారులను గుర్తించి తమ బోటుకు తాడు కట్టి సురక్షితంగా పశ్చిమ బెంగాల్లోని దిఘా తీర ప్రాంతానికి తీసుకువచ్చారని తెలిపారు. మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు సహకరించిన కోస్ట్గార్డ్ అధికారులు, కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలు, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్లోని భారత రాయబార కార్యాలయాలకు ఎంపీ గురుమూర్తి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మత్స్యకారుల ప్రాణాలకు భద్రత ఏది ?
ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి మత్స్యకారుల బోట్లు ప్రమాదాలకు గురికావడం, మత్స్యకారులు గల్లంతవడం ఆందోళన కలిగించే విషయమని ఎంపీ గురుమూర్తి అన్నారు. దాదాపు 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో వేలాది కుటుంబాలు సముద్ర వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు.
మత్స్యకారుల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదని ప్రశ్నించారు. ప్రతి బోటుకు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, లైఫ్ జాకెట్లు, ఇతర భద్రతా పరికరాలు అందించాలని కోరారు. ప్రతి బోటుకు శాటిలైట్ ఫోన్ అందించడంతో పాటు ట్రాన్స్పాండర్లలోని సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీపీఎస్, నావిగేషన్ పరికరాలు 24 గంటలు పనిచేసేలా పవర్ బ్యాకప్ ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. బోటు సముద్రంలో ఎక్కడ ఉందో ఎప్పటికప్పుడు గుర్తించే సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేస్తే ప్రమాద సమయంలో మత్స్యకారులను వేగంగా గుర్తించి రక్షించవచ్చని తెలిపారు.
మత్స్యకారులకు సరైన శిక్షణ, ప్రభుత్వ ప్రోత్సాహం అందించాలని ఎంపీ గురుమూర్తి కోరారు. స్పీడ్ బోట్లు, డీప్ సీ ఫిషింగ్ బోట్లు కొనుగోలు చేసుకునేందుకు రుణాలు, ఆర్థిక సహాయం అందించి మత్స్యకారులు స్వయం ఆధారంగా జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మత్స్యకారుల సంక్షేమం కోసం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, మత్స్యకార భరోసా వంటి కార్యక్రమాలు చేపట్టారని ఎంపీ గుర్తు చేశారు. డీప్ సీ ఫిషింగ్ బోట్లను అందించేందుకు కూడా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తుఫాను సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా మత్స్యకారుల బోట్లు ప్రమాదాలకు గురవుతున్నందున భద్రతా వ్యవస్థల్లో ఉన్న లోపాలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
మత్స్యకారుల సమస్యలను రాజకీయ కోణంలో చూడకుండా వారి ప్రాణాలు, భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ గురుమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫిషరీస్ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ, హోంశాఖలు సమన్వయంతో మత్స్యకారుల భద్రత కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల ప్రతి బోటుకు సేఫ్టీ ఆడిట్, శాటిలైట్ ఫోన్, పనిచేసే ట్రాన్స్పాండర్, జీపీఎస్, నావిగేషన్ పరికరాలు, పవర్ బ్యాకప్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. మత్స్యకారుల ప్రాణాలకు పూర్తి భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు.
#AdminPost #FishermenRescue #IndianCoastGuard #YSJaganMohanReddy #YSJagan #AndhraPradesh #TirupatiMP #MaddilaGurumoorthy #YSRCongressParty