విజయవాడలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు!
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారితో కలిసి 64 డివిజన్ల నాయకులు, వీర మహిళలతో కీలక సమావేశం నిర్వహించాం.
శుక్రవారం ఉదయం 10:00 గంటలకు వెన్యూ కన్వెన్షన్ హాల్లో జరిగే మహాసమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు మరియు ఇతరులు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.
జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేద్దాం!
@JanaSenaParty@PawanKalyan
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు
• మార్గమధ్యంలో మంగళగిరి వద్ద స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
• కుంకీలకు స్వయంగా ఆహారం అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
• జెండా ఊపి గుచ్చిమి క్యాంపుకు సాగనంపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు సంఘర్షణల నివారణ చర్యలను బలోపేతం చేసే దిశగా పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద స్వాగతం పలికారు. గజరాజులకు మార్గమధ్యంలో పూలు చల్లి స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రివర్యులు, వాటికి స్వయంగా ఆహారం అందజేశారు. అనంతరం గుచ్చిమి శిబిరానికి బయలుదేరిన కుంకీల రెండో అంచె ప్రయాణాన్ని జెండా ఊపి సాగనంపారు.
ఈ సందర్భంగా ప్రయాణంలో కుంకీల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. గుచ్చిమి క్యాంపునకు చేరిన అనంతరం నిపుణుల పర్యవేక్షణలో అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జయంత్, అభిమన్యుల సేవలు పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో మానవ-ఏనుగు ఘర్షణల నియంత్రణకు ఎంతో ఉపయోగపడనున్నాయని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలను కూటమి ప్రభుత్వం శాస్త్రీయ, మానవీయ విధానాలతో చేపడుతున్న చర్యల్లో భాగంగా కుంకీలను తరలిస్తున్నామని అన్నారు.
- ఒడిశా వైపు నుంచి ఏనుగులు
ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి ఏనుగుల గుంపులు తరచూ పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశిస్తూ పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో, మానవ-ఏనుగు ఘర్షణల నివారణకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ కుంకీ ఏనుగులను గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్నారు. మానవ-ఏనుగు ఘర్షణల నివారణ చర్యల్లో భాగంగా కుంకీ ఏనుగులైన జయంత్, అభిమన్యులను వినియోగిస్తారు.
గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో నిర్వహించిన పలు కీలక ఆపరేషన్లలో ఈ రెండు కుంకీ ఏనుగులు కీలక పాత్ర పోషించాయి. అడవి ఏనుగుల గుంపులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించడంలో ఎంతో చురుకుగా వ్యవహరించాయి.
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు
• మార్గమధ్యంలో మంగళగిరి వద్ద స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• కుంకీలకు స్వయంగా ఆహారం అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
• జెండా ఊపి గుచ్చిమి క్యాంపుకు సాగనంపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
@JanaSenaParty
కలసికట్టుగా పని చేస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం మనదే
•క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటే గెలుపు సులువవుతుంది
•విజయవాడ గడ్డపై జనసేన జెండా గర్వంగా ఎగిరేలా కష్టపడాలి
•శ్రీ @PawanKalyan గారు ఆశయాల సాధనే ధ్యేయంగా అడుగులుపడాలి
•జనసేన పార్టీ విజయవాడ నగర సమీక్షలో రాష్ట్ర మంత్రి శ్రీ @kanduladurgesh , జనసేన పార్టీ నాయకుల ప్రసంగం
‘రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తే కచ్చితంగా విజయం సాధిస్తామ’ని పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు పేర్కొన్నారు. నాయకులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తే గెలుపు మరింత సులువవుతుందని స్పష్టం చేశారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేలా మన ప్రణాళికలు ఉండాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరూ కష్టపడి పని చేస్తే వారికి తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యతను శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని, ఎవరికి ఏ పదవి ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆయనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ @mnadendla గారి నేతృత్వంలో విజయవాడ నగర సమీక్ష సమావేశం సుజన కన్వెన్షన్ హాలులో శుక్రవారం జరిగింది.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు మాట్లాడుతూ... “ఈ రోజు రాష్ట్రంలో జనసేన జెండా రెపరెపలాడుతోంది అంటే దానికి కారణం జనసైనికులు, వీరమహిళల అలుపెరగని శ్రమే. సార్వత్రిక ఎన్నికల్లో మీరంతా రాత్రింబవళ్లు పడిన కష్టం, చూపిన నిబద్ధత నిజంగా అభినందనీయం. అదే ఉత్సాహంతో, అదే పట్టుదలతో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మనం శ్రమించాల్సిన అవసరం ఉంది. విజయవాడ గడ్డపై జనసేన జెండాను గర్వంగా ఎగరవేయడమే మన తదుపరి లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం ఇప్పటి నుంచే ప్రజల్లో ఉందాం. వారి సమస్యలను తెలుసుకుంటూ, అవసరాల్లో తోడుగా నిలబడుతూ ప్రజలకు మరింత చేరువవుదాం. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, వారి నమ్మకాన్ని గెలుచుకుని కార్పొరేషన్ ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధమవుదాం.
•ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి అది సాధ్యం కాదు
జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం కోసం అధినేత శ్రీ @PawanKalyan గారు 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సమాచార సేకరణ కమిటీలను నియమించారు. అందులో భాగంగా, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా వెళ్లే అవకాశం నాకు దక్కింది. విజయవాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులను స్వీకరించాను. కేవలం అప్లికేషన్లు తీసుకోవడమే కాకుండా, వచ్చిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాను. నన్ను కలవడానికి వచ్చిన వారిలో మెజారిటీ నాయకులు, కార్యకర్తలు తామంతా పార్టీ స్థాపించినప్పటి నుండి జనసేన జెండాను మోస్తున్నామని గర్వంగా చెప్పారు. దశాబ్ద కాలంగా వారిలో ఉన్న నిబద్ధత నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అప్లికేషన్లు అందించిన వారిలో అత్యధికులు దైనందిన జీవితంలో కష్టపడి పనిచేసే సామాన్యులే. ముఖ్యంగా రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. సమాజంలో కింది స్థాయి వర్గాలుగా ఉన్న శ్రామికుల్లో ఇంతటి బలమైన రాజకీయ భావజాలం, మార్పు కోసం ఆరాటం ఉండటం నిజంగా అద్భుతం. ఇలాంటి నిస్వార్థమైన అండ ప్రపంచంలో ఏ ఇతర రాజకీయ పార్టీకీ సాధ్యం కాదు. అక్కడకు వచ్చిన విభిన్న వర్గాలను చూస్తే ఒక విషయం స్పష్టమైంది. జనసేన పార్టీ ఏ ఒక్క కులానికో లేదా మతానికో పరిమితమైనది కాదు. ఇది అన్ని కులాలు, మతాల ప్రజల ఆశలు, ఆశయాల నుంచి పుట్టిన నిజమైన పార్టీ. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మనం కీలక భాగస్వాములుగా ఉంటూ, పార్లమెంట్, శాసనసభలలో ప్రజా గళాన్ని అత్యంత బలంగా వినిపిస్తున్నాం. మనకు కేటాయించిన శాఖలను సమర్థవంతంగా, అద్భుతంగా నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకువస్తున్నాం. గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఉన్నత ఆశయాలు, లక్ష్యాలతో అయితే పార్టీని స్థాపించారో, ఆ ఆశయాల సాధనే ధ్యేయంగా మనం సరైన దిశలో అడుగులు వేస్తున్నాం. ఈ కూటమిలోని మూడు పార్టీలు ఇదే ఐక్యతతో, పరస్పర సమన్వయంతో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో కచ్చితంగా అఖండ విజయం సాధిస్తాం’’ అన్నారు.
•రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే విజయం మనదే : శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు
శాసనమండలి ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు మాట్లాడుతూ... “కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడక అవుతుంది. ఈ రెండేళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించాం. ముఖ్యంగా విజయవాడలో శాంతిభత్రలు విఘాతం కలగకుండా చూశాం. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు క్షేత్రస్థాయికి వెళ్లి పని చేయాలి. ముఖ్యంగా డివిజన్లలో చాలా సమస్యలు ఉన్నాయి.
ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీలను ఖరారు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మిగతా నియోజకవర్గాలలో కూడా స్వీయ పర్యవేక్షణలో ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కమిటీల నియామకం పూర్తి చేయనున్నారు*
#JSPMembershipToLeadership@JanaSenaParty
అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరి నందు జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి సత్వరమే సమస్యలు పరిష్కరించిన గౌరవ ప్రభుత్వ విప్,
శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు శాసనసభ్యులు తాడేపల్లిగూడెం.
@JanaSenaParty
20 గ్రామాలను కలిపే రోడ్డు, వాణిజ్యపరంగా కూడా ఒకే ఒక్క మార్గమైన రోడ్డు, అంబులెన్సుల నుండి ఏ అత్యవసర పనికైనా ఉపయోగించే ప్రధాన రోడ్డు, రెండు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ పడని రోడ్డు శ్రీ @PawanKalyan గారు రాగానే పడింది అని ఆనందం వ్యక్తం చేస్తున్నజంపర్ కోట గ్రామస్థులు.
వేగం పుంజుకున్న పల్నాడు–ప్రకాశం ‘జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార’ మెగా తాగు నీటి పథకాల పనులు
•40 శాతానికి పైగా పూర్తయిన ఇన్ టేక్ వెల్స్ – 200 కి.మీ. పైప్లైన్ నిర్మాణం పూర్తి
•పనుల్లో మరింత వేగం పెంచాలి
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి… తాగు నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
- ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆదేశం
•పనుల నాణ్యతను క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలిస్తానన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•నిర్ణీత గడువులోపు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో పని చేయాలని సూచన
•జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆర్.డబ్య్లూ.ఎస్. అధికారులతో సమీక్ష
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అధిక ప్రాంతాలు తాగునీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే పల్నాడు–ప్రకాశం లాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశా నిర్దేశం చేశారు. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకంలో భాగంగా పల్నాడు–ప్రకాశం ప్రాంతాల్లో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనులు నిర్ణీత గడువులోపు పూర్తి కావాలని ఆదేశించారు. బుధవారం పల్నాడు–ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతిని ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు వివరించారు. రెండు మెగా ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు రూ. 2,500 కోట్లు కాగా, అందులో రూ. 1,290 కోట్ల అంచనా వ్యయంతో ప్రకాశం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో, 593 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించిన ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించి ఇంటేక్ వెల్ నిర్మాణం పనులు 40 శాతానికి పైగా పూర్తయ్యాయి. 119 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్ పనులు, సంపులు, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రకాశం వాటర్ గ్రిడ్ పథకం కింద ఇప్పటి వరకు 53 కిలోమీటర్ల మేర పైపు లైన్ల నిర్మాణం పూర్తి చేసినట్టు వివరించారు.రూ. 1,200 కోట్లతో చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ పథకాన్ని 235 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించగా, ఇప్పటికే 152 కిలోమీటర్ల మేర పైపు లైన్ నెట్వర్క్ పూర్తయ్యింది. ఇన్ టేక్ వెల్స్, రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పనులు కూడా పురోగతిలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే రూ. 95 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేసినట్టు తాగునీటి సరఫరా విభాగం అధికారులు వివరించారు.
అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తాగు నీటి సమస్యతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులుపడుతున్న పల్నాడు, ప్రకాశం ప్రాంతాల ప్రజలకు ఈ ప్రాజెక్టులు జీవనాధారంగా మారనున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు చాలా కీలకమైనవి. వీటి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిర్ణీత గడువులోపు ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి, లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ తాగు నీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలి. గ్రామాల మధ్య పైపు లైన్ల నిర్మాణం, అటవీ అనుమతులు లాంటి సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి.
పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణ కార్యకలాపాలను సాధ్యమైనంత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలి. భుజం శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పనుల పురోగతిని పరిశీలించేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతాను. స్వయంగా పనుల నాణ్యతను పరిశీలిస్తా. జల్ జీవన్ మిషన్ పనుల్లో అలసత్వానికి తావివ్వొద్దు. పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు పూర్తయితే ఈ రెండు ప్రాంతాల పరిధిలోని సుమారు 10 నియోజకవర్గాల పరిధిలో 16 లక్షల మందికి పైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత ఏర్పడుతుంద”న్నారు.
Warm birthday greetings to the Hon'ble Chief Minister of Maharashtra, Sri @Dev_Fadnavis Ji.
Under your dynamic leadership, Maharashtra continues to scale new heights of growth, development, and progress across diverse sectors. I also thank you for your valuable cooperation and constructive approach in addressing inter-state issues, reflecting the true spirit of cooperative federalism.
I pray to Lord Ganesha to bless you with good health, strength, wisdom, and a long life to continue serving the people of Maharashtra.
@CMOMaharashtra
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన - PMGSY పనుల్లో ఆంధ్రప్రదేశ్ కి 2 వ స్థానం.
• రోడ్ల నాణ్యత లో ఏపీ మంచి ప్రమాణాలు పాటిస్తున్నట్టు కేంద్రం కితాబు.
• క్షేత్ర స్థాయిలో నాణ్యత పరిశీలన చెయ్యడంతో 2వ స్థానంలో AP.
• గత వైసీపీ హయాంలో 19వ స్థానం నుండి 2వ స్థానానికి ఆరోహణ
@JanaSenaParty
ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం :
మగ్గం పనులు చేసే వారి సమస్య చెప్పగానే ఆరోగ్య సమస్యలకు మెడికల్ క్యాంప్ లకు ఆదేశాలు ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
#PawanKalyanAneNenu