Hon'ble Chief Minister of Andhra Pradesh, Shri @ncbn Garu, visited Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu in Mumbai following his recent right shoulder surgery and enquired about his health and well-being.
The Hon'ble Chief Minister was accompanied by Hon'ble Ministers Shri @mnadendla Garu, Shri @Dr_NarayanaP Garu, Shri @SatyaAnagani Garu, and Hon'ble Member of Parliament Shri @MPLingamaneni Garu. They conveyed their best wishes for the Hon'ble Deputy Chief Minister's speedy recovery and early return to public service.
ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ గారు ముఖ్యమంత్రివర్యులతో కలిసి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు.
@mnadendla@Dr_NarayanaP@SatyaAnagani@MPLingamaneni
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు...
ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి.
జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం.
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.
శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం.
ఓం శాంతి. 🙏
A Voice That Lives Forever
Though the voice has fallen silent,
her melodies will echo through eternity.
Legendary playback singer Padma Bhushan Smt. S. Janaki Garu leaves behind an unparalleled musical legacy. Over a career spanning nearly seven decades, she mesmerized generations by rendering more than 48,000 songs across 17+ Indian and international languages. She was honoured with 4 National Film Awards and 12 Nandi Awards, along with numerous other State honours, making her one of India's most celebrated playback singers.
For Telugu audiences, she also lent her soulful voice to "O Daivama" in Pawan Kalyan Garu's debut film, "Akkada Ammayi Ikkada Abbayi", a melody that remains cherished by fans.
Pawan Kalyan Creative Works pays its heartfelt tributes to the legendary Smt. S. Janaki Garu.
Her voice will never fade. It will continue to inspire generations, and her timeless melodies will live on forever.
Om Shanti.
#SJanaki
Hon'ble Chief Minister Shri @ncbn visited Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan in Mumbai following his successful right shoulder surgery.
Sri Chandra Babu Naidu Garu wished Sri Pawan Kalyan Garu a speedy and complete recovery.
Heartiest birthday greetings to the Hon’ble Union Defence Minister, Shri @rajnathsingh Ji.
A statesman admired for his wisdom, humility, and unwavering commitment to the Nation, your leadership has significantly strengthened India’s security, enhanced our defence capabilities, and advanced the vision of an Aatmanirbhar Bharat. Your decades of dedicated public service continue to inspire and earn the admiration of people across the country.
Wishing you good health, happiness, and many more years of distinguished service to the Nation.
- @PawanKalyan@DefenceMinIndia@PIB_India@IPR_AP@pibvijayawada
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు దర్శించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో విబి జీ – రాం జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేరుగా తిరుమల వెళ్లి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతోపాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. దీక్షలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం శ్రీవారిని దర్శించుకోవాలని తలంచారు. ఇందులో భాగంగా సాయంత్రం దర్శనానికి వెళ్లారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు తిరుపతి శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.