Dear TDP Social Media Warriors & Janasainiks,
జనసేన పార్టీ కార్యకర్తల పేరుతో @jaitdp నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిపై, విద్యా శాఖా మంత్రి @naralokesh గారిపై, వారి కుటుంబ సభ్యులపై, టీడీపీ సానుభూతిపరులపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, అలాగే టీడీపీ పేరుతో @JanaSenaParty నాయకులు లేదా కార్యకర్తలను దూషిస్తూ, ప్రతికూల పోస్టులు చేస్తున్నవారు. అలాగే వైసీపీ చేస్తున్న డీఎస్సీ ఫేక్ ప్రచారం పై, ప్రభుత్వ విధానాలపై, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా పోస్టులు వేస్తున్న ఇరు పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి...
మీలో కొంతమంది వారి వారి వ్యక్తిగత కోపాలు, ఆవేశంతో సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ, పార్టీ ఆదేశాలు, పాటించకుండా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలాంటి పరిస్థితులకు అవకాశం ఇచ్చి, వైసీపీ కి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఇవ్వకండి. ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనపై సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
ప్రతీ రోజు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలకు దిగకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేయండి. ప్రస్తుతం మనం ఒక ఉమ్మడి కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కలిసి పనిచేయాల్సిన సమయంలో ఉన్నాం. ఈ సమయంలో మన మధ్య మనమే పోరాడటం కాకుండా, మన ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్సార్సీపీపై పోరాడటంపైనే దృష్టి పెట్టాలి. కూటమి ఐక్యతను, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత.
NTR గారిని కొంతమంది జనసైనిక్స్ తిట్టడం, దానికి ప్రతిగా చిరంజీవి గారిని కొంతమంది టీడీపీ కార్యకర్తలు తిట్టడం, ఇరు పార్టీల నాయకులు ప్రాతినిధ్యం వహించే శాఖల్లో అవగాహన లేకుండా లోపాలు ఎంచి బురద చల్లడం మంచి పద్ధతి కాదు.
దయచేసి ఈ విషయంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నాను. ఏదైనా ఉంటే మీరు పార్టీ దృష్టికి, లేదా పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఎవరో ఒకరి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల నుండి ఇప్పటి వరకు వచ్చిన కొన్ని అంశాలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
అదేవిధంగా, @jaitdp మరియు టీడీపీ సానుభూతిపరులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుటుంబ సభ్యులపై అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన జనసేన కార్యకర్తలతో ఆ పార్టీ నాయకత్వం చర్చించి, తగిన విధంగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. ఈ అంశాన్ని ఇరు పార్టీలు పరిష్కరించేలా కృషి చేస్తాయి..
టీడీపీ పార్టీ, టీడీపీ కార్యకర్తల ఆత్మగౌరవం భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించదు. అదే సమయంలో, కూటమి ఐక్యతను కాపాడుకోవడం, పరస్పర గౌరవాన్ని పాటించడం, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మనం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలం అని గుర్తుంచుకోండి.
జై తెలుగుదేశం, జై కూటమి, జై హింద్
#KutamiPrabhutvam #BJP #TDP #JSP #BJPTDPJSP
#AndhraPradesh